‘‘నీకు నేను ..నాకు నువ్వు ఒకరికొకరం ...నువ్వు నేను ’’ నువ్వు-నేను సినిమాలో ఆర్. పి. పట్నాయక్ పాడిన పాటను ఎవరు మరిచిపోలేరు. ‘‘నువ్వు నేను చరిత్రలో నిలిచిపోయే ‘ఎర్ర’ ప్రేమికులం. ’’ అంటూ ఇప్పుడు ఇద్దరు ఎర్ర ప్రేమికులు ఆ పాటను పాడుకుంటున్నారు. అంతేకాదు.. లోకమంతా ఏకమైన వేరుకాము నువ్వు నేను.. అంటూ వారి గుండెలో పొంగిన ‘ఎర్ర’ ప్రేమ ను ఇలా బయటపెటుకున్నారు. ఇది ఇప్పటి మాట మాత్రమే.
మొన్నటి వరకు ఒకరి ఒకరు కత్తులు దూసుకున్న వీరు ఒక్కసారిగా ‘‘కౌలిగించుకొని ‘ఎర్ర’ ప్రేమ లేఖలు రాసుకున్నారు. ఈ ఇద్దరిలో ఉన్న ఎర్ర ప్రేమ చూసిన ప్రజలు షాక్ తిన్నారు. అసలు ఇంతకీ వీరు ఎవరు అనుకుంటున్నారు. తెలుగు రాష్ట్రంలో ఎర్ర జెండాలు ఇంకా కనిపిస్తున్నాయి అంటే. ఒకరు, సిపిఐ నారాయణ, మరోకరు సిపిఎం రాఘవులు ఈ ఇద్దరే కారణం. వీరి వీధి పోరాటలు చేసి చాలా తక్కువ, మీడియా ముందు తిట్టుకున్నది చాలా ఎక్కువ. వీరు అవకాశం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ ఇద్దర్ని చూస్తే ఒక సామెత అందరికి గుర్తుకు వస్తుంది ‘‘అక్కర ఉన్నంతవరకు ఆదినారాయణ, అక్కర తీరేక గూదనారాయణ’’.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో .. ఎర్ర కామెడ్లు చాలా వేషాలు వేయటం జరిగింది. ఒకరు రాష్ట్ర విభజనకు సై అంటే.. మరొకరు ‘నై’ అన్నారు. దీంతో తెలుగు రాష్ట్రంలో రెండు వర్గాలుగా విడిపోయారు. ఒకరు సమైక్యవాదుల జెండా కిందకు చేరితే. మరొకరు రాష్ట్రాన్ని విడదీసిన పార్టీలో ఎర్ర జెండా పెట్టారు. అయితే ఈ ఎన్నికల సమయంలో సిపిఐ నారాయణ ..ఖమ్మం జిల్లా నుండి లోక్ సభ కు పోటీ చేసి ఓడిపోవటం జరిగింది. నారాయణ ఓటమితో ఎర్ర కామెడ్ల అసలు రంగు బయట పడింది.
ఎన్నికల సమయంలో బద్ద శత్రువులు మారి, ఒకరి పై ఒకరు..ఎర్ర రంగు చల్లుకున్నారు. సిపిఐ నారాయణ మరో అడుగు ముందుకేసి రాఘవులపై సరికొత్త మరక వేయటం జరిగింది. వైసీపీ అధినేత నుండి 15 కోట్లు తీసుకున్నారనిరాఘువులపై సిపిఐ నారాయణ ఆరోపించారు.
ఈ ఇద్దరు మీడియా సాక్షిగా బూతులు తిట్టుకున్నారు. వీరి వీధి పోరాటం చూసిన ఎర్ర జెండా పెద్దలు.. ఇద్దరికి అక్షింతలు వేయటంతో ఎర్ర కామెడ్ల నోర్లు మూతపడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిందే అన్న సిపిఐ నారాయణ కు తెలంగాణ ప్రజలు చుక్కలు చూపించారు. దీంతో కామెడ్ల జెండాలు ఎగరలేని పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తుందని భావించిన ఎర్ర జెండ పెద్దలు.. ఇకనైన మన జెండాను కాపాడుకోవాలని సూచించారు.
దీంతో ఎర్ర జెండ పెద్దల ఒత్తిడితో.. సిపిఐ నారాయణ, సిపిఎం రాఘవులు ..ఒకరికొకరు..ప్రేమ లేఖలు రాసుకున్నారు. అంతేకాదు..మీడియా ముందు కలిసి ఫోటోలకు ఫోజులు ఇవ్వటం జరిగింది. ఈ ఇద్దరి కలియక చూసిన జనం.. ఛీ.. ఛీ చికెన్ నారాయణ.., ఛీ..ఛీ..రాఘవులు అంటూ ముఖం మీదనే అంటున్నారు.
ఇలాంటి విమర్శలను పట్టించుకొని జంట కామెడ్లు .. భవిష్యత్తులో కలిసే ఉద్యమం చేయాలి, కలిసే నడవాలని ఎర్ర జెండా రాష్ట్ర నాయకులు ఇద్దరు శపథం చేసుకున్నట్లు ఎర్ర జెండ కార్యకర్తలు అంటున్నారు. ఈ ఇద్దరిలో పౌరుషం పోయిన తరువాత క్షమాపణ కోరుతూ..ఎర్ర లేఖలు రాసుకున్నారు.
RS
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more