బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు మరో షాక్ తగిలింది. ఆయన నివాసంపై ఈ ఉదయం సీబీఐ ఆకస్మిక దాడులు చేసింది. గత కొంతకాలంగా ఆయనపై, ఆయన కుటుంబ సభ్యులపై అవినీతి ఆరోపణలు ఓ రేంజ్ లోనే వినిపిస్తున్నాయి. దీనికి తోడు కేంద్రంపై ఆయన స్వరం పెంచి తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.
ఈ నేపథ్యంలో లాలూ నివాసంపై సీబీఐ అధికారులు చేయటం విశేషం. ఇంటితోపాటు ఆయనకు చెందిన 12 ప్రాంతాల్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. హోటళ్ల వ్యాపారంకు సంబంధించి అవకతవకలు బయటపడ్డాయని తెలుస్తోంది. 2006 లో అక్రమ టెండర్లకు పాల్పడ్డారని లాలూ కుటుంబంపై ఆరోపణలు వచ్చాయి. ఈ సందర్భంగా లాలూ, అతని భార్య రబ్రీదేవి, అతని కుమారుడిపై సీబీఐ అధికారులు కేసులు నమోదు చేశారు.
మరోపక్క లాలూ కూతురు ఆస్తులపై కూడా ఆ మధ్య సీబీ‘ఐ’వేసిన విషయం తెలిసిందే. ఆయన కుమారులు, మంత్రులు అయిన తేజ్ ప్రతాప్, తేజస్వి యాదవ్ లు పెట్రోల్ బంకుల పేరుతో బినామీ వ్యాపారాలు నడుపుతున్నారని బీహార్ బీజేపీ అధ్యక్షుడు సుశీల్ మోదీ సాక్ష్యాలతోసహా మీడియా ముందుకు వచ్చాడు కూడా.
సాక్ష్యాలున్నాయ్...
లాలూ ప్రసాద్ యాదవ్ అవకతవకలకు పాల్పడ్డ మాట వాస్తవమని, అందుకు తమ వద్ద సాక్ష్యాలున్నాయని సీబీఐ ప్రకటించింది. లాలూ ఇల్లు సహా, ఆయన కుటుంబీకులకు చెందిన ప్రాంతాల్లో దాడులపై సీబీఐ మీడియా సమావేశంలో వివరణ ఇచ్చుకుంది. పలు ప్రైవేటు కంపెనీలకు అనుకూలంగా లాలూ వ్యవహరించారని, హోటళ్ల టెండర్లలో అక్రమాలు చేశారని సీబీఐ డిప్యూటీ డైరెక్టర్ రాకేష్ ఆస్తానా తెలిపాడు.
ఓ సంస్థకు రెండు హోటళ్లను ఇచ్చినందుకు ప్రతిగా విలువైన భూమిని లంచంగా తీసుకున్నారని ఆయన తెలిపారు. మరిన్ని సోదాలు చేయాల్సి ఉందని వెల్లడించిన ఆయన, 2006లో లాలూ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలోనే అధికారం అండతో ఈ అవకతవకలు చేశారన్నాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more