తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. టీఆర్ఎస్ సర్కార్ కి వ్యతిరేకంగా గళం విప్పేందుకు కాంగ్రెస్ సర్కార్ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ముఖ్యంగా బుధవారం సీఎల్పీ నేత జానారెడ్డి సభలో కాస్త గట్టిగానే వాయిస్ ను వినిపించారు. ఒకానోక దశలో సీఎం కేసీఆర్ తోనే కాస్త ఘాటైన సంభాషణ కొనసాగించిన ఆయన ఆపై మంత్రి హరీశ్రావుకు ఏకంగా క్లాస్ పీకినంత పని చేశాడు. చట్టసభలో సంప్రదాయానికి విరుద్ధంగా వెళ్లవద్దంటూ హరీష్ కు సూచించాడు. ఇంతకీ ఏం జరిగిందంటే... వ్యవసాయంపై జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్ శాసనసభ్యుడు ఉత్తమ్ కుమార్రెడ్డి మాట్లాడుతుండగా మధ్యలో లేచిన మంత్రి హరీశ్రావు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తూ కోమటిరెడ్డి, సంపత్ పేర్లను ప్రస్తావించారు. హరీశ్రావు వివరణ అనంతరం ఉత్తమ్ కుమార్రెడ్డి తన ప్రసంగాన్ని పూర్తి చేశారు.
ఆపై ఎంఐఎం సభ్యుడు మొజాంఖాన్కు స్పీకర్ మైక్ ఇచ్చారు. అయితే మంత్రి తమ పేర్లను ప్రస్తావించారు కాబట్టి కాబట్టి తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోమటిరెడ్డి, సంపత్లు కోరారు. అందుకు స్పీకర్ నిరాకరించారు. దీంతో సభలో కొంతసేపు గందరగోళం నెలకొంది. దీంతో కల్పించుకున్న జానారెడ్డి లేచి మాట్లాడారు. సభలో ప్రతిపక్ష సభ్యులు మాట్లాడిన అంశాలను నోట్ చేసుకుని, వారు లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం ఏం చేస్తుందో వివరణ ఇవ్వాలని, ఇది గతం నుంచి వస్తున్న సంప్రదాయమంటూ హరీశ్కు క్లాస్ తీసుకున్నారు.
కాంగ్రెస్ను ఉద్దేశించి మంత్రి మాట్లాడిన మాటలకు తనకూ కౌంటర్ ఇవ్వాలని ఉందని, అంతే ఆయనా లేచి, నేనూ లేస్తే కౌంటర్లకే సమయం సరిపోతుందని అన్నారు. అంతా అయిన తర్వాతే మంత్రులు మాట్లాడాలని, గత సంప్రదాయాన్ని గౌరవించాలని హరీశ్కు సూచించటంతో కాసేపు అక్కడ సైలెంట్ వాతావరణం నెలకొంది.
జానా వర్సెస్ కేసీఆర్...
ఇక ఎంతసేపూ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అట్లా.. ఇట్లా.. అంటూ చెప్పిందే చెప్పి.. అన్నదే అని.. ఏంటిది? మా ప్రభుత్వం పోయి మీ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? కేంద్రం ఇచ్చిన నిధులను కూడా మళ్లిస్తున్నారు. ఇదేనా పద్ధతి? అంటూ ఏకంగా కేసీఆర్ నే ప్రశ్నించగా, దానిపై టీ సీఎం సుదీర్ఘ వివరణే ఇచ్చుకోవాల్సి వచ్చింది.
‘‘కారణాలేవైనా కాంగ్రెస్ ప్రభుత్వం బకాయిపడ్డ రూ.480 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని తెలంగాణ వచ్చాక మేం విడుదల చేసినమాట నిజమా కాదా..? రైతు రుణమాఫీలో 75 శాతం చెల్లించి మిగతా 25 శాతం ఇప్పుడు చెల్లించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో పాడిందే పాడరా... అన్నట్టు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. ఎన్నో ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేసిన సీనియర్ నేత జానారెడ్డి ఇలా మాట్లాడ్డం సరికాదు..’’ జానా తీరును తీవ్రం గా తప్పుబట్టాడు కేసీఆర్.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more