తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బావమరిది నందమూరి హరిక్రిష్ణ మౌనం వీడి జనస్రవంతిలో కలిసిపోయారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలపై సీతయ్య స్పందించారు. రాష్ట్రంలో మూడు దశల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారని తెలిపారు. కాంగ్రెస్ అధికార దుర్వినియోగం, వైఎస్సార్సీపీ అవినీతిని ప్రజలు తిరస్కరించారన్నారు. ఈ ఎన్నికల సరళిని విశ్లేషిస్తే ప్రజలు తమ పక్షానే ఉన్నారని అర్థమవుతోందన్నారు. టీడీపీకి పట్టం కట్టిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో మూడు విడతలుగా నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్కు దీటుగా నిలిచింది. ఆ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడినా, క్షేత్ర స్థాయిలో ఉన్న బలంతో తెలుగుదేశం మంచి ఫలితాలు సాధించింది. రాష్ట్ర విభజన సమస్యపై ద్వంద్వ వైఖరి అవలంభించి ఇబ్బందుల్లో పడినప్పటికీ, ఇటు తెలంగాణలోనూ, అటు సీమాంధ్రలోనూ పార్టీ పుంజుకుంది. కాంగ్రెస్ పార్టీ 6 వేలకు పైగా పంచాయతీలను సాధించగా, అదే స్థాయిలో టీడీపీ కూడా విజయం దక్కించుకుంది. తెలంగాణా రాష్ట్రం పై మాట్లాడుతూ రెండు చోట్ల అధికారం చేజించుకొనే ఆవకాశం ఒక్క తెలుగుదేశం పార్టీకే ఉందన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ శకుని పాత్ర పోషిస్తుందన్నారు. రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ను ఇరు ప్రాంతాల ప్రజలు మట్టికరిపిస్తారని సీతయ్య జోస్యం చెప్పారు. రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో సీతయ్యలో కొత్త కోరికలు పుట్టినట్లుగా ఉందని అందుకే .. ఎన్నడు లేనిది సీతయ్య ఎన్టీఆర్ భవన్ లో వచ్చి సందడి చెయ్యటం జరిగిందని టిడిపి నాయకులు అంటున్నారు. అంతే రెండు రాష్ట్రాలు అయితే టిడిపి జాతీయ పార్టీ అవుతుంది కాబట్టి, అప్పుడు సీతయ్య మనసులో ఉన్న కోరిక నేరవేరుతుందనే ఉద్దేశంతో చంద్రబాబును, టిడిపి ని పొగిడినట్లు తెలుగుదేశం కార్యకర్తలు ఎన్టీఆర్ భవన్ లో చెప్పుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more