రామ్ ప్రస్తుతం నటిస్తున్న ‘పండగచేస్కో’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. షూటింగ్ చివరి దశకు చేరుకుంది. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా పూర్తయ్యాక.. రామ్ ‘శివం’ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు.
రామ్ హీరోగా ‘శివం’ అనే చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో శ్రీనివాస రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాలో రామ్ సరసన హీరోయిన్ గా అయిషాను ఎంపిక చేసినట్లుగా తెలిసింది. అయిషా ఇప్పటికే పలు సంస్థలకు మోడల్ గా చేసింది.
అయిషా మరెవరో కాదు రాంచరణ్ ‘చిరుత’ సినిమాలో హీరోయిన్ గా నటించిన నేహాశర్మ చెల్లెలు. నేహశర్మకు తెలుగులో అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ కు మకాం మార్చేసింది. ఇపుడు తాజాగా చెల్లెలు అయిషా తెలుగులోకి ఎంట్రీ ఇవ్వనుంది.
ఇపుడు హీరోయిన్ గా అవకాశం రావడంతో అయిషా చాలా సంతోషంగా వుందట. తన చెల్లెలు కూడా తెలుగులో మొదటి సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుండటంతో నేహాశర్మ కూడా చాలా సంతోషంగా వుందట. అయితే ఈ ప్రాజెక్టు త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more