తెలుగు ప్రజలను విడతీసేందుకు కాంగ్రెస్ పార్టీ ఒడిగట్టిందని జరుగుతున్న ప్రచారం సరికాదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డి.శ్రీనివాస్ స్పష్టం చేశారు. పరిపాలన సౌలభ్యం కోసమే రాష్ట్రాన్ని పార్టీ రెండు భాగాలుగా చేసిందని శ్రీనివాస్ వెల్లడించారు. ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. రాజకీయ లబ్ధికోసం పార్టీ ఇంతటి ఘాతుకానికి పాల్ప డిందనే అసత్యపు ప్రచారాన్ని ప్రజలు విశ్వసించవద్దని డిఎస్ విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. కొన్ని అసమానతలు తొలగించేందుకు పరిపాలనా పరంగా కొన్ని మార్పులు అవసరమని కాంగ్రెస్ పార్టీ భావించిందని శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రకటనకు ముందు పార్టీ అనేక కోణాలలో పరిష్కారం కోసం ప్రయత్నించిందని, గత్యంతరం లేక తుదకు నిర్ణయం తీసుకో వాల్సి వచ్చిందని డిఎస్ అన్నారు. హైదరాబాదులో నివశించే సీమాంధ్రులను సెటిలర్స్గా అభివర్ణించడం సరికాదని ఆయన హతవు పలికారు. భారతీయు లైనవారు ఎవరైనా, ఎక్కడైనా జీవించే హక్కును రాజ్యాంగం కల్పించిందని తెలియచేశారు. వారికి భద్రత కల్పించడం ప్రభుత్వం బాధ్యత అని అందుకు అవసరమైన చట్టాలను కూడా చేస్తామని డిఎస్ హామీ ఇచ్చారు. రాష్ట్రం విడిపోతుందని బాధతో ప్రజలు విధ్వంసాలకు దిగవద్దని హతవు పలికారు. రాష్ట్రం విడతీసి వేరే రాష్ట్రంలో కలిపినట్లయితే తెలుగువారందరూ సంఘటితంగా ఆందోళనలు చేయాలికాని, ఒకే భాష మాట్లాడే మన సోదరులు తమకు అన్యాయం జరిగిందంటూ రోడ్డెక్కవద్దని ఆవేదన వ్యక్తం చేశారు. సీమాంధ్రకు చెందిన ఎంపీలు రాజీనామాకు పాల్పడేముందు మరో మారు ఆలోచించాలని ఆయన సూచిం చారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని తప్పనిసరి పరిస్థితిలోనే విడతీసేందుకు ప్రయత్నించిందన్నారు.
(And get your daily news straight to your inbox)
Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more
Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more
Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more
Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more
Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more