అసెంబ్లీలో సమావేశంలో టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మద్య మాటల యుద్దం జరుగుతుంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే హారీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వాగ్వీవాదానికి దారీ తీసింది. ఈ సందర్భంలో హరీస్ రావు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి టార్గెట్ చేసి ‘‘ తెలంగాణ ఉద్యమ కారులు కాలర్ పట్టుకుని ప్రశ్నిస్తే కానీ తెలంగాణ ప్రాంతానికి నిధులు కేటాయించడం లేదు, పనులు అవడంలేదు’’ అని హరిష్ రావు చేసిన కామెంట్ పై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందు భాష మార్చుకోవాలని, నోరు అదుపులో పెట్టుకోవాలని, వీధి రౌడీలా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. తాను ఎవరికీ భయపడేది లేదని, బెదిరిస్తే బెదిరిపోయే వ్యక్తిని కాదని, నన్ను బెదిరించే దమ్ము హరీష్రావుకు లేదని సీఎం అన్నారు. అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానంపై చర్చ వాడిగా వేడిగా సాగుతోంది. హరిష్రావు వ్యాఖ్యలపై సీఎం కిరణ్ ఘాటుగా సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఎవరి దయాదాక్షిణ్యాల మీద ముఖ్యమంత్రి పదవి చేపట్టలేదని, కాంగ్రెస్ పార్టీ వల్లే ముఖ్యమంత్రి అయ్యానన్నారు. హరీష్ రావు సభలో వ్యక్తిగతంగా మాట్లాడటం సరికాదని ఆయన అన్నారు. తమ పార్టీలో ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు, స్పీకర్‑ను పార్టీ అధిష్టానమే నిర్ణయిస్తుందన్నారు. తమ భిక్ష వల్లే హరీష్ రావు మంత్రి అయ్యారని సీఎం ఎద్దేవా చేశారు. తెలంగాణ వ్యక్తిని ప్రధానమంత్రిని చేసిన ఘటన కాంగ్రెస్ పార్టీదని కిరణ్ అన్నారు. అంతేకాకుండా తాము ఎవరికో భయపడి పని చేయటం లేదని, ఏ ప్రాంతానికి ఎంత ఇవ్వాలో తమకు తెలుసు అన్నారు. ఓ దశలో నిగ్రహం కోల్పోయిన ముఖ్యమంత్రి 'మీకు భయపడి ఇస్తామనుకుంటే రాసి పెట్టుకో... ఒక్క రూపాయి కూడా ఇవ్వం, ఏం చేసుకుంటావో చేసుకో' అని ముఖ్యమంత్రి హెచ్చరించారు. నేను హైదరాబాద్ గడ్డపైనే పుట్టానని, ఇక్కడే చదువుకున్నానని, తెలంగాణకు అసలైన వారసులం మేమేనని సీఎం కిరణ్కుమార్రెడ్డి అన్నారు. చివరిగా తాను చేసిన వ్యాఖ్యలు హరీష్రావు వరకేనని, ఆయన బాధపడితే వాఖ్యలను ఉపసంమరించుకుంటామని కిరణ్కుమార్రెడ్డి అన్నారు. అసెంబ్లీలో రెచ్చిపోయిన కిరణ్ కుమార్ రెడ్డి ని చూసిన రాజకీయ నాయకులు ఆశ్చర్యపోయారు. ఎప్పుడు సైలెంట్ గా ఉంటే ముఖ్యమంత్రిలో ఇంత ఫైర్ ఉందా అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బిత్తరపోయి చూసినట్లు మీడియా వర్గాలు అంటున్నాయి. హరిష్ రావుకు సీఎం ఇచ్చిన షాక్ కు మిలిగిన రాజకీయపార్టీ నాయకులు షాక్ తిన్నారు. ఈ సంఘటన తో కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయల్లో గట్టి పట్టు సాధించారనేది అర్థం అవుతుంది. అంతేకాకుండా కేంద్ర నాయకులు కూడా సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి పుల్ పవర్స్ ఇచ్చినట్లుగా ఉందని సభలో రాజకీయ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more