ఉరిమి ఉరిమి మంగళం మీద పడిందన్నట్లు… రాజకీయ నాయకులూ వాళూ వీళ్లు గొడవపడి ఫైనల్ గా అధికారులపై పడుతుంటారు. ఇది ఆ పార్టీ ఈ పార్టీ అనేమీ తేడా లేదు. అధికారంలో ఉన్నవారు వాడుకుంటారు, ప్రతిపక్షంలో ఉన్నవారు బెదిరిస్తుంటారు. మొన్నీ మధ్యన వైసీపీ నాయకులు.. తాజాగా తెలంగాణ టిడిపి నేత రేవంత్ రెడ్డి అధికారులనే టార్గెట్ గా చేస్తూ మాట్లాడటం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కత్తెరలో పోకలా తమను అందరూ బెదిరించే వారేనని అధికారులు తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయినా ఏమైనా ఉంటే మీరు మీరు చూసుకోవాలి కానీ... తర్వాత మీ సంగతి చూసుకుంటాం అంటూ హెచ్చరించడం ఏంటని మండిపడుతున్నారు.
‘‘జీ.హెచ్.ఎం.సీ. కమీషనర్ సోమేష్ కుమార్ అంట.. కమీషనర్.. ఎక్కడెక్కడైతే టీడీపీ నేతలు పచ్చతోరణాలు కట్టినారో ఇవాళ వాటన్నింటినీ తీయించే పని చేస్తున్నారు.. బిడ్డా సోమేష్ కుమారు గుర్తుపెట్టుకో… నువూ ఇక్కడ కాదు మరలా రావలసింది మా దగ్గరికే… నువ్వు ఇయ్యాల తెరాస కార్యకర్తగా మారి.. తెలుగు దేశం ఫ్లెక్సీలు తొలగిస్తున్నావ్ బిడ్డా.. అదే మేమనుకుంటే.. ఈ ట్విన్ సిటీస్ లో ఏ ఒక్క టీఆరెస్ జెండా కనిపించకుండా తీసి తగలుబెట్టేస్తా’’ మని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ప్రజా ప్రతినిధి అయ్యి ఉండి ఇలా అధికారులను బెదిరించడమేమిటని పలువురు రేవంత్ ను ప్రశ్నిస్తున్నారు. ఇది మంచి సంప్రదాయం కాదని హితవు పలుకుతున్నారు!
మాగంటి బాబు, అయ్యన్న పాత్రుడు, అచ్చెన్నాయుడు, కెఈ కృష్ణమూర్తి ఇప్పుడు తాజాగా రేవంత్ రెడ్డిలు మొత్తంగా టిడిపి నేతలు అందరూ ఉద్యోగులను బెదిరించడం పార్టీ మనుగడకు ఎంత మాత్రం మంచిది కాదు. అయితే చంద్రబాబు నాయుడుకు గతంలో ఉద్యోగుల దెబ్బ రుచి తెలిసినా కూడా తన పార్టీకి చెందిన ముఖ్యులు మాట్లాడుతుంటే మాత్రం అడ్డుచెప్పలేకపోతున్నారు. చంద్రబాబు నాయుడుకు ఉద్యోగ సంఘాలు గతంలో చుక్కలు చూపించాయి. అయినా మారకపోతే మాత్రం ఖచ్చితంగా పోయేకాలం దగ్గరే ఉందంటున్నారు శిశ్లేషకులు. తాను తప్పు చేసినా... తన వాళ్లు తప్పు చేసినా కానీ చివరకు అది చంద్రబాబు నాయుడుకే గండంగా మారుతుంది అంటూ వస్తున్న వార్తలు నిజమవుతాయో లేదో చూడాలి.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more