ప్రత్యేక హోదా కోసం ఏపీ నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నా కాస్తయినా పట్టించుకోని కేంద్ర ప్రభుత్వంలో కదలిక మొదలైనట్టు కనిపిస్తోంది. తిరుపతిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ బహిరంగ సభ తర్వాత ‘ప్రత్యేక’ వేడి రాజుకోవడం, ఇంటా బయట ఒత్తిళ్లు పెరిగిపోవడంతో ఏదో ఒకటి తేల్చేయాలని కేంద్రం నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని మరింత సాగదీయడం మంచిది కాదని భావిస్తున్న బీజేపీ ప్రభుత్వం మరో రెండు మూడు రోజుల్లో ప్రత్యేక హోదాపై ఓ కీలక ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది.
ముఖ్యంగా వచ్చేనెల 3న ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో అంతకు ముందురోజు అంటే సెప్టెంబరు 2నే ఇందుకు సంబంధించి స్వయంగా మోదీనే ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీనిలో 'హోదా' అన్న పదం ఉందా? అన్న విషయం తెలియలేదుగానీ, హోదా వస్తే లభించే అన్ని ప్రయోజనాలకూ చోటు కల్పించినట్టు తెలుస్తోంది. మిగిలిన ప్రయోజనాలు, విభజన సమయంలో ఇచ్చిన హామీలపైన కూడా స్పష్టమైన ప్రకటన చేయనున్నట్టు సమాచారం. ఇంకోవైపు టెంపరరీ హోదాను జైట్లీ ప్రకటిస్తారన్న వార్తలు కూడా వినవస్తున్నాయి.
కాగా సోమ, మంగళవారాల్లో ఏపీకి ప్రత్యేక హోదా విషయంపై బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తదితరులు ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. హోదా, ప్యాకేజీపై రెండు విడతలుగా సుదీర్ఘ చర్చలు జరిపారు. హోదాతోపాటు రాష్ట్ర అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపైనా మంత్రి వెంకయ్యనాయుడు తన అభిప్రాయాన్ని సూటిగా చెప్పినట్టు సమాచారం. అయితే విభజన సమయంలో చేసిన వాగ్ధానాలను నెరవేర్చాలని కేంద్రం నిర్ణయించిన వేళ, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకంగా కొన్ని వరాలను ప్రకటిస్తే, ఇతర రాష్ట్రాల నుంచి రాజకీయ సమస్యలు వస్తాయని ఆయన హెచ్చరించినట్టు తెలుస్తోంది. మిగతా రాష్ట్రాల నుంచి వచ్చే సమస్యలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, ఏపీ పరిస్థితిని వివరిస్తూ, వారికి సర్దిచెప్పే మార్గాలను అన్వేషించాలని జైట్లీ, వెంకయ్యనాయుడులకు షా సూచించినట్టు తెలిసింది. కాగా, కేంద్ర మంత్రి సుజనా తయారు చేసిన ముసాయిదాపై ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించిన తరువాత తుదిరూపు ఇచ్చి బహిర్గత పరచాలని కేంద్రం భావిస్తోంది.
ప్రత్యేక రైల్వే జోన్ కూడా?
అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేలు చేకూర్చేలా కేంద్రం తయారు చేసిన ముసాయిదా విభజన హామీలను అన్నింటినీ ప్రస్తావిస్తూ అత్యంత సమగ్రంగా ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. విభజన సమయంలో ఇచ్చిన హామీల్లో పెండింగులో ఉన్న వాటన్నింటినీ ఇందులో చేర్చినట్టు సమాచారం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం ప్రజల సెంటిమెంట్ గా మారడం, రాజీపడబోమని చంద్రబాబు చెప్పడం, హోదా ఇవ్వకపోవడంపై వివిధ వర్గాల నుంచి వస్తున్న నిరసనలతో మెట్టు దిగిన కేంద్రం రాష్ట్రంపై దృష్టి సారించి వరుస భేటీలు జరిపి ఈ ప్రతిపాదనలను తయారు చేసింది. రాష్ట్రానికి ప్రత్యేక రైల్వే జోన్, హామీల అమలు దిశగా చేయాల్సిన కార్యక్రమాలు, మరిన్ని విద్యాసంస్థలు, పారిశ్రామిక రాయితీలు తదితర అంశాలను పొందుపరిచినట్టు తెలుస్తోంది. హోదా ఇస్తే కలిగే రాయితీల ప్రయోజనాలను విడిగా ఇస్తామని వివరణాత్మకంగా చెబుతూ, ఆర్థిక, మౌలిక వసతుల కల్పనకు, పోలవరం, అమరావతి నిర్మాణానికి నిధులు గురించిన సమాచారం కూడా ఈ ముసాయిదాలో ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more