తెలుగుదేశం పార్టీలొ రాజకీయం రసవత్తరంగా మారిందా....? లోకేష్ కు ఇప్పటికే పార్టీలో కీలకంగా వ్యవహరించే స్వేచ్ఛ కల్పించిన చంద్రబాబు మరింత స్వేచ్ఛను కల్పించనున్నారా...? అందులో భాగంగా లొకేష్ కు నేరుగా బాధ్యతలు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయా అంటే అవుననే సమాధానం వస్తోంది. నిన్న మొన్నటి దాకా కేవలం పార్టీ పదవులను మాత్రమే అనుభవించిన లోకేష్ ఇక మీదట ప్రజల సభలోకి వెళుతున్నారా అనే అనుమానాలకు దాదాపుగా తెర పడినట్లే చెబుతున్నాయి తెలుగుదేశం వర్గాలు. తాజాగా లోకేష్ను రాజ్యసభకు పంపే యోచనలో చంద్రబాబు ఉన్నారని చెబుతున్నారు.
లోకేష్ను రాష్ట్ర కేబినెట్లోకి తీసుకుని ఐటీ మంత్రిని చేస్తారని తొలుత వార్తలొచ్చాయి. అయితే ఢిల్లీ స్థాయి పదవితో చట్టసభల్లోకి ఎంటరయితే బాగుంటుందన్న అభిప్రాయానికి అధినేత వచ్చారని చెబుతున్నారు. హస్తిన స్థాయిలో పరిచయాలు పెంచుకుంటే భవిష్యత్తులో రాష్ట్ర రాజకీయాలను నడపడం ఈజీ అవుతుందని భావిస్తున్నారు. కేవలం రాజ్యసభతో సరిపెట్టకుండా కేంద్ర కేబినెట్లోకి కూడా చినబాబును చేర్చేలా వ్యూహరచన చేస్తున్నారట. లోకేష్ రాజ్యసభకు వెళ్లదలుచుకుంటే ఎవరూ అడ్డుచెప్పే పరిస్థితి లేకపోయినా ఏపీ నుంచి టీడీపీకి దక్కే మూడు రాజ్యసభ స్థానాలను ఎవరెవరితో భర్తీ చేస్తారన్నదానిపై ఆసక్తి నెలకొంది.
కేంద్రమంత్రులు సుజనా చౌదరి, నిర్మలా సీతారామన్ ఇద్దరి పదవి కాలం ఏప్రిల్లో ముగుస్తోంది. కాంగ్రెస్ ఎంపీలుగా ఉన్న జేడీ శీలం, జైరాం రమేష్ పదవి కాలం కూడా అదేసమయంలో ముగుస్తోంది. ఈ నాలుగు స్థానాల్లో మూడు టీడీపీకి, ఒకటి వైసీపీకి దక్కుతాయి. మూడుస్థానాల్లో సుజనా, నిర్మల సీతారామన్కు రెన్యువల్ తప్పని సరిగా చేయాల్సి ఉంటుంది. లేకుంటే వారి మంత్రి పదవులకు ఇబ్బంది వస్తుంది. ఒకవేళ లోకేష్ను కేంద్ర మంత్రిని చేయాలనుకుంటే సుజనాకు అవకాశం దక్కకపోవచ్చు అంటున్నారు. వీరే కాకుండా ఏపీ కోటాలో రాజ్యసభకు వెళ్లేందుకు వెంకయ్యనాయుడు, యనమల రామకృష్ణుడు కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నిజంగా లోకేష్బాబును రాజ్యసభకు పంపుతారా లేక మరో ఆలోచన చేస్తారా అన్నది తేలాలంటే మరికొద్ది నెలలు ఆగాలి.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more