జిల్లాలో సుమారు 65 వేల హెక్టార్లలో మామిడి తోటలున్నాయి. విజయవాడ నగరానికి సమీపంలో ఉన్న మామిడి మార్కెట్తోపాటు నూజివీడు, మైలవరం, తిరువూరు, విస్సన్నపేట తదితర ప్రాంతాల్లో మామిడి వ్యాపారం కోట్లలో జరుగుతుంది. ఆరుగాలం కష్టపడి పని చేసిన రైతులకు మాత్రం నష్టాలు తప్ప లాభాలు రావడంలేదు. దీనికి కారణం ధర నిర్ణయం ఢిల్లీ సేఠ్లు, కమీషన్ వ్యాపారుల చేతుల్లో ఉండటమే.ముసుగు వ్యాపారం రైతులను నట్టేట ముంచుతోంది. మామిడి మార్కెట్ల్లో బహిరంగంగానే ముసుగు వ్యాపారం జరుగుతోంది. పట్టించుకోవాల్సిన మార్కెటింగ్శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులుసైతం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రకృతి వైపరీతాల్యకు మామిడి మినహా మిగిలిన పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తోంది. నున్న మామిడి మార్కెట్లో ఏటా రూ.కోట్లలో మామిడి వ్యాపారం జరుగుతోంది. కాపు ఉన్నా, లేకున్నా ఏటా సుమారు 40 వేల మెట్రిక్ టన్నుల మామిడికాయలు ఎగుమతి అవుతాయి. టన్ను ధర కనీసం ఎనిమిది వేల నుంచి 50 వేల వరకు ఉంటుంది. మామిడి సీజన్లో మార్కెటింగ్శాఖకు ఏటా సుమారు 50 లక్షల రూపాయల ఆదాయం వస్తోంది. దానికి కారణమైన రైతులకు మాత్రం గిట్టుబాటు ధర లభించడంలేదు. మామిడి కాయలను విక్రయించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా మార్కెట్ యార్డులను ఏర్పాటు చేయలేదు. దీంతో ప్రైవేటు మార్కెట్లలోనే వీటిని విక్రయించుకోవాల్సి దుస్థితి ఏర్పడుతోంది. ప్రైవేటు మార్కెట్లపై మార్కెటింగ్శాఖకు అజమాయిషీ కూడా లేకుండా పోతోంది. ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారమే ప్రైవేటు వ్యాపారులు ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు.
కాని మామిడి విషయంలో మాత్రం అది అమలు కాకపోవడంలేదు. రైతుల ఎదుటే ఢిల్లీ సేఠ్లు, కమీషన్ వ్యాపారులు చేతిలో చేయి పెట్టుకుంటారు. చేతులపై తువాలు ముసుగు వేసి కాయలకు ధర నిర్ణయిస్తారు. ఆ ధర ఎంతనేది రైతుకు ఏమాత్రం తెలియదు. కాయలు లోడు అయిన వారం రోజులకుగానీ ఫలానా ధరకు కాయలు అమ్ముడైనట్లు తెలుస్తోంది. నున్న మార్కెట్కు ఢిల్లీ, గుజరాత్, అహ్మదాబాద్, రాజస్థాన్, తదితర రాష్ట్రాల నుంచి సేఠలు వస్తుంటారు. వాళ్లంతా ముందుగానే సిండికేట్ అయి ధర పెరగకుండా చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. కాయ సైజు, రంగును బట్టి ధరను నిర్ణయించాలని రైతులు ఎప్పటి నుంచో డిమాండు చేస్తున్నారు. కాని మార్కెట్ల్లో అమలవుతున్న దాఖలాలు లేవు. మామిడికి ధర నిర్ణయించేందుకు ప్రత్యేకంగా మామిడి బోర్డును ఏర్పాటు చేస్తామన్న హామీ ఇంత వరకు కార్యరూపం దాల్చలేదు. మరో నెల రోజులలో మామిడి సీజన్ రానున్నది. అప్పటిలోగా మామిడి బోర్డును ఏర్పాటు చేయటం సాధ్యపడదు. కనీసం మార్కెట్లో ముసుగు వ్యాపారాన్ని అరికట్టి, బహిరంగంగా ధర నిర్ణయించేలా అధికారులు చర్య తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏటా సీజన్ ప్రారంభమైన తర్వాత ధర నిర్ణయంపై అధికారులు, ప్రజా ప్రతినిధులు హడావుడగా వ్యాపారులతో సమావేశాలు నిర్వహించటం పరిపాటైంది. ఈ ఏడాది మామిడి సీజన్ ఆరంభానికి ఇంకా నెల రోజుల గడువు ఉంది. అందువల్ల ప్రజా ప్రతినిధులు, మార్కెటింగ్శాఖ అధికారులు, వ్యాపారులతో సమావేశం నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఆ సమావేశంలోనే ధర నిర్ణయంపై ఒక నిర్ణయం సమావేశం అవుతారు.
(And get your daily news straight to your inbox)
Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more
Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more
Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more
Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more
Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్కు ఏపీఎన్జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్జీవోల భవన్లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more