Final pujas to khairatabad ganesh nimajjanam 2013

Final Pujas to Khairatabad Ganesh nimajjanam 2013, khairatabad ganesh 2013, Khairatabad Ganesh Immersion Live 2013, Khairatabad Ganesh Nimajjanam 2013, 59 Feet Khairatabad Ganesh, Khairatabad Ganesh immersion Sobha yatra

Final Pujas to Khairatabad Ganesh nimajjanam 2013

పూజలందుకుంటున్న 'ఖైరతబాద్ గణనాథుడు' నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు

Posted: 09/18/2013 12:44 PM IST
Final pujas to khairatabad ganesh nimajjanam 2013

ఆఖరి రోజున ఖైరతాబాద్ మహా గణపతికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. 59 అడుగులున్న ఈ గణనాథుడిని నిమజ్జనం చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. విజయవాడ నుండి ప్రత్యేక ట్రక్కును తీసుకొచ్చినట్లు తెలిపారు. మధ్యాహ్నం 2.00 గణనాథుడిని ట్రక్కుపై ఎక్కించడం జరుగుతుందని, అనంతరం ఊరేగింపుగా నిమజ్జనానికి తరలివెళ్లడం జరుగుతుందని పేర్కొన్నారు. ఉత్తరాఖండ్ లో జరిగిన ప్రకృతి వైపరీత్యం జరగకుండా చూడాలని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఖైరతాబాద్ గణనాథుడి వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

59 అడుగులు..

ఖైరతాబాద్ వినాయకుడుని ఏర్పాటు చేసి 59 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈసారి 59 అడుగుల గణనాథుడిని నెలకొల్పారు. ఈసారి గోనాగ చతుర్ముఖి ఆకారంలో విగ్రహాన్ని ప్రతిష్టించారు. గోవుల్ని రక్షించాలన్న సందేశం ఇవ్వడం కోసం విగ్రహాన్ని రూపొందించారు. ఎడమ పక్కన శ్రీ భువనేశ్వరీదేవి విగ్రహం, కుడి భాగంలో శ్రీ విజయరామ పట్టాభిషేక విగ్రహాన్ని తీర్చిదిద్దారు.

ఖైరతాబాద్ లడ్డూ..

ఖైరతాబాద్ వినాయకుడికి మరో విశేషం కూడా ఉంది. గణేషుడి చేతిలో ఉంచే లడ్డూకు కూడా ప్రాముఖ్యత ఉంది. లడ్డూ విషయంలో నిర్వాహకులు ప్రత్యేక శద్ధ కనబరుస్తుంటారు. తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరంలో ఈ లడ్డూను తయారు చేసి తీసుకొస్తుంటారు. సురుచి ఫుడ్స్ నడుపుతున్న మిఠాయి వ్యాపారి ఈసారి 4వేల 170 కేజీల బూందీతో భారీ లడ్డూను తయారు చేశారు. ఈ లడ్డూను అత్యంత నియమనిష్టలతో తయారు చేస్తారు. పవిత్రతకు భంగం కలగకుండా ఉండడం కోసం గణేష్ మాల ధరించిన సుమారు 16 మంది కార్మికులు దీనిని రూపొందించారు. ఈ లడ్డూను వేలం వేయకుండా అందరికీ పంచి పెడుతారు.

 

నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు: జిహెచ్ఎంసి

గణేష్ నిమజ్జనానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని జిహెచ్ ఎంసి కమిషనర్ కృష్ణబాబు చెప్పారు. అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో రేపు ఉదయం 9 గంటల కల్లా వినాయక నిమజ్జనం పూర్తవుతుందని వెల్లడించారు. ఈరోజు గణేష్ నిమజ్జనం సందర్భంగా ట్యాంక్ బండ్ పై ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. గతంలో కొంత ఆలస్యం జరిగిందని, దీనిని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు అదనపు చర్యలను తీసుకున్నామన్నారు. ఇప్పటికే హుస్సేన్ సాగర్ వద్ద 59 క్రేన్లు, మరికొన్ని ప్రాంతాలలో మొబైల్ క్రేన్లు ఏర్పాటు చేశామని అన్నారు. అందుకు గానూ 2250 మంది వర్కర్లు పనిచేస్తున్నట్లు చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు సాగర్ లో టూరిజం బోట్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడానికి జనరేటర్ బ్యాకప్ ఏర్పాటు చేసినట్లు జిహెచ్ఎంసి కమిషనర్ కృష్ణబాబు తెలిపారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Ghmc labour go on flash strike

    సమ్మె సైరన్ మోగించిన మున్సిపల్ కార్మికులు

    Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more

  • Nara lokesh counter on ys jagan

    జగన్ కు నారా లోకేష్ సవాల్

    Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more

  • Nannapaneni rajakumari press meet

    ఇంతటితో ముగిద్దాం- నా మనసు గాయపడింది : నన్నపనేని

    Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more

  • Ou students thrown stones on police

    పడిపోయిన నన్నపనేని-పోలీసులపై రాళ్లదాడి

    Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more

  • Tg venkatesh comment on telangana bill

    టి-బిల్లుతో పాటు డబ్బు సంచులు- అవసరం లేదు:టిజీ

    Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more