నీళ్లు ఎక్కడుంటే.. అక్కడ కప్పలు ఉండటం సహజం. అలాగే బెల్లం ఉన్నచోట.. ఈగలు చేరతాయనేది అంతే నిజం. అయితే టాలీవుడ్ లవ్ బర్డ్స్ (జీవిత, రాజశేఖర్లు) గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఈ ఇద్దరు వేసుకోని పార్టీ జెండా లేదు, కలవని .. రాజకీయ నేతలు లేరు. ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన బలంగా ఉన్న, రాజకీయ పార్టీ అండ లేకపోవటం వల్ల వీరు ప్రజా సేవకు దూరంగా ఉంటున్నారు. అయితే ఇటీవలే బిజేపిలో చేరి కమల పువ్వులను చేతిలో పట్టుకోని టాలీవుడ్ లో సందడి చేశారు.
అయితే కమలం పువ్వు నేతలు అధికారంలోకి రావటంతో.. జీవిత, రాజశేఖర్లు ఫిలింనగర్లో పండగ చేసుకున్నట్లు సమాచారం. కమలం పవర్ కేంద్రంలో ఉందికానీ.. స్టేట్ లో మాత్రం .. చిన్న పువ్వు(గులాబీ) అధికారంలోకి రావటంతో కొంచెం ఢీలా పడినట్లు తెలుస్తోంది. ఈరోజు జీవిత, రాజశేఖర్లు . చిన్న పువ్వు గులాబీ బాస్, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును కలిసి .. తమగోడు వెళ్లబోసుకున్నారు.
సచివాలయంలోకి ఈ ఇద్దరు రావటం తెలుసుకున్న కేసిఆర్, మొదట చిరాకు పడినట్లు తెలుస్తోంది. ఆ తరువాత వచ్చిరాని నవ్వుతో.. లోపలికి ఈ ప్రేమపక్షులను ఆహ్వానించినట్లు సమాచారం. అయితే వీరి మద్య ఎక్కువ సేపు చర్చలు జరగలేదని సచివాలయంలోని సిబ్బంది అంటున్నారు. కేసిఆర్ నేరుగా. .. నేను మీకు ఏవిధంగా సహాయపడగలను అని అడగటంతో.. వెంటనే.. జీవిత తన కొంగుకు కట్టుకున్న ఫిర్యాదుల మూటను విప్పి చెప్పటం మొదలుపెట్టారు.
టాలీవుడ్ లో ..నాలుగు కుటుంబాలతో, మేము, చిన్న నిర్మాతలు నలిగిపోతున్నాం, ఆ నాలుగు కుటుంబాలే.. టాలీవుడ్ లో రాజ్య మేలుతున్నాయి. వీరి వల్ల చిన్న సినిమా నిర్మాతలు, మాలాంటి వారు బాగా నష్టపోతున్నారని .. జీవిత, రాజశేఖర్లు ఒకరు మార్చి, ఒకరు చెప్పి కన్నీరు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
అయితే కేసిఆర్ కు మాత్రం .. జీవిత మాటలు బాగా అర్థమవుతున్నాయి., కానీ రాజశేఖర్ మాట్లాడేటప్పుడు.. కేసిఆర్ కు అర్థంగాక... సరే .. సరే.. అలాగే ..చేద్దాం, చూద్దాం అని చెప్పటం జరిగిందని సచివాలయంలోని సిబ్బంది అంటున్నారు.
అసలే ఆంద్రోళ్లు అంటే శివతాండవం చేస్తున్న కేసిఆర్ కు జీవిత, రాజశేఖర్లు వెళ్లి మరి కొంచెం ఆజ్యం పోయటం జరిగిందని ఫిలింనగర్ వాసులు అంటున్నారు. కేసిఆర్ మాత్రం జీవితా, రాజశేఖర్లు తీసుకువెళ్లిన... గులాబీల బుకే ని వారికే ఇచ్చి పంపినట్లు మీడియా వర్గాలు అంటున్నాయి. అంటే కేసిఆర్ సెంటిమెంట్స్ కు బాగా విలువిస్తారని అందరికి తెలుసు.
అందుకే జీవితా, రాజశేఖర్లు తెచ్చిన గులాబీ బుకే వెనక్కి పంపించారని సచివాలయం సిబ్బంది గుసగుసలాడు కుంటున్నారు. అంటే ఈ దంపతులు ఎక్కడ కాలుపెడితే.. అక్కడ.. మొక్కలు కూడా మొలవటానికి భయపడతాయని చిత్రపూరి కాలనీ వాసులు అనుకుంటున్నారు. అంతేకాకుండా ఈ ఇద్దరు కలిసిన రాజకీయ నేతలకు కూడా అంతగా మంచిది కాదని రాజకీయ నాయకులు అంటున్నారు.
వీరు బిజేపిలో చేరిన వెంటనే.. బిజేపి ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ..హవా బాగా తగ్గి పోయిందని .. ఆ పార్టీ కార్యకర్తలే అంటున్నారు. ఇక జగన్ పరిస్థితి అయితే అధికారమే దక్కకుండా పోయిందని అంటున్నారు. వీరు అడుగుపెట్టిన ఏ రాజకీయ పార్టీ, రాజకీయ నేతలు బతికి బట్టకట్టింది చాలా తక్కవని.. రాజకీయ పార్టీల నేతలు బహిరంగంగానే అంటున్నారు.
ఇలాంటి మాటలు విన్న ..తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ఆ మాత్రం జాగ్రత్తగా ఉండటం మంచిదేనని.. కేసిఆర్ అభిమానులు అంటున్నారు. ఇక కేసిఆర్ జీవితా, రాజశేఖర్లు ఇచ్చిన ఫిర్యాదు మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో వేచి చూద్దాం.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more