ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డిని ఈరోజు తెలంగాణ మంత్రులు కలుసుకున్నారు. ఏపీ ఎన్జీవోల సమావేశానికి మీరే మద్దతు ఇచ్చారని, సీమాంధ్రకు అనుకూలంగా ఉన్నారని అందరూ అంటున్నారని సీఎంతో తెలంగాణ మంత్రులు అన్నారు. దీనిపై స్పందించిన కిరణ్కుమార్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్న మాట వాస్తవమేనని, అలాగని సీమాంధ్రకు అనుకూలం కాదని, వారికి మద్దతు ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. ఆంద్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉన్న తనకు అందరూ సమానమేనని సీఎం కిరణ్ తెలంగాణ మంత్రులతో అన్నారు. ఆనాడు ప్రత్యేక తెలంగాణ కోసం తెలంగాణ వాదులు, నేతలు ఉద్యమాలు చేస్తుంటే మీరు వెళ్లి మద్దతు తెలిపారు కాదా అని తెలంగాణ మంత్రులను ఉద్దేశించి అన్నారు. మీ మనోభావాలను అర్ధం చేసుకున్నాను. అలాగే ఇప్పుడు ఏపీ ఎన్జీవోలు సమైక్యం కోరుతూ సభ పెట్టుకున్నారు. వాళ్ల మనోభావాలను అర్ధం చేసుకున్నానని తెలంగాణ మంత్రులతో సీఎం అన్నారు.
ఓటింగ్ ఉండదు : గండ్ర
విభజనపై అసెంబ్లీలో చర్చే తప్ప ఓటింగ్? ఉండదని, ప్రాంతాల వారీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తారని, దానికి విప్ జారీ చేయాల్సిన అవసరం ఏముందని ప్రభుత్వ చీఫ్విప్ గండ్ర వెంకట రమణారెడ్డి ప్రశ్నించారు. ఆనాటి సమావేశంలోనే సద్భావన సభ నిర్వహణపై తుది నిర్ణయం తీసుకుంటామని వివరించారు. తెలంగాణ రాష్ట్రానికి సానుకూలంగా నిర్ణయం తీసుకున్నందుకు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీపై సీమాంధ్ర నేతలు విమర్శలు గుప్పించడాన్ని గండ్ర తప్పుపట్టారు. రాష్ట్రంలో దాదాపు అన్ని రాజకీయపక్షాలూ తెలంగాణాకు సానుకూలంగా నిర్ణయం తీసుకున్నాకే .. ఆడిన మాటను తప్పని కాంగ్రెస్ దీనిపై ఒక నిర్ణయం తీసుకుందని వివరించారు. రాష్ట్రంలో తెలంగాణ కోసం లేఖలు ఇచ్చిన రాజకీయ పక్షాలు తమ లబ్ది కోసం యూటర్న్ తీసుకున్నా కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రం మాటకు కట్టుబడి ఉందన్నారు.
(And get your daily news straight to your inbox)
Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more
Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more
Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more
Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more
Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more