narasimhan to be ousted from post of governor, sathasivam replaces him

Justice sathasivam to replace governor narasimhan

justice sathasivam to replace governor narasimhan, governer narasimhan, kerala governor sathasivam, former chief justice of india sathasivam, narsimhan ousted from governor post, governor narasimhan, narasimhan news, narasimhan updates, narasimhan news, bjp central ministry, central government, bjp second term governors, bjp party controversy, governor narasimhan gossips, Bjp central ministry second term on congress governors

According to the political sources the news is going viral that bjp government will remove narasimhan from governor post soon, justice sathsivam will replace him.

తెలుగురాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ గా జస్టిస్ సదాశివం..?

Posted: 04/07/2015 06:46 PM IST
Justice sathasivam to replace governor narasimhan

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌గా కొనసాగుతూ తన మంచి తనంతో.. ప్రజల మద్య ఇక్కట్లను దూరం చేస్తున్న ఇక్కడు శ్రీనివాసన్ లక్ష్మీ నరసింహన్ ఇబ్బందుల్లో పడ్డారా..? ఇందుకు ఆయన చేత బలవంతంగా శాఖధిపతులు నిర్ణయాలు తీసుకునేలా వ్యవహరించడమే కారణమా అంటే అవుననే సమాధానాలే వస్తున్నాయి. గత 2009 డిసెంబర్ నుంచి సమైక్య రాష్ట్రంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి గవర్నర్ గా వ్యవహరించిన ఆయన ఆ తరువాత రెండు పర్యాయం కూడా జూన్ రెండున రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ గా కోనసాగుతూ వస్తున్నారు.

అయితే రెండో పర్యాయం పదవీ బాధ్యతలు చేపట్టేందుకు ముందు ఆయన తెలంగాణలోకి ప్రవేశించే ఆంధ్ర వాహనాలపై విధించిన ఎంట్రీ టాక్స్ వ్యవహరామే అతిడిని పదవికి దూరం చేయనుందని సమాచారం. ఆయన స్థానంలో న్యాయ కోవిదుడిని నియమించాలని కేంద్రం భావిస్తోందా? రెండు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి న్యాయ కోవిదులైతేనే మేలని నిర్ణయించిందా!? అంటే అవుననే వాదనలే అధికంగా వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే, నరసింహన్‌ స్థానంలో కేరళ గవర్నర్‌, సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ పళనిస్వామి సదాశివంను నియమించనున్నారని వార్తలు అందుతున్నాయి.

అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు పరిష్కరించేందుకు, దేశ మాజీ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్‌ సదాశివం వంటి అత్యున్నత స్థానంలో పనిచేసిన వ్యక్తి ని నియమించాలని ప్రభుత్వ భావిస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం సదాశివం కేరళ గవర్నర్ గా బాద్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే, నరసింహన్‌ మాదిరిగానే జస్టిస్‌ సదాశివం కూడా తమిళనాడుకు చెందినవారే కావడం గమనార్హం. కాగా, ఏపీకి చెందిన సీనియర్‌ నేత ప్రొఫెసర్‌ ఎస్‌వీ శేషగిరిరావును గవర్నర్‌గా నియమించాలని కోరుతూ కేంద్ర పట్టణాభివృద్ది మంత్రి వెంకయ్యనాయుడు కూడా సిఫారసు చేసినట్లు సమాచారం

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : narasimhan  sathasivam  governer  telugu states  

Other Articles