గత 35 సంవత్సరాలుగా చూడని అరుదైన దృశ్యం నిన్నతిరుమలలో కనిపించింది. సమైక్యాంధ్ర ఉద్యమంలో రాష్ట్రంలో జరుగుతున్న నిరసనలు, బంధ్ ల పిలుపు వలన ఆలయ ప్రాంగణం బోసిపోయింది. కానీ అక్కడ ఉన్న భక్తులకు స్వామివారి దర్శనం చేసుకోవటానికి, తిరుమలలోని గోపురాలు, పూదోటలు హాయిగా విహరిస్తూ చూడటానికి కావలసినంత సమయంతో పాటు జనసమ్మర్దం లేనందు వలన చక్కగా తనివి తీరా చూడగలిగే సందర్భం.
కానీ తిరుపతి, తిరమల మధ్య నడిచే బస్సులు నిలిచిపోవటంతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానముల సిబ్బంది కూడా సమ్మె లో పాల్గొనటంతో యాత్రికులు ఇబ్బందులు పడ్డారు.
తిరుమలలోని కట్టడాలు, గోపురాలు, ఇతర విహార స్థలాలను భక్తజన కోటి లేకపోవటం వలన స్పష్టంగా చూడగలిగే పరిస్థితి ఉన్నా, తిరిగి ఇళ్ళకు పోవాలన్న ఆత్రుత, కిందికి వెళ్ళటానికి రవాణా సౌకర్యం ఉంటుందో లేదో అన్న ఆదుర్దా వారిలో చాలా మందిని, హాయిగా ఎప్పడూ లభించనంత అవకాశాన్ని ఉపయోగించుకుంటూ తిలకించటానికి సావకాశం ఇవ్వలేదు.
ప్రతిరోజూ తిరుపతి నుంచి తిరుమలకు పోయే బస్సులు 500. అవి ఒక్కొక్కటి వేసే ఆరారు ట్రిప్పుల వలన 3000 సర్వీసులు రోజుకి చేస్తుంటాయి. అవి పూర్తిగా బంద్ వలన మూతపడటంతో ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి వారు నోటికొచ్చినట్టుగా అడిగిన మొత్తాన్ని చెల్లించినవారు కొందరైతే, అలిపిరి నుంచి కాలిదారిలో వెళ్ళటానికి కొందరు నిశ్చయించుకుని తిరుమలైతే చేరుకున్నారు కానీ వచ్చేటప్పడు వాళ్ళు కాస్త ఇబ్బందుల పాలయ్యారు.
అయితే ముఖ్యమంత్రి జోక్యంతో, అధికారుల ఆదేశాల మేరకు ఈ రోజు కేవలం తిరుమలకు అక్కడ చిక్కుకుపోయిన యాత్రికుల సౌకర్యార్థం కొన్ని బస్సులు పరిమిత సంఖ్యలో నడుస్తున్నాయి.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Apr 02 | టాలీవుడ్ లో సరికొత్త కథలకు, సరిగ్గా సరిగ్గాసరిపోయే హీరోగా ప్రభాస్ ముందు వరుసలో ఉంటాడు. ... Read more
Dec 26 | మరి కొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. ఆ రోజు కలియుగ దైవం అయిన ఏడుకొండల వాడిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు టీటీడీ కండీషన్లు పెట్టింది. కొత్త సంవత్సరం రోజున తిరుమల శ్రీనివాసుని దర్శించుకునేందుకు... Read more
Dec 17 | ప్రపంచ ప్రసిద్ధి పొందిన తిరుమలేశుని లడ్డూ ప్రసాదంలో ఇనుప నట్టు ప్రత్యక్షం కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కడప జిల్లా చక్రాయపేట మండలానికి చెందిన ఉపాధ్యాయుడు రామచంద్ర గండి క్షేత్రంలో ఈ లడ్డును కొనుగోలు చేశారు.... Read more
Dec 12 | పుట్టిన ఊరు, ఓటేసిన ఓటరు తీర్పునకు అనుకూలంగా నడుచుకునే వారు ఒకరైతే.. ఓటరు గీటరు నైజాన్తా.. అధిష్టానానికే మా ఓటు అని మరో ఎంపి చింతమోహన్. రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ నిర్ణయంతో ప్రభుత్వం... Read more
Dec 07 | తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీకబ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం అమ్మవారి సారె ఊరేగింపు ఘనంగా జరుగింది. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుపతి నుంచి అమ్మవారి సారె వెంబడి ఓ గరుడ... Read more