నిన్నటి వరకు తెలుగు విద్యార్థులం.. సమైక్యాంద్రులం. కానీ నేటి నుండి తెలంగాణ విద్యార్థులు వేరు? ఆంధ్ర విద్యార్థులు వేరు? మాట్లాడేది తెలుగు అయినా.. కొంచె యాస ఉంటుంది. కానీ 64 సంవత్సరాలు కలిసి ఉన్నప్పటికి.. మాకు వారు శత్రువులే!! ‘‘పాకిస్థాన్ పిల్లలు ముద్దు !! ఆంధ్రపిల్లలు వద్దు!!’’ అనే నినాదంతో.. తెలంగాణ సర్కార్ వ్యవహరిస్తుంది.
అసలే ఏ రాష్ట్రంలో ఉన్న తండ్రి అయినా.. తన పిల్లలకు మంచి జరగాలని, తమ ప్రభుత్వం అదుకోవాలని కోరుకుంటారు. అలాగే మంచి ప్రభుత్వానికి ఓటు వేసి ఎన్నుకోవటం జరుగుతుంది. ఆయా ప్రభుత్వం .. తమ జీవితాలు, తమ పిల్లలు జీవితాలు మార్చుతుందని ఆ రాష్ట్రా ప్రజలు ఆశపడతారు? కానీ తెలంగాణ ప్రజలకు, విద్యార్థులకు, ఆశలు..అడియాశలే అవుతున్నాయి.
‘‘ఎంత పగవాడైన.. ఆపదలో ఉన్న అన్నదమ్మున్ని ఆదుకోవటం చాలా సహజంగా జరుగుతుంది’’. కానీ తెలంగాణ ప్రజలు ఓటు వేసి ఎన్నుకున్న పాపానికి. తమ పిల్లలకు శిక్షపడుతుందని తెలంగాణలో ప్రతి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాయ కష్టం చేసి భారీ ఫీజులు కట్టి .. పిల్లలను చదివించుకొని .. ఇంజనీరింగ్, డాక్టర్లగా చూడాలనే తెలంగాణ తల్లిదండ్రుల ఆశలపై.. తెలంగాణ సర్కార్.. గులాబీ రంగు నీళ్లు చల్లింది.
‘‘ఆకలి అవుతుంది అన్నం పెట్టండి మహాప్రబో!! అంటే.. కొంచెం ఆగు..అక్టోబర్ వస్తుంది’’ బంగారు పళ్లెం లో .. అన్నం పెడతానని ..గులాబీ సర్కార్ నేతలు మీడియా ముందు గాలిలో హామీలు ఇస్తున్నారని ఎంసెట్ పరీక్ష రాసిన విద్యార్థలు అంటున్నారు.
రాష్ట్రం రెండుగా విడిపోయిన విషయాన్ని తెలుగు ప్రజలు చిన్నగా మరిచిపోతున్న సమయంలో.. కేవలం తెలంగాణ నేతలు.. ఆంధ్ర రాష్ట్రం, ఆంద్రుళ్లు, మన పక్క రాష్ట్రం, అంటూ పదే పదే పదాలు వాడుతూ నోటి దుల తీర్చుకుంటూ .. స్వయం తృప్తి పడుతున్నారు. కానీ తెలంగాణ విద్యార్థుల జరుగుతున్న నష్టం గురించి ఏ ఒక్క తెలంగాణ నేత కూడా బయటకు చెప్పటం లేదు! తెలంగాణ విద్యార్థులకు మేం ఫీజులు కడతాం!! ఆంధ్ర విద్యార్థులకు ఫీజులు కట్టం అంటూ. పైశాచిక ఆనందానిపొందతున్నారు.
ఇప్పుడు రెండు రాష్ట్రాల మద్య ‘‘ఎంసెట్ ’’ అనేది ఒక యుద్దం లా మారింది. తెలంగాణ సర్కార్ ‘‘1956 ’’ స్థానికేత అంటూ తెలంగాణ విద్యార్థులకు, తెలంగాణ ప్రజలకు కొత్త చట్టాన్ని తెరపైకి తెచ్చింది . ఈ 1956 వల్ల .. ఎవరికి లాభం? తెలంగాణలో ఎంతమంది నష్టపోతారు? అనేది కచ్చితంగా తెలంగాణ నేతలు ఒక్కరు కూడా చెప్పటం లేదు. కానీ తెలంగాణ విద్యార్థలకు మేము పూర్తి న్యాయం చేస్తాం అని పగటి హామీలు ఇస్తున్నారు.
1956 అంటే.. ఇప్పటికి 64 సంవత్సరాలు..!!! అయితే ఈ 64 సంవత్సరాల్లో .. తెలంగాణలో.. పెళ్లిళ్లు జరగాలేదా? తెలంగాణ లో పిల్లలు పుట్టలేదా? ఒకవేళ పుట్టిన వారికి 1956 స్థానికేతర వర్థించాదా? అంటే గడిచిన 64 సంవత్సారాల నుండి.. తెలంగాణలో.. పెరిగిన జనభా సంఖ్య అంత.. ఇతర రాష్ట్రాలకు చెందినవారా? లేక ఆంద్రకు చెందినవారా అనేది ఎవరికి అర్థం కావటం లేదు.
ఇప్పుడు 1956 ప్రకారం చూస్తే.. ఒక సంవత్సరానికి తెలంగాణలో 20వేల మంది పిల్లలు పుట్టినా.. 64 సంవత్సరాలలో కోటి 28 లక్షల మంది విద్యార్థులుగా, తెలంగాణ ప్రాంత వాసులుగా ఉన్నట్లు లెక్క ! అయితే ఇప్పుడు ఈ కోటి 28 లక్షల మందికి 1956 చట్టం వర్తించదు? అనేది అక్షర సత్యం. అంటే వీరి జీవితం కాలం మొత్తం తెలంగాణలో ఉన్న .. వీరి పిల్లలకు , కోటి 28 లక్షల కుటుంబాలకు .. తెలంగాణ సర్కార్ ఎటువంటి ఫీజులు చెల్లించదు. ఇది రాబోయే ప్రభుత్వలు కూడా పాటించిన ఆశ్చర్యంలేదని తెలంగాణలోని మేథావులు అంటున్నారు. ఈ లెక్క సుమారు గా వేయటం జరిగింది.
తెలంగాణ సర్కార్ పైకి ఆంధ్రోళ్లు ఒక్క పైసా కూడా దక్కటానికి వీల్లేదని చెబుతూనే.. తెలంగాణలో పుట్టిన కోటి 28 లక్షల మంది అన్యాయం చేస్తుందని .. తెలంగాణ కాంగ్రెస్ నేతలు , బీజేపి నేతలు అంటున్నారు. ఆంధ్ర నేతల మీద కోపం తెలంగాణ వారికి శిక్షగా మారుతుందని ..రాజకీయ నాయకులు అంటున్నారు. ‘‘అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లుగా’’ తెలంగాణ సర్కార్ ఉందని ప్రతిపక్ష నేతలు అంటున్నారు.
ఏకంగా ఈరోజు అయతే ..తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి .. తెలంగాణ విద్యార్థులకు ఒక ప్రకటన చేయటం జరిగింది. తెలంగాణ లోని ఎంసెట్ రాసిన విద్యార్థులారా!! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎంసెట్ కౌన్సిలింగ్ లో పాల్గొనవద్దు !! అంటూ మీడియా ప్రకటన చేయటం జరిగింది. మంత్రి గారి ప్రకటనతో.. తెలంగాణలోని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందున్నారు.
‘‘ఉమ్మడి రాజధానిలో.. తెలుగు విద్యార్థుల జీవితాల్లో.. ఎంసెట్ వెలుగులు నింపుదామని ఆంద్రప్రదేశ్ గవర్నమెంట్ అడుగు వేస్తే.. తెలంగాణ సర్కార్ అడ్డుచెబుతున్న విషయం తెలిసిందే.’’ ఇరు ప్రాంతాల నేతలు ఎంసెట్ పై ఢీ అంటూ ఢీ అంటూ కొట్టుకోవటానికి సై అంటున్నాయి. రాష్ట్రలు రెండుగా విడిపోయిన .. ఉమ్మడిగా 10 సంవత్సరాలు ఉన్న విషయం మరిచిపోయి తెలంగాణ నేతలు ఇంటి చట్టాలు చేస్తున్నారని విద్యావేత్తలు అంటున్నారు. రాజకీయంగా రాజకీయనేతలు.. కొట్టుకోండి గానీ, విద్యాను, విద్యార్థుల జీవితాలను రాజకీయం చేయెద్దని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు.
ఉన్నత విద్యామండలి ప్రకటించిన ఎంసెట్ కౌన్సెలింగ్కి తెలంగాణ విద్యార్థులెవరూ హాజరుకావద్దని తెలంగాణ రాష్ర్ట విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి పిలుపునిచ్చారు. మన కౌన్సెలింగ్ను మనమే నిర్వహించుకుందామని చెప్పారు. కౌన్సెలింగ్ ప్రకటన విడుదలైన తర్వాత జేఎన్టీయూ వైస్చాన్సలర్తో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు.
ఉన్నత విద్యామండలి ఇచ్చిన నోటిఫికేషన్తో తెలంగాణకు సంబంధంలేదని మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టంచేశారు. ఈ విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదన్నారు. ఆగస్టు 7 నుంచి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ చేస్తామన్న ఉన్నత విద్యామండలి ప్రకటనపై ఆయన మండిపడ్డారు. ఏపీ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను అక్కడి ముఖ్యమంత్రి మోసం చేయడానికే ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ విద్యార్థులు బాగుపడకూడదని చంద్రబాబు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.
రాష్ర్టం విడిపోకముందు ఎన్నడూ కౌన్సెలింగ్ను అనుకున్న సమయానికి జరగలేదని, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వల్లే ఆలస్యమైందంటూ చిత్రీకరించే పనిలో ఏపీ ప్రభుత్వం పడిందన్నారు. మా ప్రభుత్వం వెచ్చించే ప్రతీపైసా మా తెలంగాణ పిల్లలకే చెందేలా చూస్తామని, ఈ విషయంలో వెనుకడుగు వేసే ప్రశ్నే లేదన్నారు. తెలంగాణ విద్యార్థులకు నాణ్యమైన, ఉన్నత విద్య అందించేందుకు సీఎం కేసీఆర్ పట్టుదలగా ఉన్నారని, అందుకే కౌన్సెలింగ్ ఆరంభానికి ముందే ఆయా యూనివర్సిటీల పరిధిలోవున్న కళాశాలను తనిఖీ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. మరోవైపు తెలంగాణలో విద్యార్థుల తల్లిదండ్రుల్లో మాత్రం టెన్షన్ నెలకొంది. పిల్లలకు మంచి ర్యాంకులు వచ్చిన తమ పిల్లలకు సీట్లు రావనే అయోమయంలోపడ్డారు.
తెలుగు రాష్ట్రాలపై కేంద్రం సవితి ప్రేమ చూపిస్తుంది. ఉమ్మడి రాష్ట్రాలకు గవర్నర్ గా ఉన్న నరసింహన్ కూడా.. మౌనం పాటిస్తూ.. సమయం గడుపుతున్నారు. రాష్ట్రా విభజన తరువాత రెండు రాష్ట్రాలకు కలిగే ప్రయోజనాలను పై ఎందుకు చర్యలు తీసుకోవటంలేదో తెలుగు ప్రజలకు అర్థం కావటంలేదు. ఈ ఎంసెట్ వివాదాం ఎటు వైపు దారి తీస్తుందో చూద్దాం!!
RS
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more