కేంద్ర మంత్రి చిరంజీవి .. రాజకీయల్లోకి రాక ముందు మెగాస్టార్ చిరంజీవి గా ఉండేవాడు. రాజకీయల్లో చేరిన తరువాత.. మేక చిరంజీవి గా మారిపోయారు. ఇందుకు కారణం నిన్న రాజ్యసభలో జరిగిన సన్నివేశమే అని . రాజకీయ మేథావులు అంటున్నారు.
ప్రజారాజ్యం పార్టీ , తిరుపతి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు.. సమైక్యంద్ర పులిగా.. అసెంబ్లీలోకి అడుగుపెట్టాడు. రాజకీయల్లో అనుభవం లేని చంటబ్బాయి అందరు చిరంజీవి వైపు అమయాకంగా చూశారు. అయితే రాజకీయల్లో వ్యూవహాలు రచించటం తెలియని చిరంజీవి.. ఆయనకు భజన చేసే రాజకీయ నాయకులపై ఆధారపడి, వారి రాజకీయ అనుభవాలకు తలొగ్గిపోయాడు.
సరిగ్గా ..ఇక్కడే.. పెద్ద తప్పు చేశాడని.. రాజకీయ మేథావులు అంటున్నారు. ఎదుటివారు చెప్పు మాటలకు లోంగిపోయిన చిరంజీవి సొంతగా ఆలోచించి, నిర్ణయం తీసుకునే స్థాయిని చేతులారా కోల్పోయారు.
ఇదే సమయంలో.. గద్దలాంటి కాంగ్రెస్ పార్టీ చిరంజీవిని హస్తాంలోకి తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ చిరంజీవిని తన స్వప్రయోజనాల కోసమే తన పార్టీలోకి తీసుకుందన్నా విషయం ఇప్పటికి చిరంజీవికి తెలియకపోవటం ఆశ్చర్యంగా ఉందని రాజకీయ పెద్దలు అంటున్నారు.
చిరు గ్యాంగ్ కు రెండు మంత్రి పదవులు, చిరంజీవికి ఫలితం లేని పర్యాటక శాఖ ఇచ్చి .. చేతులు దులుపుకుంది. ‘‘ శనగలు తిని చేతులు దులుపుకున్నట్లు ’’ కాంగ్రెస్ గ్ చిరంజీవిని ..రాజకీయంగా ఎదగకుండా చేయటం జరిగింది. ఇలాంటి శకుని కుట్రలు తెలియని చిరంజీవి చంటబ్బాయిలా.. కాంగ్రెస్ పార్టీలో తిరుగుతున్నారు.
ఇలాంటి సమయంలోనే కాంగ్రెస్ తెలంగాణ పేరు ను తెరపైకి తీసుకువచ్చింది. తెలుగు ప్రజలు , నాయకులు రెండు వర్గాలుగా విడిపోయి, తమ ప్రాంతీయ ప్రజల కోసం, తమ ఆకాంక్షల కోసం ప్రభుత్వం పోరాటం చేయటం ప్రారంభించారు.
ఇదే సమయంలో.. కేంద్రంలో సీమాంద్ర మంత్రులుగా చిరంజీవి, కావూరి, శీలం, పల్లం రాజు, పురందేశ్వరి, కిషోర్ చంద్రదేవ్ , కిల్లి రాణి, లాంటి నాయకులు సీమాంద్ర ప్రజలకు న్యాయం చేస్తారని ఎంతో ఆశగా ఎదురు చూశారు. కానీ తెలంగాణ ప్రాంతం నుండి కేంద్రంలో బలరాం నాయక్ , జైపాల్ రెడ్డి లాంటి నాయకులు ఉన్నారు.
అయితే.. జైపాల్ రెడ్డి రచించిన రాజకీయ వ్యూహంలో .. సీమాంద్ర కేంద్ర మంత్రలు చిత్తు చిత్తుగా ఓడిపోయారు. సమైక్యం అంటూ.. మీసాలకు సంపెంగ నూనె రాసుకొని ఢిల్లీలో సీమాంద్ర మంత్రుల తిరిగారు.
కానీ జైపాల్ రెడ్డి మాత్రం సరిగ్గా నడవలేని స్థితిలో ఉండి.. కేంద్ర పెద్దల ముందు తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఏమిటి క్లారిటీగా చెప్పటంతోనే .. ఈరోజు లోక్ , రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిందని రాజకీయ మేథావులు అంటున్నారు.
అయితే కాంగ్రెస్ పార్టీ చిరంజీవిని ‘బఫూన్ గా ’మార్చి రాజ్యసభలో అందరి ముందు నవ్వుల పాలు చేసింది. రాజ్యసభలో తెలంగాణ బిల్లు పై చర్చ జరిగే సమయంలో చిరంజీవికి కాంగ్రెస్ పెద్దలు కాగితం రాసి ఇచ్చిన రాజకీయ పాయింట్లను కేంద్రం మంత్రి చిరంజీవి (చంటబ్బాయి) చేత చదివించారు.
అయితే కాంగ్రెస్ రాసిన కాగితంలో ఏం రాజకీయం ఉందో తెలియని సమైక్య చంటబ్బాయి.. ఆవేశంగా సభలో చదవటం, చిరు రాజకీయ ఎదుగుదల పై మిగిలిన రాష్ట్రాల నాయకులు నవ్వుతూ, జోకులు వేసుకోవటం అందర్ని ఆశ్చర్యపరిచాయిని ..రాజకీయ మేథావులు అంటున్నారు.
అంతేకాకుండా . బీజేపి సీనియర్ నాయకుడు.. సమైక్యంద్ర కోసం, సీమాంద్ర ప్రజల కోసం.. రాజ్యసభలో చెలరేగిపోయిన వెంకయ్య నాయుడు కూడా.. చివరకి .. చంటబ్బాయి రాజకీయ పరిస్థితి అర్థం చేసుకొని.. ‘‘ చిరంజీవి మంచి నటుడు.. కానీ రాజకీయల్లో కాదని ’’కాంగ్రెస్ పార్టీ చిరంజీవి ప్రయోగించిన..కుట్రను రాజ్యసభలోనే బయటపెట్టారు.
అదీ కూడా దేశప్రధాని.. మాటలరాని మన్మోహన్ సింగ్ సమక్షంలోనే.. చిరంజీవిని కాంగ్రెస్ పార్టీ ఓడించిందని ..రాజకీయ మేథావులు అంటున్నారు. అదే రాజ్య సభలో.. తలపండిన సీనియర్ రాజకీయ నాయకులు ఉన్నారు..
ఒకరు టి. సుబ్బరామిరెడ్డి, మరోకరు బుద్ద విగ్రహం, (ఆత్మ) లా అందరికి కనిపిస్తున్న కేవిపి లాంటి నాయకులను వదిలిపెట్టి.. రాజకీయ వ్యువహాలు , రాజకీయ పునాదులు, రాజకీయ కుట్రలు, రాజకీయ ఎత్తులు-పైఎత్తులు., రాజకీయ ప్రేమలు, తెలియని రాజకీయ చంటబ్బాయిని . రాజ్య సభలో నవ్వులాపాచేశారని రాజకీయ మేధావులు అంటున్నారు.
సినీ తెరపై చెప్పు డైలాగులకు ..అభిమానులు చప్పట్లు కొడొచ్చు. కానీ ప్రజా సభలో అలాకాదు. ప్రజానాయకుడు మాట్లాడే ప్రతి మాట వెనుక ..కొన్ని కోట్ల మంది జీవితాలు ఆధారపడి ఉంటాయి. ఆ సమయంలో ప్రజా నాయకుడిగానే మాట్లాడాలి గానీ, పార్టీ విధేయుడిగా మాట్లాడటం మంచిది కాదని.. రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఇప్పుడు చిరంజీవి సీమాంద్ర ప్రజలను ఓడించారు. కాంగ్రెస్ పార్టీ చిరంజీవి ఓడించింది. కానీ కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఓటు కోసం ప్రజల ముందుకు వస్తుంది? చిరంజీవి ప్రజల ముందుకు రాలేదు అంతే తేడా. మిగిలిన వన్నీ సేమ్ టూ సేమ్ అని ఆయన అభిమానులు అంటున్నారు.
ఏ పార్టీకైన కాంగ్రెస్ పార్టీలో కలిసిపోతే.. ఇలాగే ఉంటుందనే నిజాన్ని రాజకీయ పార్టీలు తెలుసుకోవాలని తెలుగు ప్రజలు చెబుతున్నారు.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more