దగ్గుపాటి పురందేశ్వరి తండ్రి పేరు అడ్డం పెట్టుకోని రాజకీయ ప్రవేశం చేసి తండ్రీ పార్టీని వదిలేసి, తండ్రికి శత్రువులైన పార్టీలో చేరి, ఇప్పటి వరకు రాజకీయ పదవులు అప్పనంగా అనుభవించిన ఘనత దగ్గుపాటి పురందేశ్వరికే దక్కుతుందని తెలుగు ప్రజలు, ఎన్టీఆర్ అభిమానులు అంటున్నారు.
ఈరోజు పురందేశ్వరి కేవలం తన రాజకీయ మనుగడ కోసమే.. జాతీయ పార్టీ అయిన బీజేపీ లోకి జంప్ చేయటం జరిగిందని కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారు. సమైక్యాంద్ర కోసం రాజీనామా చేయమని సీమాంద్ర ప్రజలు ఎంత ఒత్తిడి తెచ్చిన, సోనియా గాంధీ మా మాట వింటారని.. ఢిల్లీలో సోనియాతో చెట్టపట్టాల్ వేసుకోని తిరిగి, సోనియా కాళ్లకు వంగి , వంగి దండాలు పెట్టిన, చివరికి సీమాంద్ర ఎంపీల ముఖం పై ఇటలీ బొమ్మ ఉమ్మేసేంది. ఆ సమయంలో తెలంగాణ ఇస్తాం? సీమాంద్ర ఎంపీలు, మంత్రులు ఏం చేసుకుంటారో చేసుకోండని సోనియగా గాంధీ గర్వం చెప్పినప్పుడు కూడా పురందేశ్వరి రాజీనామా చేయలేదు.
తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పాసైన తరువాత.. ఏదో సీమాంద్ర ప్రజల కోసం మొసలి కన్నీరు కార్చీ రాజీనామా చేసి, కమలం గుర్తు వారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన దగ్గుబాటి పురందేశ్వరికే దక్కుతుందని సీమాంద్ర ప్రజలు అంటున్నారు. ఈరోజు తిరుపతిలో జరిగిన ‘మోఢీ ఫర్ పీఎం’ సభలో పురందేశ్వరి కాలం చెల్లిన మాటలు మాట్లాడుతూందని ..తిరుపతి ప్రజలు అంటున్నారు. ఇలా ప్రజలను మోసం చేస్తూ ఎన్ని రాజకీయ పార్టీలు మారతాని తెలుగు ప్రజలు అడుగుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ విశాఖ టిక్కెట్ ఇవ్వని కారణంగానే దగ్గుబాటి పురందేశ్వరి బిజేపిలో చేరుతుందని కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నాయకులు విమర్శలు చేస్తున్నారు. పదవిలో ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేయలేని నాయకులు లిష్ట్ లో దగ్గుబాటి పురందేశ్వరి పేరు ఉన్నట్లు సీమాంద్ర ప్రజలు అంటున్నారు. పురందేశ్వరి ఎన్ని రాజకీయ పార్టీలు మారిన 2014ఎన్నికల్లో గెలవటం చాలా కష్టమని కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారు.
‘‘పొలిటికల్ నాయకులు అనే వారు .. పబ్లిక్ కు సేవా చేయాలి. పబ్లిసిటీ కోసం ప్రచారం చేసుకోకూడదని ’’ సీమాంద్ర ప్రజలు అంటున్నారు. పురందేశ్వరి చెయ్యి గుర్తు నుండి పువ్వు గుర్తుకు మారిన ప్రయోజనం దక్కదని తెలుగు ప్రజలు అంటున్నారు.
ఇకనైన తెలుగు ప్రజల మదిలిలో స్థిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడు ఎన్టీఆర్ కూతురిగా తెలుగు ప్రజలకు మేలు చేసే పనులు చేయాలని ఎన్టీఆర్ అభిమానులు ఆశగా అడుగుతున్నారు. ఇప్పటి వరకు మీకకు ఉన్న మంచి పేరు ను కాపాడుకుంటావో, లేక చెడగొట్టుకుంటవో.. అంత నీ చేతుల్లో ఉందని తెలుగు మహిళ సంఘలు, మీ అభిమానులు అంటున్నారు.
కాలం చెల్లిన మాటలు పక్కనపెట్టి, తెలుగు ప్రజల గుండెల్లో కలకాలం నిలిచి పోయే పనులు చేసి చూపాలని తెలుగు ప్రజలు అడుగుతున్నారు.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more