రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెఢ్డి ముఖంలో .. కొన్ని పద(వి)షాద ఛాయాలు కనిపిస్తున్నాయి. గతంలో ఉన్న వెలుగు ఇప్పుడు ఆయన ముఖంలో కనిపించటంలేదని కాంగ్రెస్ నాయకులే అంటున్నారు. ఆయనలో వేదాంత ధోరణి ఎక్కువగా కనిపిస్తుందని పార్టీ సినియర్ నాయకులు అంటున్నారు. కేంద్ర మంత్రి వయలార్ రవి వచ్చి వెళ్లినప్పటి నుండి .. సీఎం ముఖంలో కిరణాలు వెలుగు తగ్గిందని మీడియా వర్గాలు అంటున్నాయి . ‘‘ ఆయనలో ఉన్న వేదాంత ధోరణి ఇలా బయట పెడుతున్నాడు. మనకు ఆస్తి , ఉద్యోగం రావచ్చు, పోవచ్చు, అలాగే సీఎం పదవి , మంత్రి పదవులు శాశ్వతం కాదు .. ఆయన మీడియా ముందు చెప్పినట్లు తెలుస్తోంది. దీనిని బట్టి .. ఈ నెలలోనే సీఎం మార్పు చేస్తారనే నిజం బయటకు వస్తుందని మీడియా వర్గాలు అంటున్నాయి . ఇప్పుడు సీఎం ను మార్చలంటే సరైన వ్యక్తి కోసం కేంద్రం ఎదురు చూస్తుందట. అయితే ఆ బాటలో మేము ఉన్నాం అంటూ .. జానారెడ్డి, జైపాల్ రెడ్డి, మర్రిశెశిధర్ రెడ్డి, డి. శ్రీనివాస్ ,పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, వి. హనుమంతరావు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కేంద్రం మాత్రం రెండు సమస్యలను మనసు లో పెట్టుకొని సీఎం ను మార్చే ఆలోచన చేస్తున్నట్లు ఢిల్లీ నాయకులు అంటున్నారు. ఒకటి ప్రధాన సమస్య ప్రత్యేక తెలంగాణ. రెండు వైఎస్ జగన్ ? రెండు సమస్యలను దీటుగా ఎదుర్కుకొనే గట్టి నాయకుడు కోసం చూస్తుందని ఢిల్లీ సినియర్ నాయకులు చెబుతున్నారు. కేంద్రం ఒకనోక సమయంలో ..అసలు ముఖ్యమంత్రిని మార్చి పెద్ద తప్పు చేశామనే బాధపడుతున్నట్లు తెలుస్తోంది. సీనియర్ నాయకుడు కొణిజేటి రోశయ్యను మార్చకుండా అలాగే ఉంచినట్లైతే రాష్ట్రంలో ఇన్ని సమస్యలు వచ్చేవి కాదని ..కొంత మంది సీనియర్ నాయకులు అంటున్నారట.
పార్టీ లో కొంత మంది నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, దళితనేత శంకర్రావు, ఎంపీ వి.హన్మంతరావు, హర్షకుమార్, జి. వివేక్, మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్ వంటి నేతలంతా కిరణ్పై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా సీఎంను మార్చాలన్న డిమాండ్తో ఉన్నారని సీనియర్ నాయకులు అంటున్నాయి . అయితే, ముఖ్యమంత్రి సైతం తన పదవి కాపాడుకునేందుకు తీవ్రస్థాయిలోనే ప్రయత్నాలు చేస్తున్నారు. దిగ్విజయ్సింగ్, చిదంబరం వంటి అగ్రనేతల దన్నుతో 2014 వరకూ తానే ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నిస్తున్నారని ఢిల్లీ నాయకులు అంటున్నారు. వారి దన్ను చూసుకునే కిరణ్ సీనియర్ కేంద్రమంత్రి జైపాల్రెడ్డి పై అమీతుమీకి సిద్ధమవుతున్నారని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ముఖ్యమంత్రి కావాలన్న తన చిరకాల వాంఛ తీరినందున, ఇక భయం లేకుండా ఎదురుదాడి చేస్తున్నారంటున్నారు. అటు తెలంగాణ ఎంపీలలో మెజారిటీ శాతం కిరణ్ను వ్యతిరేకిస్తున్నారు. వారంతా ఇటీవలి పరిణామాలలో జైపాల్కు దన్నుగా నిలవడమే కాకుండా, ముఖ్యమంత్రికి వ్యతిరేక ప్రకటనలు చేసి సంచలనం సృష్టించారు. ఇక మంత్రుల పరిస్థితి కూడా గందరగోళంగా మారింది. ఇప్పటికే మంత్రులు మోపిదేవి, ధర్మాన, గీతారెడ్డి, కన్నా, పొన్నాల, సబితా ఇంద్రారెడ్డి పై విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. వారిలో మోపిదేవి ఇప్పటికే అరెస్టయి జైల్లో ఉన్నారు. తాజాగా మంత్రి ధర్మాన పై చార్జిషీట్ దాఖలు చేయడంతో ఆయన తన పదవికి రాజీనామా చేస్తూ ఆ లేఖను సీఎంకు అందచేశారు. దాని ఆమోదం పై హైడ్రామా నడుస్తోంది. ఇక తర్వాత వికెట్ పొన్నాలనే అంటున్నారు. ఇప్పటికే పొన్నాల, సబితను సీబీఐ విచారించిన విషయం తెలిసిందే. ధర్మాన రాజీనామా ఆమోదిస్తే, మొత్తం మంత్రివర్గం చిక్కుల్లో ఇరుక్కోక తప్పదన్న ఆందోళన కనిపిస్తోంది. మొత్తం మీద సీఎం మార్పు జరుగుతుందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు? సీఎం పదవి ఎవరి వరిస్తుందో వేచి చూద్దాం?
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more