రాజకీయ లబ్దికి ఏమాత్రం అస్కారం లేకుండా ప్రజాహితంగా చేయాల్సిన పనులు కూడా తమ స్వప్రయోజనాలు, రాజకీయ దుర్భేథ్యంతో సాగిస్తున్న క్రమంలో రాజకీయ నేతలు తమ పదపులను కూడా పణంగా పెట్టి మరీ ప్రభుత్వాలకు ఎదురు తిరిగేందుకు సిద్దమవుతున్నారు. మరికోందరు తమ పదవులను త్యాజించి మరీ తమ నియోజకవర్గ ప్రజల అభిమతం, అభిలాషలను నేరవేర్చేందుకు కూడా సిద్దపడుతున్నారు. ఏకబిగిన కురిసిన వర్షాల కారణంగా చల్లారిందని భావించిన జిల్లాల పునర్ వ్యవస్థీకరణ, నూతన జిల్లాలు, మండలాల ఏర్పాటు కాస్తా మళ్లీ రాజుకుంటుంది.
దసరా నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడంతో అనేక ప్రాంతాల నుంచి జిల్లాల ఏర్పాటు విషయంలో అందోళనలు వెల్లివిరిసాయి. అయితే అందోళనలను లైట్ గా తీసుకున్న సర్కార్.. వాటిని పెడచెవిన పెడుతూనే జిల్లాల ఏర్పాటుకు కసరత్తును ముమ్మరం చేసింది. ఈ క్రమంలో పలు చోట్ల ప్రజల విజ్ఞప్తులను పరిశీలించిన సర్కార్ వాటిని పరిష్కరించే దిశగా కూడా సమాలోచనలు జరిపింది, అయితే పలు చోట్ల మాత్రం కేవలం రాజకీయ లబ్ది కోసమే వినతులు వెల్లువెతుత్తుతున్న పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినబడతున్నాయి.
ఈ క్రమంలో మహబూబ్ నగర్ జిల్లాలో తమ ప్రాంతం పేరున జిల్లాను ఏర్పాటు చేయాల్సిందిగా అత్యంత అధికంగా ప్రజాగ్రహం పెల్లుబిక్కుతున్న ప్రాంతం గద్వాల.. గద్వాల జిల్లాను ఏర్పాటు చేయకపోవడానికి కారణం అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే డీకే అరుణ కారణంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో డీకే అరుణ తన శాసనసభ్యత్వానికి రాజీనామ చేయడానికి సిద్దపడుతున్నట్లు సమాచారం. గద్వాల జిల్లాకు తన పదవే అడ్డుగా ప్రభుత్వం భావిస్తే.. దాని వదులుకునేందుకు కూడా తాను సిద్దమన్న సంకేతాలను ఇప్పటికే ఆక్కడి ప్రజలకు ఇచ్చింది.
ఈ క్రమంలో అరుణ.. గద్వాల జిల్లాను ఏర్పాటు చేయాలని కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాయనున్నారని సమాచారం. ఇందులో తన పదవిని కూడా తాను వదులుకోవడానికి సిద్దమన్న విషయాన్ని కూడా పేర్కోంటారని తెలుస్తుంది. సీఎం కేసీఆర్ తో పాటు స్పీకర్ ఎస్.మధుసూదనాచారిని కూడా కలసి రాజీనామా లేఖ సమర్పించాలని ఆమె యోచిస్తున్నట్టు తెలిసింది. గద్వాల జిల్లా ఏర్పాటుకు తన పదవే అడ్డని టీఆర్ఎస్ భావిస్తున్నందుకు రాజీ నామాకు అరుణ సిద్ధపడుతున్నారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. గద్వాల జిల్లా కోసం ఎమ్మెల్యే పదవిని త్యాగం చేసేందుకు సిద్ధమని ఆమె ప్రకటించారు.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more