తనను తెలుగుదేశం పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేశారో చెప్పాలని టిడిపి అదినేత చంద్రబాబు నాయుడును గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ప్రశ్నించినట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. జగన్ తనకు వ్యక్తిగతంగా తెలిసిన మనిషి, గతంలో కూడా నాలుగైదు సార్లు కలిశానని, ఆయన ఇబ్బందులలో ఉన్నారని కలవడానికి వెళ్లానని ఆయన చెబుతున్నారు. జగన్ వద్దకు వెళితే చంద్రబాబు నిప్పులు తొక్కిన కోతి అని తెలిసే, విజయమ్మ వద్దకు వెళ్ళానని, ఇంటి బయటకు వచ్చేసరికి సస్పెన్డ్ చేసినట్లు టీవీలలో వచ్చిందని నాని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ ఏదో నీ సొంత ఆస్తి అనుకున్నట్లు వ్యవహరిస్తున్నావని చంద్రబాబు పై మండిపడినట్లు తెలుస్తోంది. తాను అసలు మాట్లాడకుండా ఉన్నా, జిల్లాకు చెందిన కొందరు కుక్కలను ఉసికొల్పి, తిట్టించి, చివరి ఆయన కూడా తిట్టారని నాని అంటున్నాడని పార్టీ వర్గాలు అంటున్నాయి.
ఎన్.టి.ఆర్.ను వెన్నుపోటు పొడిచినట్లు తనను కూడా బయటకు పంపారని నాని మీడియాకు చెప్పటం చాలా ఆశ్చర్యంగా ఉందని తెలుగుదేశం పార్టీ నాయకులు అంటున్నారు. లక్ష్మీపార్వతిని అడ్డంపెట్టి ఏ విధంగా మెడ పట్టి గెంటించావో, అలాగే లోకేష్ ను పార్టీలోకి తీసుకు రావడానికి చంద్రబాబు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని నాని అంటున్నాడట. అంతేకాకుండా వెన్నుపోటు, కుట్ర వంటి పేటెంట్ లన్నీ చంద్రబాబు బాగా తెలిసిన విద్యాలని ఆయన అంటున్నారు.నలబై చోట్ల ఎన్నికలు జరిగితే ఒక్క చోట గెలవలేదని, సిగ్గు లేకుండా పార్టీ అద్యక్షుడిగా ఎలా ఉన్నారని నాని మీడియా ముందు అడిగినట్లు తెలుస్తోంది. . ఎన్.టి.రామారావుకు అభిమానినని , జూనియర్ ఎన్.టి.ఆర్ తనకు టిక్కెట్ ఇప్పించారని నాని చెబుతున్నారు. ఎన్.టి.ఆర్.పై సవాలు చేసి ఓడిపోయి , కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి టిడిపిలోకి చంద్రబాబు వచ్చి, ఆ పార్టీని స్వాధీనం చేసుకోవటం జరిగిందని నాని అంటున్నాడట.
గుడివాడలో తనను గెలిపిస్తారో లేక, టిడిపిని గెలిపిస్తారో ప్రజలు తేలుస్తారని చెబుతున్నారు. తనకు కనీసం చెప్పకుండా సస్పెండ్ చేయడం చెల్లదని, దీనిపై కోర్టుకు వెళ్తానని అన్నారు. కేంద్రంలో సోనియాగాంధీ, చిదంబరంలతో సంబందాలు పెట్టుకుని కాంగ్రెస్ కు టిడిపిని హోల్ సేల్ గా అమ్మేశారని చంద్రబాబుపై ఆరోపించారు.తనను సస్పెండ్ చేసినందుకు ఎన్.టి.ఆర్.ఆత్మ ఘోషిస్తుందని అన్నారు. రాజ్యసభ సీటును ముప్పై కోట్లకు అమ్ముకున్నారని ఆయన అన్నారు. ఎన్.టి.ఆర్. మాబోటి అభిమానుల కోసం పెట్టిన పార్టీ అని, నీ బోటి పందికొక్కుల కోసం పెట్టిన పార్టీ కాదని అన్నారు. రెండువేల నాలుగులో రెండు సీట్లు జిల్లాలో గెలిస్తే వాటిలో ఒకటి గుడివాడ అని ,మండలాలు, మున్సిపాల్టీ గెలుచుకున్నదని తన ఆధ్వర్యంలో , అదే కుప్పంలో జడ్పిటీసి కూడా ఓడిపోయారని అన్నారు.టిడిపిలో సస్పెన్షన్ ఎత్తివేయకపోతే తాను వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలో చేరతానని, జగన్ తనను ఆహ్వానించారని కూడా ఆయన అన్నారు.చనిపోయిన రాజశేఖరరెడ్డిమీద , జగన్ పైన ఇష్టం వచ్చినట్లు చంద్రబాబు ఆరోపణలు చేసినా ప్రజలు నమ్మలేదని ఆయన అన్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more