మోదీ తీసుకున్న నిర్ణయంపై తెలుగు రాష్ట్రాల సీఎంలు భిన్న స్వరాలు వినిపించిన విషయం తెలిసిందే. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్వాగతిస్తూ కొత్త నోట్లను పంపిణీ చేయాలని కేంద్రానికి ఇప్పటికే విజ్నప్తి చేయగా, తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం బహిరంగంగానే అంసతృప్తి వ్యక్తం చేశాడు.
చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ మరియు సీనియర్ అధికారులతో భేటీ అయిన అనంతరం మోదీ నిర్ణయంపై కాస్త ఘాటైన వ్యాఖ్యలే చేశాడు. దిక్కుమాలిన చర్య కారణంగా రాష్ట్ర ఆదాయం గణనీయంగా పడిపోవటమే కాదు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా సగం మాత్రమే అందుతున్నాయని ఆక్రోశించాడు.
మరోవైపు ఇప్పటికే లోటుతో సతమతమవుతున్న ప్రభుత్వ ఖజానా మరింతగా కుంచించుకుపోయింది. దీంతో ఈ నెల్లో ఉద్యోగుల వేతనాలు సైతం ఇచ్చే పరిస్థితి నెలకొంది. ఈ దశలో అవసరమైతే సగం జీతం ఇచ్చి, మిగిలినది తరువాత ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలని కేసీఆర్ అధికారుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఉద్యోగులు, పెన్షనర్లకు నెలకు రూ. 2,500 కోట్లు చెల్లిస్తున్న విషయాన్ని గుర్తు చేసిన ఆయన, రాష్ట్రానికి నెలకు రూ. 9 వేల కోట్ల ఆదాయం రావాల్సి వుండగా, నోట్ల రద్దుతో అందులో సగం కూడా రాని పరిస్థితి నెలకొందని అధికారులతో చెప్పి , ఎవరికీ ఇబ్బందులు కలగని రీతిలో సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కేసీఆర్ సూచించారంట.
జీతాల్లో 25 నుంచి 50 శాతం వరకూ తగ్గించి, ఆదాయం సమకూరిన తరువాత బకాయిని తిరిగి చెల్లించే ఏర్పాట్లు చేయాలని అన్నారు. కాగా, ఈ నిర్ణయం అమలైతే దాదాపు 3.5 లక్షల మందిపై ప్రభావం పడుతుందని అంచనా. ఇదే సమయంలో ఉద్యోగులకు చెల్లించాల్సిన డీఏ కూడా నిలిపివేయాలన్న ఆలోచనలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.
మొత్తం నెలకు తెలంగాణ రెవెన్యూ ఆదాయం 3,600 కోట్లు కాగా, కేంద్ర నుంచి పన్ను సంక్రమణల ద్వారా వచ్చే ఆదాయం 1,000 కోట్లు. తాజా పరిస్థితితో ఆదాయం 60 శాతం పడిపోగా, కేంద్రం ఇచ్చే ఆదాయం 40 శాతంగానే ఉంది. ఆదాయంలో ఎక్కువ వాటా ఉన్న ఎక్సైజ్ విభాగం గతంలో 110 కోట్ల ఆదాయం సుకూర్చగా, ఇప్పుడదీ 45 కోట్లకు పడిపోయింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more