వడ్డించే వాడు మనవాడు అయితే బంతి చివర్లో కూర్చున్నా మన వాటా మనకు వస్తుంది అని తెలుగులొ ఓ చందం ఉంది. అచ్చంగా ఈ చందానికే అన్నట్లు తెలుగు తమ్ముళ్ల వ్యవహారం ఉంది. అవును పచ్చ చొక్కా వేసుకున్నోళ్లకు పింఛను అనగానే మనం కూడా పక్క చొక్కా వేసుకుందాం చెక్కేద్దాం.. పింఛను కొట్టేద్దాం అనుకుంటున్నారేమో అస్సలు కుదరదు. ఎందకంటే రూల్ ఈజ్ రూల్ కానీ బయటివాళ్లకు మాత్రమేనట. సాధారణంగా బలహీనవర్గాల ప్రజలకు, ఎలాంటి ఆసరా లేనివారికి పింఛన్లు ఇవ్వటం మామూలే.. కానీ ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఒక కొత్త సంప్రదాయానికి ఏపీలోని చంద్రబాబునాయుడు ప్రభుత్వం తెరలేపిందని సమాచారం. ఇప్పటికే కార్యకర్తలకు లైప్ ఇన్సూరెన్స్ చేయించిన తెలుగుదేశం పార్టీ, ఇక మీదట పార్టీ కార్యకర్తలకు సైతం పింఛన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుందట.
తమ వెంట నడిచే కార్యకర్తలకు ప్రభుత్వపరంగా ఏదో ఒకటి చేయాలని ఏపి మంత్రులు ఎంతోకాలంగా ఆలోచిస్తున్నారట. ఈ విషయాన్ని పార్టీ అధినాయకుడు, ముఖ్యమంత్రి చెవిలో వేసేందుకు సమయంకోసం ఎదురుచూశారని, తాజాగా జరిగిన ఏపీ క్యాబినెట్ సమావేశంలో కార్మిక, యువజన క్రీడలశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తన మనసులో మాటను కేబినెట్ సమావేశంలో చంద్రబాబునాయుడికి చెప్పడంతో ఆయన అంగీకరించారని ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు. ప్రభుత్వం ప్రకటించే పలు సంక్షేమ పింఛన్లను పార్టీ కార్యకర్తలకు, వారి బంధువులకు ఇస్తారన్నమాట! ఏపీలో తమకు 54లక్షలు ఉందని పార్టీ నేతలు చెప్తున్నారు. ఇందులో క్రియాశీల సభ్యులు దాదాపు 31 లక్షల మంది ఉంటారని వారు పేర్కొంటున్నారు. వీరికి తలా వెయ్యి రూపాయల చొప్పున పింఛను ఇచ్చినా.. నెలకు రూ.310 కోట్ల పైమాటే! ఆర్థికంగా ఇబ్బందులో ఉన్న రాష్ట్రంలో ప్రజా సంక్షేమ నిధులను పార్టీ కార్యకర్తలకు మళ్లించడమేంటనే ప్రశ్న తలెత్తుతున్నది. వాటన్నింటినీ పక్కనపెట్టి.. కార్యకర్తలను కాపాడుకోవడమే లక్ష్యంగా ఈ వ్యవహారానికి ఆలోచన జరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా పచ్చ చొక్క వోళ్లకు పచ్చ నోట్లు పింఛన్ రూపంలో వస్తాయంటూ అప్పుడే కొంత మంది సంబరాలు కూడా చేసుకుంటున్నారట.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more