భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లోని ఆర్మీ బెటాలియన్లు, భారత వాయుసేన నిర్వహణలో ఉన్న ఎయిర్ బేస్ స్టేషన్లు 'ఫుల్ అలర్ట్'తో ఉండాలని ఆదేశాలు వెళ్లినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఎటువంటి అత్యవసర పరిస్థితి ఏర్పడినా, వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని విమానాలు, సైనికులకు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. మయన్మార్ లో జరిపిన 'సర్జికల్ స్ట్రయిక్స్' వంటి కోవర్ట్ మిలిటరీ ఆపరేషన్ చేసే ఉద్దేశం భారత ప్రభుత్వానికి ప్రస్తుతానికి లేనట్టు తెలుస్తోంది.
పాకిస్థాన్ లోని ఆర్మీ పోస్టులపై భీకర దాడులు చేయడం, వారి బంకర్లను ఇవతలి వైపు నుంచే సర్వ నాశనం చేయడం, హెవీ మోటార్లు ఉపయోగించి కాల్పులు జరపడం, తేలికపాటి క్షిపణులతో పాక్ సరిహద్దు భద్రతా స్థావరాలను చిన్నాభిన్నం చేయడం వంటి అవకాశాలను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో అమలు జరిపిన పద్ధతుల్లోనే పాక్ కు గట్టి బుద్ధి చెప్పేలా మోదీ సర్కారు నిర్ణయం తీసుకోవచ్చని సమాచారం.
మరోవైపు సరిహద్దులు దాటకుండా పాకిస్థాన్ రక్తం కళ్లజూడాల్సిందేనని వాస్తవాధీన రేఖ వెంబడి విధులు నిర్వహిస్తున్న సైనికులు గట్టి పట్టుతో ఉన్నారు. ప్రతిదాడులు జరిపేందుకు అనుమతించాలని కోరుతోంది. ఈ దిశగా రాజకీయ నిర్ణయం తీసుకోవాలని ఓ వర్గం సైనికుల నుంచి ఒత్తిడి వస్తోంది. 'పరిమితమైన సీమాంతర దాడి'కి తమకు అనుమతించాలని కొందరు డిమాండ్ చేసినట్టు సమాచారం. ముఖ్యంగా 778 కిలోమీటర్ల పొడవైన వాస్తవాధీన రేఖ వెంబడి నిత్యమూ ఎక్కడో ఒకచోట పాక్ కాల్పులకు దిగుతూనే ఉంటుందన్న సంగతి తెలిసిందే. తాజాగా యూరి దాడితో దేశం మొత్తం రగిపోతుంది. పాక్ పై ప్రతీకారం తీర్చుకోవాలంటే యుద్ధం చేయాల్సిందేనని ముక్తకంఠంతో కోరుతోంది.
ఇక సీమాంతర దాడికి ప్రభుత్వం అనుమతిస్తే, అది పూర్తి స్థాయి యుద్ధంగా మారే అవకాశాలు లేకపోలేదు. దీంతో కేంద్రం ఇప్పటికిప్పుడు అలాంటి అనుమతులు ఇచ్చే అవకాశాలు లేవని కొందరు ఉన్నతాధికారులు చెబుతున్నారు. పఠాన్ కోట్, యూరీ ఆర్మీ పోస్టులపై ఉగ్రదాడులను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్న సంగతి తెలిసిందే. పాక్ కు బుద్ధి చెప్పే దిశగా తీసుకోవాల్సిన చర్యలపై హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన జరగనున్న భేటీలో కీలక నిర్ణయం వెలువడే అవకాశాలున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more