పురాణగాధ :
పూర్వం ఒకరోజు స్వాయంభువు మనువు, బ్రహ్మదేవుని ముందు చేతులు జోడించి, వినయంగా.. ‘‘తండ్రీ! మీరు సమస్త జీవులకు జీవం అందించినవారు. మీకు నా నమస్కారాలు. నేను మీకు ఏ విధంగా సహాయపడగలనో ఆజ్ఞ ఇవ్వండి’’ అని కోరుకుంటాడు.
మనువు మాటలు విన్న బ్రహ్మ పరమానందంతో.. ‘‘పుత్రా! నిన్ను చూసి నేను ప్రసన్నుడయ్యాను. నువ్వు ఆత్మ సమర్పణ చేసి, నన్ను పూజించావు. నీకు అన్ని కార్యక్రమాల్లో శుభం కలగాలని నేను కోరుకుంటున్నాను. నువ్వు ధర్మపూర్వకంగా పృథ్విని పరిపాలించు. యజ్ఞాలు చేస్తూ శ్రీహరిని ఆరాధించు’’ అని చెబుతాడు.
మనువు.. ‘‘పూజ్యాపాదా! మీ ఆజ్ఞను నేను అవశ్యంగా పాటిస్తాను. కానీ సర్వజీవులకు నివాసస్థానం అయిన భూమి ప్రళయనీటిలో మునిగిపోయింది. దానిని నేనెలా పరిపాలించగలను’’ అని సమాధానం ఇచ్చాడు. మనువు చెప్పిన మాటలు విని, బ్రహ్మ చింతిస్తూ.. ఆలోచనలో మునిగిపోతాడు.
బ్రహ్మ అలా ఆలోచిస్తుండగా.. అకస్మాత్తుగా ఆయన ముక్కు నుంచి బొటనవేలు ఆకారమంతా ఒక వరాహ శిశువు ఉద్భవిస్తాడు. అలా చూస్తుండగానే ఆ వరాహ శిశువు పర్వతాకారంగా పెద్దగా మారి, గర్జించడం మొదలుపెట్టింది. బ్రహ్మదేవుడు తన దివ్యదృష్టితో వరాహుని ఘరఘరలు విని.. శ్రీ మహావిష్ణువే అని గ్రహిస్తాడు. విష్ణువును స్తుతించడం మొదలుపెడతాడు.
దీంతో వరాహ భగవానుడు ప్రసన్నుడై.. లోకకల్యాణం కోసం జలప్రళయంలో కొట్టుమిట్టాడుతున్న భూమిపై చేరుకుంటాడు. నీటిలో మునిగిపోయి వున్న పృథ్విని తన కోరలపై తీసుకుని రసాతలం నుంచి పైకి వస్తుండగా.. పరాక్రమవంతుడైన హిరణ్యాక్షుడు తన గదతో నీటిలోనే వరాహ భగవానుతో తలపడుతాడు. ఘోరయుద్ధం జరిగిన అనంతరం వరాహ భగవానుడు, హిరణ్యాక్షుడిని వధిస్తాడు.
ఆ విధంగా రాక్షసుడిని వధించి, జలం నుంచి బయటకు వస్తున్న భగవానుని చూసి బ్రహ్మాదిదేవతలు చేతులను జోడించి స్తుతించడం మొదలుపెట్టారు. దీంతో వరాహ భగవానుడు మరింత ప్రసన్నుడై తన గిట్టలతో జలాన్ని అడ్డగించి.. దానిపై పృథ్విని స్థాపించాడు.
తిరుమల కొండపై వరాహుని క్షేత్రం :
హిరణ్యాక్షుని సంహరించి, పృథ్విని స్థాపించిన తరువాత వరాహస్వామి భూమి మీద సంచరించేటప్పుడు వృషభానుడు అనే రాక్షసుడు తటస్థపడేసరికి... అతడ్ని చంపి ఆ కోపంతో తిరుమల కొండపై వుండేవారు. అక్కడికి శ్రీ మహావిష్ణువు రూపమే అయిన శ్రీనివాసుడు కూడా చేరుకుంటాడు. పరస్పరం వారిద్దరూ శ్రీ మహావిష్ణవు రూపాలని గ్రహిస్తారు. మహావిష్ణువు ఇలా ఈవిధంగా రెండు రూపాలను ధరించి ముచ్చటించుకోవడంతో.. ముక్కోటి దేవతలు కూడా మురిసిపోయారు.
శ్రీనివాసుడు, వరాహ భగవానుడితో.. ‘‘నాకు ఈ ప్రదేశంలో కలియుగాంతం వరకు నివసించాలనే సంకల్పం కలిగింది. నాకు కొంత స్థలం ప్రసాదించండి’’ అని కోరుకున్నాడు. దానికి వరాహస్వామి ఏదైనా మూల్యం చెల్లిస్తేనే స్థలమిస్తానని పేర్కొంటారు. శ్రీనివాసుడు.. ‘‘నా దగ్గర ధనం, ఆభరణాలు ఏమీ లేవు. మీరిచ్చే స్థలానికి ప్రతీకగా.. భక్తులు మీకే ముందుగా దర్శనం, నైవేద్యాలు జరిగేటట్లు చేస్తాను’’ అని చెబుతాడు. అందుకు వరాహస్వామి అంగీకరిస్తారు. ఇలా ఈ విధంగా శ్రీ మహావిష్ణువు రెండు అవతారాలతో భక్తుల కోరికల్ని తీరుస్తున్నారు. ప్రస్తుతం తిరుమల కొండలలో ఆదివరాహస్వామి కొలువై వున్నాడు.
(And get your daily news straight to your inbox)
Mar 17 | భారతీయ జీవన విధానంలో పండుగలకు ఎంతో ప్రాధాన్యత, ప్రాముఖ్యత నెలకొని వుంది. మరీ ముఖ్యంగా హైందవ మతాచారం ప్రకారం పండుగలకు ఎనలేని విశిష్టత ఉంటుంది. ఇక ముఖ్యంగా అందరూ అచరించే న్యూఇయర్ సంబరాలకు. తెలుగు... Read more
Jan 13 | సంక్రాంతి వేడుకల్లో చివరి రోజు పండుగ కనుమ. దీనిని ద్వాపరయుగం నుండి జరుపుకుంటునట్లు మన గ్రంథాల ద్వార తెలుస్తుంది.శ్రీ కృష్ణుడు ఒక ఆచారంగా వస్తున్న ఇంధ్రుడ్ని పూజించడం తగదని మనం మన గోవులు సుఖసంతోషాలతో జీవించడానికి... Read more
Jan 13 | సంక్రాంతి పండగ హడావుడి అంతా ఒకరోజు ముందుగా వచ్చే భోగి మంటలతోనే మొదలవుతుంది. ముచ్చటైన మూడు రోజుల పెద్ద పండగలో మొట్టమొదటి సందడి భోగిది. తెల్లారు జామునే లేచి.. ఊరంతా మంచుతెరలు కట్టినట్టుండే దృశ్యంలో-... Read more
Oct 08 | ప్రకృతితో మనిషిని మమేకం చేయటమే బతుకమ్మ పండుగ ప్రధాన ఉద్దేశం. ప్రతి మనిషి జీవితంకి పకృతితో విడదీయ్యని సంబంధం ఉంటుంది. ప్రకృతి మనిషికి జీవంతో పాటు ఆహ్లాదాన్ని ఇస్తుంది దానితో మనిషి పకృతిలో కలిసిపోయి... Read more
Oct 01 | దసరా(విజయదశమి) చెడుపై మంచి సాధించిన విజయానికి జరుపుకునే పండుగగా ప్రసిద్ధి. అయితే ఈ పండగ విషయంలో దేశ వ్యాప్తంగా భిన్న అభిప్రాయాలు(పురాణాల ప్రకారం వేరు వేరు కథలు) ఉన్నాయి. దీంతో దేశమంతా వివిధ రూపాలలో... Read more