డబ్బుతో రాజకీయాలలో నెగ్గుకురాలేరు కానీ డబ్బు లేకపోతే అసలే నెగ్గలేరు అని అమెరికాకు చెందిన ప్రొఫెసర్ అధ్యయనం చేసి వెల్లడించగా దాన్ని వర్జీనియా విశ్వవిద్యాలయం ప్రచురించబోతోంది.
ప్రొఫెసర్ అధ్యయనం ప్రకారం భారతదేశంలో ప్రస్తుతమున్న రాజకీయనాయకులలో ధనికవర్గానికి చెందినవారికే రానున్న ఎన్నికలలో గెలవటానికి 75 రెట్లు ఎక్కువ అవకాశాలున్నాయని తేలింది. ఎన్నికలకు నిధులు పోగుచెయ్యటం, వాటి వితరణ ఖర్చులు మొదలైన అంశాల మీద వెల్లడి చేసిన అధ్యయన ఫలితాలలో ప్రస్తుతం రాజకీయ రంగంలో ఉన్న నాయకులలో ఎవరి బలం ఎంతుంది, ఎవరి బలహీనతలేమిటన్న విషయాలను చర్చించటం జరిగింది.
అధ్యయనంలో 2009 సాధారణ ఎన్నికలను తీసుకుని చూడటమే కాకుండా ప్రస్తుత రాజకీయాలు, భవిష్యత్తులో జరగబోయే పరిణామాల అంచనా కూడా వెయ్యటం జరిగింది.
పార్లమెంటు ఎన్నికైన ప్రజాప్రతినిధులలో 33 శాతం ఐదు కోట్లు లేక అంతకంటే ఎక్కువ విలువైన ఆస్తులున్నవారని, అందుకు వ్యతిరేకంగా అట్టడుగున చూస్తే 10 లక్షలు లేక అంతకంటే తక్కువ విలువైన ఆస్తులు కలవారు కేవలం 0.44 శాతం గెలుపొందారని తెలియజేసారు. ఈ మధ్యలో 50 లక్షలకు పైన 5 కోట్లకు దిగువన ఉన్నవారు 19 శాతం విజయం సాధించారు. 10 లక్షల నుంచి 15 లక్షల వరకు ఆస్తిపాస్తులున్న రాజకీయ నాయకులు 94 శాతం ఓటమి పాలయ్యారని కూడా అధ్యయనం తెలియజేస్తోంది.
పై అధ్యయనం చేసిన ప్రొఫెసర్ జాన్ ఎకావెరీ జెంట్ 1974 లో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో అధ్యయనం చేసారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more