దేశ రాజధాని ఢిల్లీలో ఘోర పరాజయం తరువాత ఇటు మహారాష్ట్ర, జమ్మూకాశ్మీర్ లలో కూటములతో కలసి అధికారాన్ని పంచుకున్న బీజేపి.. తాజాగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన తరువాత సోస్టుమార్గం నిర్వహిందింది. కేంద్రంలో అధికారానికి అందించిన మద్దతును బీహార్ ప్రజలు రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఎందుకు తమకు దూరమైయ్యారన్న కారణాలను విశ్లేషించుకుంది. మహా కూటమి పేరిట బరిలోకి దిగిన జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు తమ సీఎం అభ్యర్థిగా నితీశ్ కుమార్ ను రంగంలోకి దించి ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించాయన్న విషయాన్ని అంగీకరించాయి.
అయితే బీజేపీ మాత్రం తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును ప్రకటించేందుకు సాహసించలేదు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలుమార్లు ఆ రాష్ట్రంలో పర్యటించినా ఫలితం లేకపోయింది. ఇక దేశంలోనే అత్యంత కీలక రాష్ట్రంగా పరిగణిస్తున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2017లో జరగనున్నాయి. బీహార్ కంటే యూపీలో బీజేపీ బలం బాగానే ఉంది. అయితే, బీహార్ లో మాదిరిగా సీఎం అభ్యర్థిని ప్రకటించకుండా బరిలోకి దిగితే ఇబ్బందులు తప్పవన్న భావన ఆ పార్టీ అగ్రనేతల్లో వ్యక్తమవుతోంది.
అంతేకాక ఇప్పటికే యూపీ సీఎంగా ఎస్పీ నేత అఖిలేశ్ యాదవ్ దూసుకెళుతున్నారు. మరోవైపు ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతి రూపంలో పెను ముప్పే పొంచి ఉందని బీజేపీ నేతలు లెక్కలేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఉత్తరప్రదేశ్ లో భారీ ప్రభావమే చూపనున్నారు. ఈ క్రమంలో వీరందరినీ నిలువరించి ఎన్నికల్లో సత్తా చాటాలంటే, ముందుగానే సీఎం అభ్యర్థి పేరును ప్రకటించాలని బీజేపీ నేతలు దాదాపుగా నిర్ణయించారు.
అంతేకాక ఇప్పటికే యూపీ సీఎంగా ఎస్పీ నేత అఖిలేశ్ యాదవ్ దూసుకెళుతున్నారు. మరోవైపు ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతి రూపంలో పెను ముప్పే పొంచి ఉందని బీజేపీ నేతలు లెక్కలేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఉత్తరప్రదేశ్ లో భారీ ప్రభావమే చూపనున్నారు. ఈ క్రమంలో వీరందరినీ నిలువరించి ఎన్నికల్లో సత్తా చాటాలంటే, ముందుగానే సీఎం అభ్యర్థి పేరును ప్రకటించాలని బీజేపీ నేతలు దాదాపుగా నిర్ణయించారు.
ఈ పేరు ఎవరిదైతే బాగుంటుందన్న కోణంలో యోచించిన ఆ పార్టీ అగ్రనేతలకు మేనకా గాంధీ కుమారుడు, సుల్తాన్ పూర్ ఎంపీ వరుణ్ గాంధీ కనిపించారు. యువ నాయకులుగా ఇటు రాష్ట్రంలో అఖిలేశ్ యాదవ్, అటు జాతీయస్థాయిలో రాహుల్ గాంధీలు దూసుకుపోతున్న తరుణంలో.. వారికి వయస్కుడైన వాడినే ఎంపిక చేయాలని వరుణ్ గాంధీ పేరును ఎంపిక చేసినట్లు విశ్వసనీయ సమాచారం. కొందరు నేతలైతే వరుణ్ ను మించిన ప్రత్యామ్నాయం మరేదీ లేదని కూడా చెబుతున్నారు. దీంతో యూపీ ఎన్నికల్లో బీజేపీ సీఎం అభ్యర్థిగా వరుణ్ గాంధీ రంగంలోకి దిగనున్నారన్న ఊహాగానాలు బీజేపీలో జోరుందకున్నాయి
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more