వైఎస్ జగన్ పార్టీ లో రోజు రోజుకి సన్ ప్లవర్స్ (పొద్దుతిరుగుడు పువ్వులు) పెరుగుతున్నాయి? ఈ సన్ ప్లవర్స్ గుణం సూర్యుడు ఎటు వైపు ఉంటే.. అటు వైపు తిరగటం ఈ ప్లవర్స్ నైజం. ఈ ప్లవర్స్ కు .. జగన్ పార్టీ లోని నేతలకు చాలా దగ్గర సంబంధం ఉందని రాష్ట్ర ప్రజలు అంటున్నారు. జగన్ పార్టీ పెట్టింది అధికారం కోసమే అనే విషయం అందరికి తెలుసు. అధికారం కోసం నాలుగు సంవత్సరాలు .నేతలను, రాష్ట్ర ప్రజలను ఓదార్సిన జగన్ కు.. ఎన్నికల్లో.. చుక్కలు చూపించారు. ఇలా ఎందుకు జరిగిందని జగన్, తమ పార్టీ నేతలతో మాటలు కలిపితే.. ‘‘అంతా నీవల్లే .. నీ వల్లే ’’అని ఒక్కసారి పార్టీలోని నేతలు గెంతెత్తి వినిపించారు.
అయినా జగన్ ఎలాంటి మార్పు రాలేదు కదా? పార్టీలో గెలిచిన నేతలపై అత్తపోరు మొదలుపెట్టారు. అధికారం వస్తుందనే ఆశతో.. డబ్బులన్ని ఎన్నికల్లో ఖర్చుపెట్టి గెలిచాం, అధికారం రాకపోగ.. ప్రతిపక్షంలో 5 సంవత్సరాలు ఉండాల్సిన ఖర్మ పట్టిందని నిరాశలో ఉన్న నేతలకు ..జగన్ మాటలు సూదుల్లా గుచ్చుకున్నాయి. దీంతో అసహనం, నిరాశ కలిగిన నేతలు.. సన్ ప్లవర్స్ గా మారిపోయి.. అధికారంలో ఉన్న .. చంద్రబాబు వైపు ముఖాలు తిప్పారు.
దీంతో నెమ్మదిగా సైడ్ అవటానికి నేతలు రెఢీ అవుతున్నారు . అంతేకాకుండా ఆశించిన పదవి దక్కలేదని ఒక నేత, అసలు పవర్ లేని చోట ఉంటే ప్రయోజనం ఏమిటని మరొకరు సర్దుకుంటున్నారు. దీంతో చంద్రబాబు బెల్లం(అధికారం) చుట్టూ జగన్ పార్టీలోని ఈగలు ముసురుకోవటానికి, టైమ్ చూసుకుంటున్నాయి. దీంతో బాబు అధికారం వైపు నేతలు వాలిపోతున్నారు.
నిన్నటి వరకు హడావిడి చేసిన పలువురు నేతలు ఇప్పుడు పార్టీ ముఖం చూడటానికి కూడా ఇష్టపడటం లేదు. అలాగని బయటకు వచ్చి నాలుగు రాళ్ళు వెనకేసుకునేందుకు సిద్ధంగా లేరు. ఎటు వెళ్ళాలి, ఎక్కడ బెర్త్ దొరుకుతుంది అనేది తేలిన తర్వాతే పార్టీ వీడాలనే వ్యూహంలో వీరున్నారు. అంత వరకు పార్టీకి దూరం పాటించటం బెటర్ అంటున్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆవిర్భావం కంటే ముందు నుంచీ ఉన్న నేత గట్టు రామచంద్రరావు. బీసీ సామాజిక వర్గానికి చెందిన గట్టుకు పార్టీ అధినేత జగన్ అధికార ప్రతినిధి హోదా కట్టబెట్టడమే కాకుండా రాష్ట్ర బీసీ సెల్ కన్వీనర్ బాధ్యతలూ ఇచ్చారు. తెలంగాణాలో ఖమ్మం వంటి జిల్లాల కోఆర్డినేషన్ వ్యవహారాలు చూసే వారు. అయితే గట్టు ఆశించినట్లు అంబర్ పేట్ అసెంబ్లీ టికెట్ ఇవ్వకపోవటంతో అప్పట్లో కినుక వహించినా...జగన్ సీఎం అవుతారామో అనే అంచనాతో సర్ది చెప్పుకున్నారు గట్టు.
ఎన్నికల రిజల్ట్స్ రివర్స్ కావటంతో.. జగన్ పార్టీలో ఉన్న ప్లవర్స్ ముఖాలు పూర్తిగా మాడిపోయినాయి. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఇక్కడి పార్టీ బాధ్యతలు తనకే దక్కాలనీ ఆశించినా...అధినేత మాత్రం ఖమ్మం ఎమ్మెల్సీ పొంగులేటి శ్రీనివాస రెడ్డికి అవకాశం ఇవ్వటంతో గట్టు లోని ఆవేశం మరోసారి కట్టలు తెంచుకుంది. దీంతో జగన్ పార్టీ కి గుడ్ బై చెప్పాలనే నిర్ణయం గట్టు గట్టిగా తీసుకున్నట్లు పార్టీలోని వర్గాలు అంటున్నాయి. కానీ గట్టు మాత్రం సమయంలో కోసం వేచి ఉన్నట్లు సమాచారం.
ఇలాగే జగన్ పార్టీలోని మరో సన్ ప్లవర్ ఓవీ రమణ కూడా ఇదే బాటలో ఉన్నారు. ఎన్నికల షెడ్యూల్ రావటానికి కొద్ది నెలల ముందు పార్టీ తీర్ధం పుచ్చుకున్న రమణ ...ఆ వెంటనే అధికార ప్రతినిధి అయిపోయారు. బెంగళూరు ఉన్న వ్యాపారాలు పక్కన పెట్టి ..న్యూస్ ఛానల్స్ చర్చా వేదికల్లో పార్టీ వాయిస్ను గట్టిగా వినిపించటానికే సమయం కేటాయించే వారు.
అంతేకాకుండా తరచు పార్టీ ఆఫీసులో ప్రెస్ కాన్ఫిరెన్స్లు పెట్టి హడావిడి చేసి గోల గోల చేసి జగన్ వద్ద మార్కులు కొట్టేశారు. అతనిలో ఆశ తమ అధినేత అధికారంలోకి రాగానే ఏదో ఒక పదవి రాకపోతుందా అని పగటి కలలు కంటూ హాయిగా కాలం వెల్లబుచ్చాడు. అయితే ఎన్నికల తరువాత దిమ్మతిరిగి.. మైండ్ బ్లాక్ అయ్యి బొమ్మ కనబడింది. దీనితో ఇప్పుడు సన్ ప్లవర్ గా మారే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి.
అయితే అధికార పార్టీ వైపు ముఖం తిప్పినట్లు తెలుస్తోంది. కానీ పార్టీలో మాత్రం మరోలా చెప్పుకుంటున్నారు. కొన్ని రోజులు పార్టీకి దూరంగా ఉండి.. వ్యాపారాలు చేసుకోవటానికి సిద్దమైనట్లు .. జగన్ పార్టీలోని సీనిర్ నేతలు చెబుతున్నారు. మరి కొద్ది రోజులు ఆగితే.. జగన్ పార్టీని బయట పడి సన్ ప్లవర్స్ ఎన్నో తెలుస్తోయని రాజకీయ పార్టీలు అంటున్నాయి. ఇప్పటికే జగన్ పై ‘దాడి ’ చేసిన నేత.. చంద్రబాబు ముఖం చూడటానికి సిద్దంగా ఉన్నట్లు రాజకీయ వర్గాలు పుకార్లు వినిపిస్తున్నాయి.
ఇక జగన్ నేతలు ఇప్పుడు .. ‘‘జగమంత కుటుంబం మాది ఏకాకి జీవితం మాది, సంసార సాగరం మాదె సన్యాసం సూన్యం మావే, అని పాడుకుంటున్నారు. కానీ ఒర్జినల్ పాటు.. ఇలా ఉంది..
‘‘జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
సంసార సాగరం నాదె సన్యాసం సూన్యం నావే
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది’’ పాపం అధికారం కోసం జగన్ పార్టీలోని సన్ ప్లవర్స్ పడే బాధలు అంత ఇంత కాదని ప్రజలు గుర్తించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. 2019లోనైన ..జగన్ అధికారం వస్తుందో లేదో చూడాలి.
RS
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more