వరుసగా మూడు రోజులు సెలవులు రావటంతో.. తిరుమలకు భక్తుల పోటు భారీగా పెరిగింది. తిరుమల అధికారులు ఉహించని రీతిలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరుగుతోంది. ఇప్పటికే 31 కంపార్టమెంట్లు నిండి కిలోమీటర్ మేర భక్తులు క్యూలో వేచియున్నారు. అలిపిరి శ్రీవారి మెట్ల నడక వారి మార్గంలో తిరుమలకు చేరుకున్న దివ్యదర్శనం భక్తులు నారాయణగిరి ఉద్యానవనంలో 2 కిలోమీటర్ల మేర బారులు తీరారు. రూ. 300 టికెట్టు తీసుకున్న ప్రత్యేక ప్రవేశం దర్శనం భక్తుల క్యూ రెండు కిలో మీటర్ల మేర ఉంది. శ్రీవారి సర్వ దర్శనానికి 20 గంటలకు పైగా పడుతోంది. ప్రత్యేక దర్శనానికి12 గంటలు, కాలి నడకన చేరుకున్న భక్తులకు 15 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ ద్రుష్ట్యా ఆదివారం ఉదయం వీఐపీ విరామ దర్శనాన్ని తితిదే రద్దుచేసింది.
15 లక్షలు..
తిరుమల శ్రీవెంకటేశ్వస్వామి వారికి భక్తులు నగదు విరాళాను సమర్పించారు. నిత్య అన్నప్రసాదం ట్రస్టు కింద ఏలూరుకు చెందిన ఎ.ఎస్.రామ్ రూ. 10 లక్షలు , రంగారెడ్డి జిల్లాకు చెందిన మలక్ పేట వాసి ఐ. కవిత. రూ. లక్ష, ఔరంగాబాదుకు చెందిన బి.దత్తాత్రేయ రూ. లక్ష, ప్రాణదానం ట్రస్టు కింద హైదరాబాదుకు చెందిన కల్యాణ చక్రవర్తి లక్ష, గోసం రక్షణ ట్రస్టు కింద చెన్నైకు చెందిన మధుసూదన్, ఉషా కలిసి లక్ష, సత్యబామ లక్ష వంతున రూ. 15 లక్షలు విరాళం అందచేశారు. తిరుమల కేంద్రీయ విచారణ కార్యాలయ ఆవరణం దాతల విభాగంలో అధికారులను కలిసి విరాళానికి సంబంధించిన డిమాండ్ డ్రాప్టులను భక్తులు సమర్పించారు.
ఉండాలని హోమం
సమైక్యాంద్రకు మద్దతుగా అన్ని కులవ్రుత్తులు, రాజకీయ పార్టీలు, జర్నలిస్టులు సంయుక్తంగా ధర్నా నిర్వహించాయి. ఈ సందర్భంగా తెలుగు ప్రజల అంతా కలిసి ఉండాలని హోమం నిర్వహించారు. రహదారిపై చాకిరేవు ఏర్పాటు చేసి రజకులు బట్టలు ఉతికారు. పలువురు సమైక్యాంద్ర కోసం గుండు గీయించుకుని నిరసన తెలియజేశారు.
(And get your daily news straight to your inbox)
Apr 02 | టాలీవుడ్ లో సరికొత్త కథలకు, సరిగ్గా సరిగ్గాసరిపోయే హీరోగా ప్రభాస్ ముందు వరుసలో ఉంటాడు. ... Read more
Dec 26 | మరి కొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. ఆ రోజు కలియుగ దైవం అయిన ఏడుకొండల వాడిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు టీటీడీ కండీషన్లు పెట్టింది. కొత్త సంవత్సరం రోజున తిరుమల శ్రీనివాసుని దర్శించుకునేందుకు... Read more
Dec 17 | ప్రపంచ ప్రసిద్ధి పొందిన తిరుమలేశుని లడ్డూ ప్రసాదంలో ఇనుప నట్టు ప్రత్యక్షం కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కడప జిల్లా చక్రాయపేట మండలానికి చెందిన ఉపాధ్యాయుడు రామచంద్ర గండి క్షేత్రంలో ఈ లడ్డును కొనుగోలు చేశారు.... Read more
Dec 12 | పుట్టిన ఊరు, ఓటేసిన ఓటరు తీర్పునకు అనుకూలంగా నడుచుకునే వారు ఒకరైతే.. ఓటరు గీటరు నైజాన్తా.. అధిష్టానానికే మా ఓటు అని మరో ఎంపి చింతమోహన్. రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ నిర్ణయంతో ప్రభుత్వం... Read more
Dec 07 | తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీకబ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం అమ్మవారి సారె ఊరేగింపు ఘనంగా జరుగింది. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుపతి నుంచి అమ్మవారి సారె వెంబడి ఓ గరుడ... Read more