దత్తాత్రేయుని జననం :
పూర్వం బ్రహ్మదేవుని దివ్య నయనాలలో నుంచి అత్రి మహర్షి జన్మించాడు. అత్రి మహర్షి సతీమణి మహాసాత్వి అనసూయ. నారదుడు త్రిలోక సంచారం చేస్తూ ఇక్కడి విషయాలను అక్కడికి.. అక్కడి విషయాలను అక్కడికి చేర్చేవాడు. ఒకరోజు నారదుడు అత్రి మహర్షి భార్య అయిన అనసూచ గొప్పతనం గురించి చెప్పగా.. అది విన్న లక్ష్మీ, పార్వతి, సరస్వతి అసూయ చెందారు. వారు ముగ్గురు ఆమెను పరీక్షించవలసిందిగా త్రిమూర్తులను పంపారు.
దాంతో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు.. అత్రి మహర్షి భార్య అయిన అనసూయను పరీక్షించడానికి వారి ఇంటికి చేరుకుంటారు. కానీ వారు వెళ్లిన సమయానికి ముందే అత్రి మహర్షి ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో.. అతని సతీమణి అనసూయ అతిథి మర్యాద చేసేందుకు సిద్ధం అవుతుంది. త్రిమూర్తుల కోసం ఆమె భోజనం సిద్ధం చేసి, ఆరగించడానికి వారిని పిలుస్తుంది. అప్పుడు త్రిమూర్తులు, ఆమెతో.. ‘‘నువ్వు వివస్త్రగా (బట్టలు లేకుండా నగ్నంగా) భోజనం వడ్డిస్తేనే తింటాం’’ అని అంటారు.
త్రిమూర్తులు అడిగిన కోరికకు అనసూయ ఏమాత్రం చలించకుండా అంగీకరిస్తుంది. ముందుగా త్రిమూర్తులను బాలులుగా మార్చి, వారు కోరుకున్నట్లుగానే ఆమె వివస్త్రగా భోజనాన్ని వడ్డించింది. ఆమె ఔన్నత్యాన్ని చూసి సంతోషించిన త్రిమూర్తులు.. తమ ముగ్గురి అంశతో ఒక బాలుడు జన్మిస్తాడని ఆమెకు దీవించి, వారు అక్కడి నుంచి వెళ్లిపోతారు. అలా ఆ విధంగా అత్రి మహర్షికి, అనసూయలకు జన్మించిన పుత్రుడే ఈ దత్తాత్రేయుడు.
దత్తాత్రేయుని విశేషాలు :
త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుల అవతారంగా జన్మించిన దత్తాత్రేయుని జయంతి.. ప్రతి సంవత్సరం మార్గశిర పౌర్ణమినాడు జరుపుకుంటారు. శాస్త్రాలు, ఉపదేశాలు, పూజలు, జపాలు ఏవైనా గురుముఖంగా ఉపదేశమైనప్పుడు మాత్రమే వాటికి గుర్తింపు కలుగుతుంది. కానీ వాటన్నిటి కలయితో విశిష్ట రూపంగా అవతరించాడు దత్తాత్రేయుడు. కనుకనే దత్తాత్రేయుడు గురుదేవుడయ్యాడు.
దత్తాత్రేయుడిని పూజించడానికి ఎటువంటి ఆర్భాటాలూ, ఆడంబరాలు అవసరం లేదు. నిష్కల్మషమైన హృదయంతో ప్రార్థిస్తే చాలు.. భక్తులకు ప్రత్యక్షమై వరాలను కురిపిస్తాడు. అందుకే దత్తాత్రేయునిని ‘‘స్మృతిగామి’’ అని అంటారు. దేవదేవుడైన దత్తాత్రేయుడు.. 24 మంది గురువుల దగ్గర విద్యను అభ్యసించాడు. అందువల్ల ఇతనిని పరమ గురువుగా ప్రతిఒక్కరు కొలుస్తారు.
సృష్టిలో కన్నవారి తరువాత ఆ స్థానాన్ని దత్తాత్రేయుడు ఆక్రమించాడు. ఎందుకంటే.. మనిషికీ కావాల్సిన విచక్షణ, వివేకం, వితరణ వంటి అంశాలను అందించాడు కాబట్టి. ఇతను గురువులకు గురువే అయినప్పటికీ.. ఒక సాధారణ వ్యక్తిలా తన గురువుల దగ్గర విద్యను అభ్యసించాడు. భక్తులను ముక్తిపథంలో నడిపించి మోక్షాన్ని ప్రసాదించగలిగే పరమ యోగీశ్వరుడు దత్తాత్రేయుడు. అందుకే ఇతను విశ్వానికే గురువయ్యాడు.
(And get your daily news straight to your inbox)
Mar 17 | భారతీయ జీవన విధానంలో పండుగలకు ఎంతో ప్రాధాన్యత, ప్రాముఖ్యత నెలకొని వుంది. మరీ ముఖ్యంగా హైందవ మతాచారం ప్రకారం పండుగలకు ఎనలేని విశిష్టత ఉంటుంది. ఇక ముఖ్యంగా అందరూ అచరించే న్యూఇయర్ సంబరాలకు. తెలుగు... Read more
Jan 13 | సంక్రాంతి వేడుకల్లో చివరి రోజు పండుగ కనుమ. దీనిని ద్వాపరయుగం నుండి జరుపుకుంటునట్లు మన గ్రంథాల ద్వార తెలుస్తుంది.శ్రీ కృష్ణుడు ఒక ఆచారంగా వస్తున్న ఇంధ్రుడ్ని పూజించడం తగదని మనం మన గోవులు సుఖసంతోషాలతో జీవించడానికి... Read more
Jan 13 | సంక్రాంతి పండగ హడావుడి అంతా ఒకరోజు ముందుగా వచ్చే భోగి మంటలతోనే మొదలవుతుంది. ముచ్చటైన మూడు రోజుల పెద్ద పండగలో మొట్టమొదటి సందడి భోగిది. తెల్లారు జామునే లేచి.. ఊరంతా మంచుతెరలు కట్టినట్టుండే దృశ్యంలో-... Read more
Oct 08 | ప్రకృతితో మనిషిని మమేకం చేయటమే బతుకమ్మ పండుగ ప్రధాన ఉద్దేశం. ప్రతి మనిషి జీవితంకి పకృతితో విడదీయ్యని సంబంధం ఉంటుంది. ప్రకృతి మనిషికి జీవంతో పాటు ఆహ్లాదాన్ని ఇస్తుంది దానితో మనిషి పకృతిలో కలిసిపోయి... Read more
Oct 01 | దసరా(విజయదశమి) చెడుపై మంచి సాధించిన విజయానికి జరుపుకునే పండుగగా ప్రసిద్ధి. అయితే ఈ పండగ విషయంలో దేశ వ్యాప్తంగా భిన్న అభిప్రాయాలు(పురాణాల ప్రకారం వేరు వేరు కథలు) ఉన్నాయి. దీంతో దేశమంతా వివిధ రూపాలలో... Read more