మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజీనామాపై గవర్నర్ నరసింహన్ స్పష్టత ఇచ్చారు. ధర్మాన రాజీనామా ఫైలు ఇంకా తన వద్దకు రాలేదన్న ఆయన ముఖ్యమంత్రి సిఫారసు చేస్తే రాజ్యాంగబద్దంగా వ్యవహరిస్తానని చెప్పారు. రాష్ట్ర మంత్రి వర్గంలో మార్పులు, చేర్పులపై తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు. రంజాన్ సందర్భంగా గవర్నర్ రాజ్ భవన్ లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సీనియర్ మంత్రి జానారెడ్డి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి, వి.హన్మంత రావు, షబ్బీర్ అలీ, స్పీకర్ నాదెండ్ల మనోహర్, డిప్యూటీ స్పీకర్ భట్టి విక్రమార్క, మండలి చైర్మన్ చక్రపాణి, మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, గంటా శ్రీనివాస రావు, అహ్మదుల్లాలు హాజరయ్యారు.
ఇదిలా ఉండగా, ధర్మాన రాజీనామాపై నిర్ణయం మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ధర్మానని ఈ కేసు నుంచి కాపాడేందుకు ఆయన అనుయాయులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన రాజీనామాని ఆమోదించవద్దంటూ కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. మరో వైపు ధర్మాన రాజీనామాపై సత్వరం నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ లో మరో వర్గం పట్టుబడుతోంది. జగన్ ఆస్తుల కేసులో బుక్కయిన ధర్మానని రక్షించుకునేందుకు ఆయన వర్గం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఈ కేసులో నాలుగో చార్జిషీట్ దాఖలు చేసిన సీబీఐ అందులో ధర్మానని ఏ5 నిందితుడిగా పేర్కొంది. తనపై అభియోగాలు మోపబడ్డాక మంత్రిగా కొనసాగలేనంటూ ధర్మాన ఇప్పటికే తన రాజీనామా లేఖని సీఎం కిరణ్ కి అందజేశారు. దర్మాన రాజీనామాని ఆమోదించాలా లేదా అన్న మీమాంసలో కాంగ్రెస్ అధిష్టానం కూడా ఉంది. పరిస్థితి ఇలా ఉండగానే ధర్మాన అనుయాయులు ఢిల్లీలో తిష్టవేసి కాంగ్రెస్ పెద్దలపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
తన రాజకీయ గురువైన ధర్మానని రక్షించేందుకు ఎంపీ కిల్లి కృపారాణి రంగంలోకి దిగారు. ధర్మాన రాజీనామాని ఆమోదించవద్దని కోరుతూ ఆమె కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి గులాం నబీ ఆజాద్్ని కలిసారు. అనంతరం అధినేత్రి సోనియాని కూడా కలిసి తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని కోరారు. అనంతరం ఆమె వాయలార్ రవిని కలిసి పరిస్థితిని వివరించారు. సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్్తో కూడా కృపారాణి మంతనాలు జరిపారు. మరోవైపు శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ నేతలంతా హస్తిన బాట పడుతున్నారు. ధర్మానని రక్షించుకునేందుకు వారు కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. ఆ మేరకు 21, 22 తేదీల్లో వారు ఢిల్లీ పెద్దలని కలవనున్నారు. ధర్మాన లాంటి నేతకి నష్టం జరిగితే ఆ ప్రభావం మొత్తం ఉత్తరాంధ్ర జిల్లాలన్నింటిపై ఉంటుందని, ప్రస్థుత పరిస్థితుల్లో అది పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తుందని వారు వాదిస్తున్నారు.
అసలు ఈ వ్యవహారాన్ని ఏ విదంగా చక్కబెట్టాలో అర్థం గాక ఢిల్లీ పెద్దల సైతం తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు ధర్మానను ప్రాసిక్యూషన్ కు అనుమతివ్వాలని సిబిఐ ప్రభుత్వం కోరింది. అయితే ప్రాసిక్యూషన్్పై నిర్ణయాన్ని పెండింగ్ లో పెట్టే అవకాశం ఇప్పుడు ప్రభుత్వానికి లేదు. 2జీ వ్యవహారంలో సుబ్రహ్మణ్య స్వామి చిదంబరంపై వేసిన కేసులో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు ప్రకారం, ప్రభుత్వం మూడు నెలల్లోగా ప్రాసిక్యూషన్ పై నిర్ణయం తీసుకోవాలి. లేకుంటే ప్రాసిక్యూషన్ కి ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్టుగా భావించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
అంటే ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రస్తుతానికి పెండింగ్లో ఉంచినా, మూడు నెలల తరువాతైనా సీబీఐ ప్రాసిక్యూట్ చేయక మానదు. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో మరో వర్గం ధర్మాన రాజీనామాను ఆమోదించాల్సిందేనని పట్టుబడుతోంది. కళంకిత మంత్రులను రక్షించే ప్రయత్నం చేయొద్దని కిరణ్ వ్యతిరేక వర్గం ప్రధాన డిమాండ్. రాజీనామా అంశాన్ని హైకమాండ్ పై నెట్టడం సరికాదని వారంటున్నారు. మొత్తానికి జగన్ పై సీబీఐ ఎక్కుపెట్టిన బాణానికి కాంగ్రెస్ పార్టీ కూడా లక్ష్యంగా మారుతుంది. ఇప్పటికే ఘోరంగా దెబ్బతిన్న పార్టీ ప్రతిష్ట ఇప్పుడు మంత్రులపై ఆరోపణలతో మరింత దిగజారే పరిస్థితి ఉన్న నేపథ్యంలో, ధర్మాన విషయంలో హైకమాండ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
...avnk
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more