సామాన్య భక్తులకు కూడా శ్రీవారిని అతి సమీపం నుంచి దర్శించుకునే భాగ్యం కల్పించేందుకు టీటీడీ సన్నాహాలు చేస్తోంది.చాతాండంత క్యూ లైన్. తోపులాటలు.. కొన్ని సెకన్ల పాటు కూడా తిరుమల శ్రీవారిని కనులారా చూడలేకపోతున్నారు భక్తులు. నామాలు తప్ప ... శ్రీవారి రూపం అంత స్పష్టంగా కనిపించదు. ఎక్కడో 67 అడుగుల దూరం నుంచి దర్శనం చేసుకోవాల్సి వస్తోంది. ఈ బాధలన్ని ఈ కొత్త సంవత్సరంలో తీరనున్నాయి. సామాన్య భక్తులకు కూడా స్వామి వారిని అతి సమీపం నుంచి దర్శనం భాగ్యం కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.ప్రస్తుతం శ్రీవారికి అతి సమీపంలో ఉన్న ద్వారం కులశేఖరపడి నుంచి అతిథులు, సిఫార్సు లేఖలతో వచ్చిన వారికి దర్శనం కల్పిస్తున్నారు.రాములవారి మేడ దగ్గర నుంచి ఇది 30 అడుగుల దూరంలో ఉంటుంది. ఇక్కడి నుంచి గంటకు 1600 మంది భక్తులు దర్శించుకుంటున్నారు. ఇలా రోజుకు 30 నుంచి 40వేల మంది వరకు దర్శించుకోవచ్చు.తాజా ప్లాన్ ప్రకారం... గర్భాలయంలో మార్పులు తీసుకువచ్చి 30 అడుగుల దూరం నుంచే స్వామివారి దర్శనానికి యోచిస్తున్నారు. రాముల వారి మేడకు అటు ఇటుగా ద్వారాలను ఏర్పాటు చేస్తే ఏడుకొండల వాడి ప్రభావం ఏమాత్రం తగ్గిపోదని భావిస్తున్నారు. రాములవారి మేడ ముందు ద్వారాలు ఏర్పాటు చేస్తే... దర్శనం అనంతరం ఉత్తర ద్వారం నుంచి బయటకు రావచ్చు. గతంలో ఎసీ గొట్టాలను అమర్చేందుకు ఏర్పాటు చేసిన రంధ్రాన్ని పెద్దది చేస్తే సరిపోతోందని ఆలోచన చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Apr 02 | టాలీవుడ్ లో సరికొత్త కథలకు, సరిగ్గా సరిగ్గాసరిపోయే హీరోగా ప్రభాస్ ముందు వరుసలో ఉంటాడు. ... Read more
Dec 26 | మరి కొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. ఆ రోజు కలియుగ దైవం అయిన ఏడుకొండల వాడిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు టీటీడీ కండీషన్లు పెట్టింది. కొత్త సంవత్సరం రోజున తిరుమల శ్రీనివాసుని దర్శించుకునేందుకు... Read more
Dec 17 | ప్రపంచ ప్రసిద్ధి పొందిన తిరుమలేశుని లడ్డూ ప్రసాదంలో ఇనుప నట్టు ప్రత్యక్షం కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కడప జిల్లా చక్రాయపేట మండలానికి చెందిన ఉపాధ్యాయుడు రామచంద్ర గండి క్షేత్రంలో ఈ లడ్డును కొనుగోలు చేశారు.... Read more
Dec 12 | పుట్టిన ఊరు, ఓటేసిన ఓటరు తీర్పునకు అనుకూలంగా నడుచుకునే వారు ఒకరైతే.. ఓటరు గీటరు నైజాన్తా.. అధిష్టానానికే మా ఓటు అని మరో ఎంపి చింతమోహన్. రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ నిర్ణయంతో ప్రభుత్వం... Read more
Dec 07 | తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీకబ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం అమ్మవారి సారె ఊరేగింపు ఘనంగా జరుగింది. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుపతి నుంచి అమ్మవారి సారె వెంబడి ఓ గరుడ... Read more