యూపీ రాజకీయాల్లో మరో కీలకమైన మలుపు చోటుచేసుకోనుంది. సీఎం అభ్యర్థి విషయంలో జాతీయ పార్టీలు ఆడుతున్న దోబూచులాటకు తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ తరపున రాజ్ నాథ్ సింగ్, వరుణ్ గాందీ పేర్లు పరిశీలనలో ఉండగా, కాంగ్రెస్ తన తరపున అభ్యర్థిని దాదాపుగా ఖరారు చేసినట్లే కనిపిస్తోంది. పార్టీ ఇన్ చార్జ్ గా ఉన్న మధుసూదన్ మిస్త్రీని తొలగించి గులాం నబీ ఆజాద్ కు బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు సీఎం అభ్యర్థి విషయంలో ఓ స్పష్టతకు వచ్చినట్లు అర్థమౌతోంది.
ఆ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించబోతున్నట్లు పార్టీ విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ముందుగా ప్రియాంకా గాంధీ, లేదా రాజీవ్ గాంధీని సీఎం అభ్యర్థిగా పెట్టాలన్న కార్యకర్తల డిమాండ్ ను పక్కనపడేసి అధినేత్రి సోనియా షీలా వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. పార్టీ ఆజ్నతో కదిలిన షీలా ఇప్పటికే సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కలిసి చర్చించనున్నట్టు సమాచారం. ఎట్టిపరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్ జేజార్చుకోకుండా, తిరిగి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ శతవిధాల ప్రయత్నిస్తోంది.
పంజాబ్ ఇన్ చార్జిగా ఉండేందుకు ఆమె విముఖత చూపటంతో హఠాత్తుగా యూపీ బరిలోకి ఆమెను దించాలని పార్టీ చూస్తోందట. కాగా, 1998 నుంచి 2013 వరకు వరుసగా పదేహేనేళ్లపాటు ఆమె ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఢిల్లీ సీఎంగా ఆమెపై పెద్దగా రిమార్కులు లేనప్పటికీ, యూపీఏ అవినీతి ఆయుధంగా చేసుకున్న ఆప్ అక్కడ అదికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఆమెను బరిలోకి దించి బీజేపీ వ్యూహానికి చెక్ పెట్టాలని కాంగ్రెస్ ఫ్లాన్ వేస్తోంది.
భాస్కర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more