వివాదాలతో మంత్రి పదవి పోగొట్టుకున్న టీడీపీ నేత రావెల కిశోర్ బాబు మరో వివాదంలో ఇరుక్కున్నాడు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా శుక్రవారం మందకృష్ణ మాదిగకు చెందిన ఎమ్మార్పీఎస్ కురుక్షేత్ర సభను నిర్వహిస్తోంది. ఈ సభకు ఆహ్వానం పలుకుతున్నట్టు రావెల పేరుతో పోస్ట్టర్లు, ఫ్లెక్సీలు వెలియటంతో పెను చర్చకు దారితీసింది.
ఎంఆర్పీఎస్ కురుక్షేత్ర సభకు అసలు అనుమతి లేదని ఏపీ డిప్యూటీ సిఎం, నిమ్మకాయల చినరాజప్ప ఇప్పటికే ప్రకటించారు. ముందస్తు అనుమతి అడిగితే పరిశీలించి నిర్ణయం తీసుకొంటామని ఆయన ప్రకటించారు కూడా. కానీ, హైకోర్టు నుండి అనుమతి తీసుకోనైనా సరే నిర్వహిస్తామని ఎంఆర్పీఎస్ ప్రకటించింది. అయితే అవమానకరరీతిలో పదవీచిత్యుడైన రావెల పేరుతో పోస్టర్లు వెలియటంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన వెళ్తున్నాడా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పైగా దీనిపై స్పందించేందుకు ఆయన టీడీపీ అధిష్టానానికి అందుబాటులో రాకపోవటంతో అవి మరింత బలపడుతున్నాయి.
మరోవైపు మంద కృష్ణ మాదిగ సభపై అధికారపార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రావెల పేరును అనవసరంగా వాడుతున్నాడంటూ మండిపడ్డారు. విభజన సమయంలో ఆంధ్రా ప్రజలను తిట్టిపోసిన మందకృష్ణ మాదిగ ఇప్పుడు ఏపీలో ఎలా సభపెడతారంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక ఇప్పటికే వివాదాస్పద వ్యవహార శైలితో మంత్రి పదవి కోల్పోయిన రావెలకు ఈ వివాదం చిక్కులుతెచ్చే అవకాశం కనిపిస్తోంది. అనుమతులు వచ్చాయని ఆ సంస్థ నాయకులు చెబుతున్నప్పటికీ అలాంటి ఉత్తర్వులు రాలేదని పోలీసులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో నేడు గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్శిటీకి ఎదురుగా ఉన్న స్థలంలో జరగబోయే ఈ సభపై హైటెన్షన్ నెలకొంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more