మొన్నటి వరకు అతను జగన్ కు ఒక ఆయుధం లాంటి వాడు? జగన్ కు ఉన్న వ్యతిరేక పార్టీలపై ఈ ఆయుధాన్ని ఉపయోగించాడు జగన్. ఈ ఆయుధం ఎక్కడ కనిపించదు. ఒక జగన్ సాక్షి మీడియా లోను , సాక్షి పేపర్లో మాత్రమే ఈ ఆయుధం కనిపిస్తుంది. ఈ ఆయుదం కోసం జగన్ కొన్ని కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. అసలు ఈ ఆయుదం పేరు చెప్పలేదు కదూ. ఈ ఆయుదం పేరు కోలా ఆయుధం. జగన్ కోలా ఆయుధంతోనే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు మీదకు యుద్దానికి దిగటం జరిగింది. ఈ కోలా కొన్ని రోజులు చంద్రబాబుకు, ఇటు రాష్ట్ర ప్రజలకు నిద్రలేకుండా చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు కొన్ని కోట్లు కోలా దగ్గర అప్పు తీసుకున్నాడని, సాక్షి మీడియా లో 24 అవర్స్ ... కోలా గంట కొట్టింది జగన్ మీడియా. చంద్రబాబు ఇలాంటి కోలాలకు ,కొక్కోకోల మూతలకు భయపడకుండా... 420 గాళ్లతో నేను యుద్దం చేయ్యానని మీడియా చెప్పటం తెలిసిన విషయమే. అలా చంద్రబాబును రచ్చ రచ్చ చేసిన కోలా కృష్ణమోహన్ ఇప్పుడు కొత్త కుంభకోణంలో ఇర్కుకున్నాడు. గతంలో కోలా పై నేర చరిత్ర ఉన్నప్పటికి జగన్ కోలాను చంద్రబాబు మీద ఆయుధంగా వాడుకోవటంపై అప్పట్లో మీడియా వర్గాలు గుసగుసలాడుకున్నాయి. పాపం జగన్ మీడియా ఇప్పుడు కోలా ను ఎలా కాపాడుకుంటుందోనని నెల్లూరు ప్రజలు అనుకుంటున్నారు. అసలు విషయం ఏమిటయ్యా అంటే?
యూరో లాటరీ పేరుతో నాయకులను, ప్రజలను బురిడికొట్టించిన విజయవాడవాసి కోలా కృష్ణమోహన్, బంది విజయకుమార్గా నెల్లూరులో అవతారమెత్తాడు. విజయా లాండ్రి పేరుతో రాష్ట్రవ్యాప్తంగా బ్రాంచీలు ప్రారంభిస్తున్నట్లు ప్రకటనలుగుప్పించి నిరుద్యోగుల నుంచి నెల్లూరులోనే రూ. కోటి వరకూ దండుకుని పరారయ్యానట్లు మీడియా వార్తలు వస్తున్నాయి. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం గత ఏడాది జూలైలో ఓ దినపత్రికలో విజయలాండ్రి పేరుతో బ్రాంచీలు ప్రారంభిస్తున్నట్లు ప్రకటనలిచ్చాడని నెల్లూరు ప్రజలు అంటున్నారు.మేనేజర్లు, సూపర్వైజర్లు, మిషన్ ఆపరేటర్లు రూ. 50 నుంచి 60 వేలు, మిషన్ ఆపరేటర్లు, అసిస్టెంట్ ఆపరేటర్లు, బ్రష్ లేడీస్ పోస్టులకు రూ. 30నుంచి 50వేల వరకు డిపాజిట్లు చెల్లించాలని కోలా చెప్పినట్లు బాధితులు అంటున్నారు. మలేషియాలో వారం రోజుల పాటు శిక్షణ ఇప్పిస్తామని చెప్పినట్లు బాధితులు చెబుతున్నారు. జీతం రూ.16వేలు వరకు ఉంటుందని, రెండేళ్లు అగ్రిమెంట్ కుదుర్చుకోవాలని ఆ ప్రకటనలో చెప్పటం జరిగిందట. వందలాది మంది యువకులు లక్షల్లో డిపాజిట్లు చెల్లించటం జరిగిందట. నెల్లూరులోని హరినాథపురంలో ఓ అద్దెఇల్లు తీసుకుని కార్యాలయాన్ని ఏర్పాటు చేసి అందులో నెల్లూరు ఏరియా మేనేజర్గా విజయకుమార్ని నియమించినట్లు వందలాది బాధితులు ఆరోపిస్తున్నారని మీడియా వర్గాలు అంటున్నాయి.
అయితే నెల్లూరు బ్రాంచిలో జనవరి నుంచి జీతాలు ఇవ్వకపోవడంతో సిబ్బంది నిలదీయ్యటంతో . తనకు రూ.2.10కోట్లు రావాల్సి ఉందని, అది వచ్చాక జీతాలిస్తానని కోలా చెప్పటం జరిగిందట. అయితే బాధితులకు అనుమానం రావటంతో కోలా అసలు పేరు విజయకుమార్ కాదని కోలా కృష్ణమోహన్ అని గ్రహించటం జరిగిందట.అయితే కొంతమంది కురుగొండ్లకు చెందిన రమేష్ తనతోపాటు మరికొందరిచేత రూ. 4.50లక్షల వరకు డిపాజిట్ల కింద చెల్లించినట్లు బాధితులు అంటున్నారు. బాధితులకు అనుమానం వచ్చి గట్టిగా నిలదీయడంతో ఏరియా మేనేజర్ రూ.4.50లక్షలకు ఐడీబీఐ బ్యాంకుచెక్కు రమేశ్కు ఇవ్వటం జరిగిందట . అయితే ఆ బ్యాంకు ఖాతాలో సొమ్ము లేదని తేలడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించినట్లు నెల్లూరు మీడియా వాసులు అంటున్నారు. కోలా వారి లీలాలు. ఇలా వ్యక్తికి జగన్ మీడియా రాచమర్యాదలు చేసి.. చంద్రబాబు మీద బురద చల్లే ప్రయత్నం జరిగిందని తెలుగుదేశం పార్టీ నాయకులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more