అమెరికాలో నల్లజాతీయుల సెగ అధ్యక్ష ఎన్నికలకు తాకింది. ప్రచారంలో భాగంగా నల్ల జాతీయుల పట్ల డొనాల్డ్ ట్రంప్ అవలంభిస్తున్న విధానం, చేస్తున్న వ్యాఖ్యలతో వారికి చిర్రెత్తుకుపోయినట్లు ఉంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో గెలవబోనివ్వమన్న సంకేతాలు ఆ జాతీయులు అందజేస్తున్నారు. తాజాగా ట్రంప్ హోటల్ పై జరిగిన దాడి దీనిని స్పష్టం చేస్తోంది.
రాజధాని వాషింగ్టన్ లో కొత్తగా ప్రారంభించిన ఓ లగ్జరీ హోటల్ గోడలపై రాతలు రాసేశారు. తమకు అన్యాయం, అశాంతి కలుగుతున్నాయని, నల్ల జాతీయుల జీవితాలకు సంబంధించిన... అని అర్థం వచ్చేలా గోడలపై రాతలు రాసేశారు. ఈ పని ఎవరు చేశారన్న విషయాన్ని గుర్తించేందుకు పోలీసులు విచారణ ప్రారంభించారు.
కాగా, శనివారం సాయంత్రం ఓ వ్యక్తి ట్రంప్ హోటల్ పై నినాదాలు రాసి, తాపీగా మెట్లు దిగి నడుచుకుంటూ వెళుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ విషయమై స్పందించేందుకు ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్ ప్రతినిధులు నిరాకరించారు. ఈ ఘటన తరువాత హోటల్ ముందు సెక్యూరిటీని పెంచినట్టు వివరించారు.
Donald Trump's new hotel in DC got tagged earlier today... #nojusticenopeace #blacklivesmatter pic.twitter.com/qGbALAoS9o
— Angry Man (@AngryBlkManDC) October 2, 2016
కాగా, రిపబ్లికన్ల తరఫున అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్, నల్లజాతీయుల పట్ల చాలా దారుణమైన వ్యాఖ్యలే చేస్తున్నాడు. కాగా, మొత్తం 263 రూములున్న ఈ హోటల్ అధ్యక్ష భవనం వైట్ హౌస్ కు సమీపంలోనే ఉంటుంది. ఇక్కడ ఓ రాత్రి గడపాలంటే, 400 డాలర్లను వసూలు చేస్తారు. ప్రస్తుతం ప్రచారంలో బిజీగా ఉన్న ట్రంప్ వాషింగ్టన్ కు ఎప్పుడు వచ్చినా, ఇక్కడే బస చేసి, తన ప్రచార టీమ్ తో మంతనాలు జరుపుతారు. ఈ క్రమంలోనే వారు ఆ హోటల్ ను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more