Hyderabad stinks as civic staff go on strike

Hyderabad stinks as civic staff go on strike, GHMC staff go on flash strike, Greater Hyderabad Municipal Corporation, GHMC employees go on strike, city hit

Hyderabad stinks as civic staff go on strike, GHMC staff go on flash strike

హైదరాబాద్ లో సమ్మె-నగరవాసుల్లో చెత్త భయం

Posted: 10/22/2013 10:57 AM IST
Hyderabad stinks as civic staff go on strike

హైదరాబాద్ లో ఇప్పుడు సమ్మె మొదలైంది. ఈ సమ్మె పుట్టింది రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా కాదులేండి. దాదాపు 24 వేల మంది ఒకేసారి సమ్మె బాట పట్టారు. దీంతో హైదరాబాద్ పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది. వీరు నిన్నటి నుండి సమ్మెను కోనసాగిస్తున్నారు. ఒక్కరోజుకే.. హైదరాబాద్ అతలకుతలమైపోయింది. వీరుగానుక ఒక వారం రోజులు సాగితే.. మాత్రం హైదరాబాద్ పేరు కూడా మారిపోయిందని ..అధికారులు అంటున్నారు. అయితే వీరితో రాత్రి ప్రభుత్వం చర్చలు జరపటం, అవి కాస్త విఫలం కావటంతో.. ఈరోజు కూడా సమ్మెబాట పట్టారు.

 

దీంతో హైదరాబాద్ వాసులకు టెన్షన్ పట్టుకుంది. అసలు ఇంతకీ వీరు ఎవరు చెప్పలేదు కదు... వీరంతా జీహెచ్‌ఎంసీలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులు. తమ డిమాండ్ల సాధనకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన సమ్మెలో భాగంగా జీహెచ్‌ఎంసీలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులు నిన్న విధులు బహిష్కరించారు. చెత్త తరలింపు, పారిశుధ్య విభాగాలతో పాటు రవాణా, దోమల నివారణ విభాగాల్లోని దాదాపు 24, మంది కార్మికులు విధులు బహిష్కరించారు. పారిశుధ్య పనులు, దోమల నివారణ కార్యక్రమాలు కుంటుపడ్డాయి.

 

జీహెచ్‌ఎంసీలో గుర్తింపు యూ నియన్ అయిన జీహెచ్‌ఎంఈయూ మినహా దాదాపు పది యూనియన్లు సమ్మెలో పాల్గొన్నా యి. బీఎంఎస్, ఏఐటీయూసీ, సీఐటీయూ, హెచ్‌ఎంఎస్, ఐఎన్‌టీయూసీ, టీఎన్‌టీయూసీ తదితర యూనియన్ల ఆధ్వర్యంలో కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సభలో పలువురు నేతలు మాట్లాడుతూ, కాంట్రాక్టు కార్మికులకు రూ. 12,500 కనీస వేతనం, ఇతర డిమాండ్లను తీర్చే వరకు సమ్మె నిర్వహిస్తామని హెచ్చరించారు. బీఎంఎస్ నేతలు శంకర్, వినయ్‌కపూర్ మాట్లాడుతూ, ప్రభుత్వం తమ డిమాండ్లకు అంగీకరించకుంటే ఈరోజు నుంచి కార్యాలయాలను కూడా మూసివేయిస్తామని, ఉద్యోగుల్ని కార్యాలయాల్లో కూర్చోనివ్వకుండా పూర్తిస్తాయిలో సమ్మె చేస్తామని హెచ్చరించారు.

 

కమిషనర్ చర్చలు..

 

సమ్మె నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ కృష్ణబాబు మధ్యాహ్నం ఆయా యూనియన్ల నేతలతో చర్చలు జరిపారు. ప్రజారోగ్యం దృష్ట్యా చెత్త తరలింపు వాహనాలను అడ్డుకోవద్దని కోరారు. దేశంలో ఏ కార్పొరేషన్‌లో లేని విధంగా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ కార్మికుల వేతనాలను వారి పేరిటే నేరుగా బ్యాంకుల్లో వేస్తున్నామని చెప్పారు. 24 మంది ఉద్యోగులకు ఈపీఎఫ్, ఈఎస్‌ఐ సదుపాయాన్ని వర్తింపచేస్తున్నామని తెలిపారు. రాష్ట్రస్థాయి అంశాలు మినహా, జీహెచ్‌ఎంసీకి సంబంధించిన కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి తాము సానుకూలంగా ఉన్నామన్నారు. 10వ పీఆర్‌సీ రికమెండేషన్ల కనుగుణంగా వేతనాల్ని పెంచాలని ప్రభుత్వాన్ని కోరానన్నారు. ఔట్‌సోర్సింగ్ కార్మికులకు ఇన్సూరెన్స్ సదుపాయం కోసం రూ. 4 లక్షలు కేటాయించామన్నారు.

 

 

కార్మికుల చేస్తున్న సమ్మె వల్ల .. ప్రజలు అనారోగ్యల భారిన పడే అవకాశం ఉందని..నగరవాసులు అంటున్నారు. ఇప్పటికి నగరంలో చేత్త పేరుకుపోయి ఉందని నగర వాసులు అంటున్నారు. దీనిపై ప్రభుత్వం త్వరగా చర్చలు జరిపి.. వారి డిమాండ్లను పరిష్కరించకపోతే.. పరిస్థితి చెయి దాటిపోతుందని.. నగరవాసులు అంటున్నారు. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకోకుండ.. ముందుగానే అధికారులు మేలుకోవాలని నగర ప్రజలు కోరుతున్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Ghmc labour go on flash strike

    సమ్మె సైరన్ మోగించిన మున్సిపల్ కార్మికులు

    Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more

  • Nara lokesh counter on ys jagan

    జగన్ కు నారా లోకేష్ సవాల్

    Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more

  • Nannapaneni rajakumari press meet

    ఇంతటితో ముగిద్దాం- నా మనసు గాయపడింది : నన్నపనేని

    Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more

  • Ou students thrown stones on police

    పడిపోయిన నన్నపనేని-పోలీసులపై రాళ్లదాడి

    Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more

  • Tg venkatesh comment on telangana bill

    టి-బిల్లుతో పాటు డబ్బు సంచులు- అవసరం లేదు:టిజీ

    Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more