తన పరిధికి మించి ఊహించేసుకోవటం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు కొత్తేం కాదు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం సంగతి ఏమోగానీ, ఇప్పటికీ ఛాన్స్ దొరికితే హైదరాబాద్ గురించే డప్పు వాయించుకుంటూ ఉంటుంటాడని కొందరు నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానించటం చూశాం. అయితే తాజాగా మళ్లీ ఆయన చేసిన కామెంట్లు వింటే ఎవరికైనా బాబు అతి చేస్తున్నాడా? అనిపించకమానదు.
ప్రముఖ దిన పత్రిక ఇండియా టుడే చెన్నైలో సదస్సును నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దానికి చంద్రబాబు నాయుడు కూడా హాజరయ్యాడు. అయితే అయ్యాడు కానీ, అక్కడ బాబుగారు ఇచ్చిన ఉపన్యాసం గురించే అసలు డిస్కషన్ మొదలైంది. గతంలో తనకు రెండు సార్లు ప్రధాని అయ్యే అవకాశం వచ్చిందని, కానీ, కేవలం ఏపీ(అప్పుడు ఉమ్మడి రాష్ట్రం) కోసమే వాటిని రెండు సార్లు వదిలేశానని చెప్పుకొచ్చాడు.
హెచ్ డీ దేవగౌడ, ఐకే గుజ్రాల్ (ఇద్దరు ఎంతో కాలం పాలించలేదు) ప్రధానులుగా అయ్యే సమయంలో తనను ప్రధాని కావాలంటూ విజ్నప్తి చేశారని, అయితే ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే నంబర్ 1 గా చేయాలన్న ఉద్దేశ్యంతోనే తాను దానిని తృణప్రాయంగా వదిలేశానని చెప్పుకోచ్చాడు. ఒకవేళ ఇప్పుడు కూడా అలాంటి అవకాశమే వచ్చినా తాను అస్సలు పట్టించుకోనంటూ మరో స్టేట్ మెంట్ కూడా చేశాడు. పోలవరం ప్రాజెక్టు కోసం తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో కలపాలని, లేదంటే తనకు ఈ పదవి (ముఖ్యమంత్రి) అవసరం లేదని తాను ప్రధాని నరేంద్ర మోడీకి తేల్చి చెప్పానని కూడా చెప్పటం విశేషం.
అంతా బాగానే ఉంది కానీ, తొమ్మిదేళ్ల పరిపాలనలో ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారన్న ప్రశ్నకు మాత్రం ఆయన నీళ్లు నమలాల్సి వచ్చింది. అయినా ప్రధాని అయ్యే అర్హతలున్న వ్యక్తిని ప్రజలు (2004, 2009 ఎన్నికల్లో) ఎందుకు తిరస్కరించారు చెప్మా?
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more