తెలంగాణ రాజకీయాల్లో ప్రోఫెసర్ కోదండరాం గత కొంత కాలంగా రేపుతున్న అలజడి అంతా ఇంతా కాదు. తెర వెనుక వ్యవహారాలు ఏంటో తెలీదుగానీ గులాబీ బాస్ తో అంటిముట్టనట్లు ఉన్న ఆయన తర్వాత తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ విరుచుకుపడుతున్నాడు. కేవలం కాంగ్రెస్ అండతోనే ఆయన అంతలా ఎగిరెగిరి పడుతున్నారని టీఆర్ఎస్ విమర్శలు చేయటం, అంతగా దిగజారలేదని కౌంటర్ లు ఇలా సాగిపోతూ వస్తుంది.
అయితే వెనకాల కాంగ్రెస్ అండ లేదన్న ఆయన మెల్లిగా టీజేఏసీని రాజకీయ పార్టీగా మార్చేయబోతున్నాడా? అన్న అనుమానాలు క్రమంగా మొదలయ్యాయి. కీలక నిర్ణయాల సమయంలో తోటి నేతలతో విభేధాలు, బయటికి వచ్చిన వాళ్లు ఓపెన్ గా ఫ్రోఫెసర్ పై విమర్శలు చేయటం దానికి ఊతమిచ్చాయి. దీనికి తోడు 2019 ఎన్నికల్లో ఆయన బరిలోకి దిగుతారనే మరో వార్త హాట్ టాపిక్ గా మారింది. కానీ, పొలిటికల్ జేఏసీ పార్టీగా మారే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదని ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశాడు.
ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ ఏర్పాటు చేసే ఆలోచన తనకు లేదని, టీజేఏసీ ఎప్పటికీ ప్రజా సంస్థగానే పని చేస్తుందని అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ధోరణి తమకు లేదని, కేవలం సైద్ధాంతిక పరంగానే వాళ్లపై విమర్శలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపాడు. జీవో నెం.123కు సవరణ చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం చెప్పిన అంశాలనే మొదటి నుంచి తాము డిమాండ్ చేస్తున్న విషయాన్ని కోదండరాం ప్రస్తావించాడు. ఈమధ్య రైతులకు సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించిన ఎకరానికి రూ.8 వేలు పెట్టుబడి పథకాన్ని స్వాగతిస్తున్నామని, రైతులకు ఏమాత్రం సాయం అందినా హర్షిస్తామని, పూర్తి స్థాయి వ్యవసాయ విధానాన్ని ప్రభుత్వం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more