ప్రాంతాలు వేరైన .. పార్టీలు ఒక్కటే అని .. ఆయా పార్టీల అధినేతలు చెబుతున్న విషయం తెలిసిందే. అయితే రాష్ట్ర విభజనతో.. తెలుగు రాష్ట్రాలలో హస్తం పార్టీ కోనఊపీరిలో కొట్టుమిట్టాడుతుంది. తెలంగాణ రాష్ట్రం , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గా విడిపోయిన తరువాత.. వివాదలు కొత్తగా పుట్టుకొచ్చాయి. నీటి వివాదం, కరెంట్ మంటలతో పాటు కొత్త పోలవరం ప్రాజెక్ట్ యుద్దం నడుస్తున్నా విషయం తెలిసిందే. అయితే రాష్ట్ర విభజన సమయంలోనే కాంగ్రెస్ పార్టీ పోలవరం ప్రాజెక్ట్ పై ఒక నిర్ణయం తీసుకుంది. కానీ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో పోలవరం పై రచ్చ మొదలైంది. దీంతో రాజకీయ పార్టీల నాయకులు మాటల యుద్దం చేయటం మొదలుపెట్టారు. దీంతో లోక్ నుండి రాజ్య సభ వరకు పోలవరం మీద పైటు జరిగింది.
పోలవరం ఇష్యూ కాంగ్రెస్ లో మళ్ళీ ప్రాంతీయ చిచ్చు తెచ్చి పెట్టింది. ఆ ఇష్యూ మీద రాజ్యసభలో చర్చ మొదలైనపుడు….ఆంధ్రా ఎంపీలు, తెలంగాణ ఎంపీలు తమ తమ రాష్ట్రాలకు అనుకూలంగానే మాట్లాడారు తప్ప.. తాము ఒకటే పార్టీకి చెందిన వాళ్ళమనే మాట మర్చిపోయారు.
పోలవరాన్ని తాను సపోర్ఠ్ చేస్తున్నానని.. డిజైన్ మార్చాల్సిన అవసరం లేదని జైరాం రమేష్ అంటే, దానికి ఒప్పుకోను పొమ్మన్నారు రాపోలు ఆనంద్ భాస్కర్. పోలవరం ఆంధ్రాకు వరం కాదనీ, ఆ ప్రాజెక్టు కడితే ఆ రాష్ట్రానికి శాపంగా మారుతుందనన్నారు. తరువాత మాట్లాడిన వీహెచ్ హనుమంతరావు, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూడా గిరిజనులను ముంచొద్దనీ, పోలవరం డిజైన్ మార్చాలని అన్నారు. సీమాంధ్రకు చెందిన చిరంజీవి, కేవీపీ పోలవరానికి అనుకూలంగా మాట్లాడారు.
టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు మాత్రం తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీని విరుకునపెట్టేందుకు పావులు కదుపుతున్నారు. రాజ్యసభలో ఆంద్రఎంపీలు, తెలంగాణ ఎంపీలు విడిపోవటంతో సహజమే. కానీ కాంగ్రెస్ పార్టీలోనే ఆంద్రఎంపీలు , తెలంగాణ ఎంపీలుగా విడిపోయి రాజ్యసభలో తెలుగు రచ్చ ఏమిటో చూపించారు. దీంతో మిగిలిన రాష్ట్రల ఎంపీలు గతంలో రాష్ట్ర విభజన లోల్లి, ఇప్పుడు పోలవరం లోల్లి , ఈ తెలుగోళ్ల లోల్లి ఎప్పుడు ముగుస్తుందోనని జోకులు వేసుకుంటూ రాజ్యసభలోనే నవ్వుకుంటున్నారు. తెలుగు ఎంపీలు మాత్రం ప్రాంతాల వారిగా, పార్టీలు వారిగా చీలిపోయి అరుసుకోవటం కొంచెం బాధగానే ఉందని ..తెలుగు ప్రజలు అంటున్నారు. కేవలం వరం కోసమే పార్టీ ఎంపీలు రెండుగా చీలిపోవాలా? అని కాంగ్రెస్ పార్టీలోని సినియర్ నేతలు మండిపడుతున్నారు.
అసలే కోన ఊపీరితో అష్టకష్టాలు పడుతున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కూడా సమాధులు కట్టే రోజులు వచ్చాయని టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు అంటున్నారు. మీవల్లే ఖమ్మం జిల్లాలోని ముంపు గ్రాములు ఆంద్రలో కలిసాయని ఒకరిపై ఒకరు బురద నీళ్లు చల్లుకున్నారు. ఇదే మంచి అవకావంగా భావించి టీఆర్ఎస్ నేతలు తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయటానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇక గులాబీ దెబ్బల నుండి హస్తం ఎలా బయటపడుతుందో చూడాలి.
RS
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more