Botsa kcr secret meeting in delhi

botsa-kcr secret meeting, PCC chief Botsa meet TRS chief KCR, KCR secret meeting, Idly sambar, Chidambaram, congress party, cm kiran kumar reddy, trs party, congress party, telangana bill, tamilnadu cm jayalalitha,

botsa-kcr secret meeting in delhi, PCC chief Botsa meet TRS chief KCR secretly

సత్తిబాబు-కేసిఆర్ల ఇడ్లీ సాంబారు రహస్యం?

Posted: 02/06/2014 01:23 PM IST
Botsa kcr secret meeting in delhi

ఇడ్లీ సాంబారు అంటే  వెంటనే  అందరికి తమిళనాడు గుర్తుకువస్తుంది. కానీ.. ఇక నుండి తెలంగాణ, ఆంద్ర పేర్లను కూడా మనం గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే.. ఇటీవల  తమిళనాడు చెందిన  కాంగ్రెస్ పార్టీ సినియర్ నాయకుడు, కేంద్ర మంత్రి తెలంగాణ, ఆంద్రలో  ఇడ్లీ సాంబారు పెడితే బాగుంటుందని .. తన సన్నిహితులతో  చెప్పినట్లు సమాచారం. అయితే నిన్న ఢిల్లీలో ఆ కేంద్రమంత్రి ఆంద్రప్రదేశ్ నాయకులపై ప్రయోగం చేసినట్లు తెలుస్తోంది.    ఆంద్రప్రదేశ్ పిసిసి అద్యక్షుడు.. బొత్స సత్యనారాయణ, తెలంగాణ రాష్ర్ట సమితి అదక్యుడు.. కల్వకుంట్ల చంద్రశేఖర్  రహస్య సమావేశం అయినట్లు  మీడియాలో వార్తలు వస్తున్నాయి.  అయితే  ఈ విషయం తెలుసుకున్న  తమిళ నాయకుడు.. వెంటనే.. వీరిపై ఇడ్లీ సాంబారు ప్రయోగం చేయటం జరిగిందని .. ఢిల్లీ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.

అయితే.. సత్తిబాబు,  కేసిఆర్  రహస్య  సమావేశం పై రాష్ట్ర నాయకులు విభిన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.   కాంగ్రెస్ పార్టీ  అధిష్టానం  కోరిక మేరకే.. సత్తిబాబు, కేసిఆర్ సమావేశమైనట్లు  ఢిల్లీ వర్గాలు అంటున్నాయి.  తెలంగాణ బిల్లు పై  కేంద్రం జెడ్ స్పీడ్ తో ముందుకుపోతున్న విషయం తెలిసింది. అయితే  అతి దగ్గరలో..  ఎన్నికలు కూడా ఉండటంతో.. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం .. తెలివిగా పావులను కదుపుతుంది.  రాబోయే ఎన్నికలను దుష్టిలో పెట్టుకొని, సత్తిబాబు , కేసిఆర్ల మద్య  స్నేహ బంధానికి తెరలేపిందని .. కాంగ్రెస్ పార్టీ సినీయర్ నాయకులు అంటున్నారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. సమైక్యవాదిగా  కేంద్రం ద్రుష్టిలో పడిన విషయం తెలిసిందే.  

అయితే  నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని .. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దూరంగా పెట్టినట్లు .. ఢిల్లీ నాయకులు అంటున్నారు. అందులో బాగాంగానే..  సత్తిబాబు  ను తెరపైకి తెచ్చేందుకు అధిష్టానం చర్యలు తీసుకుంటుందని  పార్టీ వర్గాలు అంటున్నాయి.  అయితే ఈ ఇద్దరి సమావేశం వెనుక  కేంద్ర మంత్రి చిదంబరం హస్తం ఉన్నట్లు సమాచారం.  ఈ ఇద్దరి సమావేశంలో  చిదంబరం  ఇడ్లీ సాంబారు ప్రయోగం చేసినట్లు  సమాచారం.  ఆంద్రప్రదేశ్ నుండి తెలంగాణ విడిపోతే..  వెంటనే.. అరవ ఇడ్లీ సాంబారు రుచిని.. తెలుగు ప్రజలకు పరిచయం చేయటానికి  చిదంబరం సార్ సిద్దంగా ఉన్నట్లు  కాంగ్రెస్ పార్టీ సినియర్ నాయకుల గుసగుస. 

ఇప్పటికే .. చిదంబరం చిచ్చుతో.. ఆంద్రప్రదేశ్ రాష్ట్రం అతలకుతలమైపోయిన విషయం తెలిసిందే  ఇక చిదంబరం సార్  ఇడ్లీ సాంబారు  ప్రవేశపెడితే  ఏం జరుగుతుందోనని తెలుగు ప్రజలు భయపడుతున్నారు. అంటే తమిళనాడులో.. ఇప్పటికే.. అమ్మ(జయలలిత)  ఇడ్లీ, సాంబారు పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.  అందుకు పోటీగా.. ఆంద్రప్రదేశ్ లో .. చిదంబరం సార్ .. ఇడ్లీ సాంబారు ప్రయోగం చేయటానికి సత్తిబాబు, కేసిఆర్ల తో రహస్య మంతనాలు జరిపినట్లు .. కేంద్ర కాంగ్రెస్ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. 

 

ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles