ఏపీకి సాయం విషయంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుగారిని కొంతమంది విమర్శిస్తున్నారు. ఆయన్ని విమర్శిస్తే మనకొచ్చే లాభమేంటని అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. కృష్ణా జిల్లా నెమ్మలూరులో బీహెచ్ఈఎల్ సంస్థ ఏర్పాటుకు భూమి పూజ జరిగింది. దీనికి వెంకయ్యనాయుడు కూడా హాజరయ్యాడు. ఈ సందర్భంగా చంద్రబాబు ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.‘‘నేను అడుగుతున్నాను. ఆయన ఎక్కడ తప్పుచేశారని అడుగుతున్నాను’’ అంటూ మాట్లాడారు.
'రాష్ట్రానికి మేలు చేసేందుకు అనునిత్యం కేంద్రంతో మాట్లాడుతూ, అక్కడ జరిగే సమావేశాల్లో ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. వెంకయ్యనాయుడును విమర్శించేవారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని మాట్లాడాలి' అని సూచించారు. రాష్ట్రాభివృద్ధి కోసం టీడీపీ ఏనాడూ రాజీపడలేదని, ఈ విషయాన్ని ప్రతిఒక్కరూ గుర్తించాలని అన్నారు. ఏపీ ప్యాకేజ్ కు సంబంధించి చట్టబద్ధత కల్పించాలని, అన్ని విషయాలను ఫాస్ట్ ట్రాక్ లో పెట్టాలని వెంకయ్యనాయుడికి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నానని చంద్రబాబు అన్నారు.
కాగా, కృష్ణా జిల్లా నెమ్మలూరులో బీహెచ్ఈఎల్(బెల్) కర్మాగార ఏర్పాటుకు ప్రభుత్వం 50 ఎకరాల విస్తీర్ణంలో రూ.300 కోట్లను కేటాయించింది. రక్షణ శాఖకు అవసరమైన అడ్వాన్స్ నైట్ విజన్ లెన్స్ ను ఈ కర్మాగారంలో తయారు చేయనున్నారు. రెండేళ్లలో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ఈ ప్రాజెక్టు ద్వారా వందల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయని, తద్వారా యువత బాగుపడుతుందని చంద్రబాబు వివరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, సుజనా చౌదరి, ఎంపీ కొనకళ్ల నారాయణ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more