సోమనాథ ఆలయం
గుజరాత్ లో వున్న ఈ ఆలయం 11వ శతాబ్ధంలో నిర్మితమైంది. ప్రస్తుత కట్టడాన్ని 1951లో పునర్నిర్మించినారు. ఈ ఆలయ సంపద కోసం చాలానే యుద్ధాలు జరిగాయి. 17 సార్లు నాశనం చేయబడ్డ ఈ ఆలయం తరువాత జరిగిన పునర్నిర్మాణంతో పురాతన శోభను సంతరించుకుంది. ఈ ఆలయ విచిత్రాలలో ఒకటి.. చంద్రుడు ఈ ఆలయ లింగాన్ని ప్రతిష్టించడం. ఆలయం మధ్యభాగంలో భూమిలోపల ఎటువంటి ఆధారం లేకుండా ఈ లింగం నిలిచి ఉండడం ఒక ప్రత్యేకత.