బిహార్లో ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో విజయాన్ని అందుకోవాలన్న ఏకైక లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఎన్డీయే కూటమి.. మరో ప్రజాకర్షక హామీని ప్రకటించి.. ఇరాకాటంలో పడిందా..? లేక వ్యూహాత్మకంగానే దీనిని ప్రకటించిందా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. నువ్వా-నేనా అన్నట్లు సాగుతున్న ఈ ఎన్నికలల పోరులో గెలుపు కోసం హామీలను గుప్పించడం తప్పులేదని భావిస్తున్న పార్టీలు.. తాము అధికారంలోకి వస్తే అరచేతిలో వైకుంఠాన్ని చూపెడతామని హామీలు గుప్పించడం మామూలే.
అయితే కేంద్రంలో కోలువుదీరిన నరేంద్రమోడీ ప్రభుత్వం ఈ తరహా హామీలను గుప్పించడం.. షరామామూలుగానే మారిందన్న విమర్శలు వినబడుతున్న తరుణంలో విద్యార్థినులను, వారి తల్లిదండ్రులను టార్గెట్ గా చేసుకుని హామీలను గుప్పించింది. బీహార్ లో తాము అధికారంలోకి వస్తే పది, పన్నెండో తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 5,000 మంది విద్యార్థినులకు స్కూటీలను ఇస్తామని ఇదివరకే ప్రకటించిన ఎన్డీయే కూటమి.. ఇప్పుడు వారికి రెండేళ్ల వరకు ఉచితంగా పెట్రోల్ సౌకర్యాన్ని కూడా కల్పించనుంది.
గతంలో ఢిల్లీ ఎన్నికలలో తాము అధికారంలోకి వస్తే దేశరాజధానికి రాష్ట్ర హోదా కల్పిస్తామని చెప్పిన బిజేపీ.. తాము ఓటమి పాలవ్వడంతో ఆ హామీ గురించి పట్టించుకున్న దాఖలాలు కూడా లేవు. ఇక ఆంధ్రప్రదేశ్, బీహార్ లకు ప్రత్యేక హాదా కల్పిస్తామని చెప్పిన బిజేపీ.. సరిగ్గా ఎన్నికల ముందర ప్యాకేజీని ప్రకటించి.. ప్రజలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాన్ని చేస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పన హామీపై ఏడాదిన్నరగా మీనమేషాలు లెక్కిస్తూ.. తప్పిదాన్ని అంతకుముందు అధికారంలో వున్న యూపీఏ ప్రభుత్వం వేసింది. యూపీఏ ప్రభుత్వం ప్రత్యకహోదా అంశాన్ని పునర్విభజన బిల్లులో జోడించలేదని చేతులెత్తెసింది. దీనిపై పెద్దఎత్తున నిరసనలు వ్యక్తం కావడంతో కమిటీని వేసి పరిశీలిస్తుంది..
ఇక బీహార్ ఎన్నికలలో విద్యార్థినులకు ఇచ్చిన హామీ కూడా రమారమి ఇలాంటి అనుమానాలనే రేకెత్తిస్తుంది. అత్యత్తమ ప్రతిభ కనబర్చిన పది, పన్నెండు విద్యార్థినులకు స్కూటీలను బహుమతిగా ఇస్తామని చెప్పిన బీజేపి వారికి రెండేళ్ల పాటు పెట్రోలును కూడా ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. అయితే విద్యార్థినులు పదో తరగతి ఉత్తీర్ణుత సాధించే విద్యార్థినులు అవరేజ్ గా 14 ఏళ్ల వయస్సుంటారు. లేదంటే పదిహేనేళ్ల వయస్కులై వుంటారు. ఇక పన్నెండో తరగతి ఉత్తీర్ణత సాధించే వారు 16 నుంచి 17 వయస్సువారై వుంటారు. అంటే వీరు స్కూటీలు నడపేందుకు అనర్హులు. అదెలా అంటారా..?
పద్దెనిమిదేళ్లు నిండితే కానీ విద్యార్థినీ విద్యార్థులకు టూవీలర్ డ్రైవింగ్ లైన్సెన్సు తీసుకునేందుకు అర్హులు కాదు. అంటే.. ఇక పది, పన్నెండు ఉత్తీర్ణులైన విద్యార్థినులకు స్కూటీలు.. రెండేళ్ల పాటు పెట్రోల్ ఉచితంగా ఇవ్వడానికి ఆ రాష్ట్ర రవాణ శాఖ అనుమతి నిరాకరిస్తుంది. దీంతో రవాణా శాఖను అడ్డుగా పెట్టుకుని.. రేపటి నాటికి ఎన్నికలలో విజయాన్ని సాధించినా.. బీజేపి స్కూటీ, పెట్రోల్ హామీగానే మిగులుతుంది తప్ప.. ఆచరణకు నోచుకోదన్నది వాస్తవం. లేక అధికారంలో వున్న కేంద్రం ద్విచక్ర వాహనాలను నడిపేందుకు వయస్సును రెండు నుంచి మూడేళ్లు తగ్గిస్తే మాత్రం ఇది అమలు అవుతుంది. మరి ఈ హామీని బీజేపి పార్టీ ఎలా అమలుపరుస్తుందన్నది వేచి చూడాల్సిందే.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more