టీవీ ప్రభావం ఎలా ఉంటుందో చూపించిన ఘటన ఇది. ఓ ప్రముఖ ఛానెల్ లో ప్రసారమయ్యే క్రైం కార్యక్రమంతో స్పూర్తి పొందిన ఓ జంట తాము చేసిన ప్రయత్నంతో కటకటాల పాలైంది. ప్రియురాలి తన లవర్ తో కలిసి ఏకంగా సొంత కజిన్ నే కిడ్నాప్ చేయబోయింది. రాజస్థాన్ లో జరిగిన ఘటన వివరాల్లోకి వెళ్లితే... జోధ్ పూర్ కు చెందిన పూర్ణిషా సింధల్, ఆమె ప్రియుడు మయానక్ మెహతా ప్రేమికులు. అయితే తమకు లగ్జరీ లైఫ్ కావాలనుకున్న ఆ జంట డబ్బు కోసం తెగ ట్రై చేసింది.
ప్రతీ చోట అప్పులు చేయటంతో ఎవరూ మళ్లీ డబ్బు ఇఛ్చేందుకు ముందుకు రాలేదు. దీంతో అవసరమైన డబ్బును వ్యాపారవేత్త అయిన పూర్ణిషా బాబాయ్ కొడుకు యుగ్ బండారిని కిడ్నాప్ చేయడం ద్వారా సంపాదించాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా ప్రియుడితో కలిసి ప్లాన్ చేసిన పూర్ణిషా... తమ్ముడు యుగ్ ను కిడ్నాప్ చేసింది. ఆ తరువాత యుగ్ ను విడిచిపెట్టాలంటే 50 లక్షల రూపాయలు ఇవ్వాలని పూర్ణిషా బాబాయ్ రితేష్ కు ఫోన్ లో డిమాండ్ చేయించింది. యుగ్ కు ఎక్కడ నష్టం చేస్తారోనని భయపడ్డ రితేష్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి, సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఛేదించారు.
కేవలం నాలుగు గంటల్లోనే ఈ కిడ్నాప్ కేసు కొలిక్కి రావడం విశేషం. తాము ఓ టీవీ సీరియల్ ను చూసి స్పూర్తి పొంది ఈ కిడ్నాప్ చేశామని, అందులో బెదిరించగానే డబ్బులు తెచ్చి ఇస్తారని, అలాగే ఇక్కడ కూడా జరుగుతుందని భావించామని ఈ ప్రేమ జంట పేర్కొనడం విశేషం. వారిద్దరు ఇంజనీరింగ్ చదువుతున్నారని, మరో స్నేహితుడు భరత్ తో కలిసి ఈ పన్నాగం పన్నారని, అతని కోసం గాలిస్తున్నట్లు స్థానిక ఎస్పీ తెలిపాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more