కర్నూలు ఫాక్ష్యన్ రాజకీయాలు మరోసారి భగ్గుమన్నాయి. వైఎస్సార్సీపీ నేత చెరుకులపాడు నారాయణరెడ్డిని కిరాతకంగా వెంటపడి మరీ సినీ ఫక్కీలో చంపటం తెలిసిందే. ఘటనలో అనుచరుడు సాంబశివుడు కూడా మరణించాడు. ఇక కేసుకు సంబంధించి డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తనయుడు శ్యామ్ బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. శ్యామ్ బాబు సహా 13 మందిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. కాగా, ఈ కేసులో ప్రధాన నిందితుడు శ్యామ్ బాబు అని, అయినప్పటికీ అతన్ని ఏ-14గా చేరుస్తూ కేసు నమోదు చేశారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
విచారణకు సహకరిస్తా: కేఈ
నారాయణరెడ్డి హత్యకు గురికావడం వెనుక ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి హస్తముందంటూ వైఎస్సార్సీపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేఈ స్పందిస్తూ, ‘ఉద్దేశపూర్వకంగానే వైఎస్సార్సీపీ నాపై నిందలు వేస్తోంది. నారాయణరెడ్డి, ఆయన అనుచరుడు సాంబశివుడు హత్యలతో నాకు సంబంధం లేదు. వాళ్లిద్దరినీ నా అనుచరులే చంపారని విచారణలో తేలితే, వాళ్లకు శిక్ష పడేందుకు సహకరిస్తా. నారాయణరెడ్డికి గన్ మెన్ లను ఎస్పీ ఎందుకు తొలగించారో నాకు తెలియదు. ప్రాణహాని ఉందని నా దృష్టికి తెచ్చి ఉంటే తప్పక రక్షించేవాడిని’ అని తెలిపాడు.
ఎంత ఘోరంగా చంపారంటే...
పెళ్లికి వెళ్తున్న ఆయన్ను ప్రత్యర్థులు పక్కా ప్రణాళికతో చంపేశారు. నారాయణరెడ్డి ప్రధాన అనుచరుడు సాంబశివుడును కూడా హత్య చేశారు. కృష్ణగిరి మండలం రామకృష్ణాపురం గ్రామంలో జరిగే ఓ వివాహానికి హాజరయ్యేందుకు నారాయణరెడ్డి తన స్వగ్రామం చెరుకులపాడు మీదుగా వెళ్తుండగా ప్రత్యర్థులు ట్రాక్టర్లో వెంబడించారు. క్రిష్ణగిరికి అర కిలోమీటరు దూరాన మరో ట్రాక్టర్తో నారాయణరెడ్డి వాహనాన్ని ఢీకొట్టించారు. అనంతరం బాంబులు, వేట కొడవళ్లతో ముప్పేట దాడిచేశారు.
నారాయణరెడ్డి మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులకు ఆశ్చర్యపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. నారాయణరెడ్డి మృతదేహంపై 15కు పైగా కత్తిపోట్లు గుర్తించారు. తలపైనే అతి కిరాతకంగా ఎనిమిది సార్లు వేట కొడవళ్లతో నరికిన ఆనవాళ్లు ఉన్నాయి. చేతి చూపుడువేలు, మధ్య వేలు తెగిపోయాయి. సంఘటన స్థలంలో నారాయణరెడ్డి పుర్రె పగిలిపోయి మెదడు చిట్లి ఉండటంతో షాక్ కి గురయ్యారు. ఇక నారాయణరెడ్డి హత్యానంతరం తప్పించుకోబోయిన సాంబశివుడిని పొలాల్లో వెంటాడి నరికేశారు.
ఈ హత్యలతో అక్కడ భీతావహ వాతావరణం నెలకొంది. ఈ హత్యలకు కేఈ కుటుంబమే కారణమని హతుల బంధువులు ఆరోపించారు. హత్యలను వైసీపీ ఖండించింది. సోమవారం జిల్లా బంద్కు పిలుపునిచ్చింది. అంత్యక్రియలకు జగన్ స్వయంగా హాజరవు అవుతుండటం, ఆపై గవర్నర్ తో భేటీతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక కేఈ కుటుంబమే ఈ హత్యలకు పాల్పడిందని నారాయణరెడ్డి సోదరుడు ప్రదీప్ రెడ్డి ఆరోపించారు.ఇంకోవైపు ఇది బీహార్ ముఠా పనేనా..?అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసుల నిర్లక్ష్యమా? లేక...
నారాయణరెడ్డి తన రక్షణ తీసుకున్న లైసెన్స్డ్ ఆయుధాన్ని నెలరోజుల క్రితం రెన్యువల్ కోసం పోలీసులకు అప్పగించారు. ప్రతి ఏటా వెపన్లు ఉన్న వ్యక్తులు రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో నారాయణరెడ్డి వెపన్ను పోలీసు అధికారులకు అప్పగించారు. వారం రోజుల క్రితం కూడా పోలీసు అధికారులను కలిసి వెపన్ ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. అయితే పోలీసు అధికారులు నిర్లక్ష్యాన్ని ప్రదర్శించినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కూడా ఇదే అంశాన్ని లేవనెత్తటం విశేషం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more