తిరుమల శ్రీవారి ఆభరణాల లెక్కింపు ప్రారంభమైంది. ఏటా నిర్వహించే వార్షిక పరిశీలనలో భాగంగా ప్రత్యేక బృందం స్వామివారి నగలను లెక్కిస్తోంది. నెలరోజుల పాటు జరిగే లెక్కింపు అనంతరం వెంకన్న స్వర్ణాభరణాలను భక్తుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శిస్తారు.తిరుమల శ్రీవారి స్వర్ణాభరణాల వార్షీక పరిశీలన కార్యక్రమం ఆరంభమైంది. స్వామివారి బొక్కసంలోని ఆభరణాలను ఏటా లెక్కించి వాటి వివరాలను రికార్డ్ చేస్తారు.అందులో భాగంగానే ఈసారి కూడా వెంకన్న నగలను ఆలయ జేఈవో శ్రీనివాసరాజు నేతృత్వంలోని అధికారుల బృందం పరిశీలిస్తోంది. తిరువాభరణం డాక్యుమెంట్స్ ఆధారంగా నగల విలువ నిర్ధారిస్తున్నారు.
స్వర్ణాభరణాల లెక్కింపు కార్యక్రమాన్ని ప్రారంభించిన టిటిడి ఈవో ఎల్వీ సుబ్రమణ్యం ఆభరణాలను సమగ్రంగా పరిశీలించటానికి నెల పడుతుందన్నారు. ఆలయ ఖజానాలోని ఆభరణాలతో పాటు గత ఏడాదిగా భక్తులు విరాళంగా ఇచ్చిన నగలను కూడా పరిశీలిస్తామన్నారు.ఇంతకీ.... స్వామివారి ఆభరణాలు చూసే భాగ్యం టీటీడీ సిబ్బందికేనా అనుకుంటున్నారా...? కానే కాదు... ఆ అదృష్టం సామాన్య భక్తులకు కూడా దక్కనుంది... శ్రీవారి నగలు లెక్కించిన తర్వాత ... భక్తుల కోసం ప్రదర్శనకు ఉంచుతారు.
(And get your daily news straight to your inbox)
Apr 02 | టాలీవుడ్ లో సరికొత్త కథలకు, సరిగ్గా సరిగ్గాసరిపోయే హీరోగా ప్రభాస్ ముందు వరుసలో ఉంటాడు. ... Read more
Dec 26 | మరి కొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. ఆ రోజు కలియుగ దైవం అయిన ఏడుకొండల వాడిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు టీటీడీ కండీషన్లు పెట్టింది. కొత్త సంవత్సరం రోజున తిరుమల శ్రీనివాసుని దర్శించుకునేందుకు... Read more
Dec 17 | ప్రపంచ ప్రసిద్ధి పొందిన తిరుమలేశుని లడ్డూ ప్రసాదంలో ఇనుప నట్టు ప్రత్యక్షం కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కడప జిల్లా చక్రాయపేట మండలానికి చెందిన ఉపాధ్యాయుడు రామచంద్ర గండి క్షేత్రంలో ఈ లడ్డును కొనుగోలు చేశారు.... Read more
Dec 12 | పుట్టిన ఊరు, ఓటేసిన ఓటరు తీర్పునకు అనుకూలంగా నడుచుకునే వారు ఒకరైతే.. ఓటరు గీటరు నైజాన్తా.. అధిష్టానానికే మా ఓటు అని మరో ఎంపి చింతమోహన్. రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ నిర్ణయంతో ప్రభుత్వం... Read more
Dec 07 | తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీకబ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం అమ్మవారి సారె ఊరేగింపు ఘనంగా జరుగింది. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుపతి నుంచి అమ్మవారి సారె వెంబడి ఓ గరుడ... Read more