వివాదాస్పద వైఖరితో ఏకంగా సుప్రీంకోర్టుతోనే పెట్టుకున్న కోల్ కతా హైకోర్టు న్యాయమూర్తి కర్ణన్ మరో సంచలన ఆదేశాలు వెలువరించాడు. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జేఎస్ ఖేర్కర్ తో పాటు, మరో ఆరుగురు సుప్రీంకోర్టు జడ్జిలకు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు జస్టిస్ కర్ణన్ ప్రకటన చేశాడు. కర్ణన్ పగకు కారణం
ఓ దళిత జడ్జికి వ్యతిరేకంగా ప్రవర్తించినందుకు గాను, అధికార దుర్వినియోగానికి పాల్పడినందుకు, ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద వారికి ఈ శిక్ష విధిస్తున్నట్టు కర్ణన్ ప్రకటించాడు. సుప్రీం కోర్టు జడ్జిలపై అవినీతి ఆరోపణలు చేసిన జస్టిస్ కర్ణన్ పై ఈ ఏడాది మార్చి 17న కోర్టు ధిక్కార నేరం కింద బెయిలబుల్ వారెంట్ ను జారీ చేశారు. ఆయన మానసిక పరిస్థితి సరిగా లేదని, న్యాయసంబంధమైన విధులు నిర్వహించేందుకు కుదరదని సుప్రీంకోర్టు బెంచ్ నాడు ఆదేశించింది. ఈ ఆదేశాలను వెనక్కి తీసుకోవాలన్న కర్ణన్ డిమాండ్ ను సుప్రీంకోర్టు పట్టించుకోలేదు.
కోల్ కతాలోని ప్రభుత్వ ఆసుపత్రి నియమించిన వైద్యుల బృందం సమక్షంలో కర్ణన్ కు వైద్య పరీక్షలు నిర్వహించాలని ఈ నెల 1వ తేదీన అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. అయితే, మానసిక వైద్య పరీక్షలు చేయించుకునేందుకు ఆయన తిరస్కరించారు. తన మానసిక పరిస్థితి చాలా చక్కగా ఉందని ఆ వైద్యుల బృందానికి కర్ణన్ చెప్పడం జరిగింది. ఈ ఆదేశాలు జారీ చేసిన సుప్రీం ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జేఎస్ ఖేర్ కర్ కు, ధర్మాసనంలోని జడ్జిలకే మతిస్థిమితం నిమిత్తం వైద్య పరీక్షలు నిర్వహించాలని కర్ణన్ ఆదేశించాడు కూడా.
అయితే కర్ణన్ వ్యవహారం మరీ శృతి మించిపోతుండటంతో రంగంలోకి దిగిన సీనియర్ న్యాయవాది రాంజెఠల్మానీ న్యాయ వ్యవస్థకు క్షమాపణలు చెప్పాలని బహిరంగ లేఖలో కర్ణన్ ను కోరిన విషయం తెలిసిందే. మరోవైపు అతన్ని విధుల నుంచి మరో నెలలో రిలీవ్ చేయాలని సుప్రీం ఇప్పటికే ఆదేశాలు జారీచేసింది కూడా.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more