Basavapunnaiah stadium in vijayawada

makineni basavapunnaiah stadium, basavapunnaiah stadium, basavapunnaiah stadium at singhnagar, bomb, bomb in shop, bomb tension in vijawada, police,

basavapunnaiah stadium in vijayawada

basavapunnaiah.gif

Posted: 02/23/2013 05:31 PM IST
Basavapunnaiah stadium in vijayawada

basavapunnaiah stadium in vijayawada

అజిత్‌సింగ్‌నగర్‌లో శుక్రవారం బాంబ్ కలకలంరేగింది. మాకినేని బసవపున్నయ్య స్టేడియం ఎదురుగా వున్న కూరగాయల దుకాణం వద్ద గుర్తుతెలియని వ్యక్తి క్యారీబాగ్ వదిలివెళ్లాడు. అందులో ఒక స్టీల్ బాక్సుతో పాటు హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్ చిరునామాతో ఒక ఫైల్ ఉండడంతో స్థానికులు మరింత అందోళన వ్యక్తంచేశారు. క్యారీ బాగు పెట్టి వెళ్లిన వ్యక్తి తిరిగి రాకపోవడంతో దుకాణ యజమాని వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు.  హుటాహుటిన పాయకాపురం సీఐ నాగేశ్వరరావు, ఎస్సై సత్యనారాయణరెడ్డి సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సీఐ ఉన్నతాధికారులకు సమాచారం అందజేయడంతో క్యారీ బాగు వద్దకు ఎవరినీ వెళ్లనీయకుండా ట్రాఫిక్‌ను మళ్లించి ప్రజలను దూరంగా పంపించేశారు. కొదిసేపటికి హెడ్‌క్వార్టర్స్ ఏసీపీ సత్యనారాయణ బాంబ్ స్క్వాడ్, క్యూఆర్‌టీ టీంతో అజిత్‌సింగ్‌నగర్‌కు చేరుకున్నారు. బాంబ్ స్క్వాడ్ సిబ్బంది పలు పరీక్షల అనంతరం క్యారీబాగును తెరిచి చూడగా మిగిలిన భోజనం వుండటంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. సింగ్‌నగర్‌లో ఈ బాంబు కలకలం రెండున్నర గంటలపాటు టెన్షన్..టెన్షన్ కలిగించింది. అక్కడంతా తీవ్ర ఉత్కంఠ నెలకుంది. సింగ్‌నగర్ డాబాకొట్లసెంటర్‌లో నుంచి స్టేడియం వైపు వచ్చే వాహనాలను పైపులరోడ్డు నుంచి వచ్చే వాహనాలను సింగ్‌నగర్ లోపలికి అనుమతించకుండా నూజివీడు రహదారి మీదుగానే మళ్లించారు. సంఘటనా స్థలానికి వంద అడుగుల దూరం వరకు ఎవరినీ దగ్గరకు రానీయలేదు. అనుమానిత వ్యక్తుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెడ్‌క్వార్టర్స్ ఏసీపీ సత్యనారాయణ సూచించారు. అజిత్‌సింగ్‌నగర్‌లో సంఘటన అనంతరం ఆయన విలేకరుతలో మాట్లాడుతూ ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు క్యారీబాగులు, ఇతర వస్తువులు ఏమైనా వదిలివెళితే వెంటనే కంట్రోల్ రూంకు ఫోన్ చేయాలన్నారు. పోలీసులు రాంగ్‌కాల్స్ అనుకుంటారేమోనని అపోహపడి ఎవరూ వెనుకడుగు వేయొద్దని ఎందులో ఏముందో తీసేవరకూ ఎవరికీ తెలిసే అవకాశం లేనందున ప్రజలు అప్రమత్తంగా ఉండి పోలీసులకు సహకరించాలని సత్యనారాయణ కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chandrababu fire on vijayawada tdp leaders
Mango farmers in vijayawada  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vangaveeti radha get emotional at vijayawada

    ఘనంగా వంగవీటి రంగ వర్థంతి

    Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more

  • Who is the samaikyandhra hero

    వీరిలో సమైక్య హీరో ఎవరు ?

    Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more

  • Vijayawada municipality fails to pay employees their salaries

    ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ-వేతనాలివ్వండి మహాప్రభో.

    Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more

  • Cm kiran fire on congress high command

    ఒక్కసారి చదువుకోండి:సిఎం కిరణ్

    Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more

  • Ashok babu fire on seemandhra leaders

    చేతకానితనం వల్లే ఇలా జరిగింది?

    Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్‌జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్‌జీవోల భవన్‌లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more